మలివయస్సుకు చట్టమే అండ
ఖమ్మం నగరానికి చెందిన వృద్ధ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడున్నారు. వారికి పక్కా ఇల్లు ఉంది. కిరాణ దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. కుమారుడు చనిపోయాడు. దీంతో కోడలు ఉన్న ఇల్లు అమ్మాలని వృద్ధులపై ఒత్తిడి తీసుకు వచ్చి అనేక రకాలుగా హింసించేది. పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టినా
నేడు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
ఖమ్మం ఖానాపురం హవేలి, న్యూస్టుడే
* ఖమ్మం నగరానికి చెందిన వృద్ధ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడున్నారు. వారికి పక్కా ఇల్లు ఉంది. కిరాణ దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. కుమారుడు చనిపోయాడు. దీంతో కోడలు ఉన్న ఇల్లు అమ్మాలని వృద్ధులపై ఒత్తిడి తీసుకు వచ్చి అనేక రకాలుగా హింసించేది. పెద్ద మనుషుల్లో పంచాయితీ పెట్టినా వేధింపులకు ఆపలేదు. దీంతో ఆ వృద్ధులు ఖమ్మం న్యాయసేవా సంస్థకు ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి వారి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. అత్తామామలు, కోడలుతో విడివిడిగా రాజీ కుదిర్చారు. ప్రస్తుతం ఏ సమస్య లేకుండా ఉంటున్నారు.
* పూర్వ ఖమ్మం జిల్లా గార్లకు చెందిన ఓ వృద్ధుడు(75)కి ఇద్దరు కుమారులు కాగా పెద్ద కొడుకు వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నాడు. చిన్న కుమారుడ్ని ఉన్నత చదువులు చెప్పించడంతో ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో భార్య చనిపోయింది. ఏ పనీ చేసుకోలేని నిస్సహాయ స్థితి. ఇద్దరు కుమారులు తండ్రిని పట్టించుకోవడం లేదు. చిన్న కుమారుడి నుంచి జీవన భృతి ఇప్పించాల్సిందిగా న్యాయసేవాధికార సంస్థను ఆశ్రయించారు. కోర్టు అతని కుమారుడితో మాట్లాడి నెల నెలా జీవన భృతి ఇచ్చేలా ఒప్పించింది. ప్రస్తుతం ఆయన భృతి పొందుతున్నారు..
* సమాజంలో కొందరు వృద్ధులు నిరాదరణకు గురవుతున్నారు. మలివయస్సులో ఆసరాగా ఉండాల్సిన తమ వారసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారు. అటువంటి పండుటాకులకు మేమున్నామంటూ భరోసా అందిస్తూ.. వారికి తమ పిల్లల నుంచి భృతి కల్పిస్తోంది ‘తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం-2007’. ఆ చట్టాన్ని అమలు చేస్తూ బాధితులకు చేయూతనిస్తోంది ఖమ్మం న్యాయసేవాధికార సంస్థ. జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 20 కేసులను పరిష్కరించింది. నేడు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ‘న్యూస్టుడే’ కథనం..
పోషణ బాధ్యత పిల్లలదే..
అనేక సమస్యలతో ఉన్న వృద్ధులకు సంక్షేమ చట్టం-2007, నియమావళి-2011 అండగా ఉంటున్నాయి. హిందూ దత్తత, పోషణ చట్టం-1956 ప్రకారం వృద్ధులైన తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే. ఈ విషయంలో పిల్లలను అడిగే హక్కు తల్లిదండ్రులకు ఉంది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్-1973లో సెక్షన్ 125 ప్రకారం తల్లిదండ్రులు తమను తాము పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు చట్టమే వారి పోషణకయ్యే ఖర్చులను పిల్లల నుంచి ఇప్పిస్తుంది. కోర్టులతో సంబంధం లేకుండా వృద్ధుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని(2007) తీసుకువచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వారికోసం నూతనంగా వయోవృద్ధుల పోషణ, సంక్షేమ నియమావళి-2011ను రూపొందించింది.
సున్నితంగా పరిష్కరిస్తాం: మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా, న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ
ఆర్డీవో కోర్టులో వయోవృద్ధుల కేసులు పరిష్కరిస్తారు. అక్కడ రాజీ కుదిర్చినా ఇరువర్గాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయి. కానీ, మా వద్దకు వచ్చే కేసుల్లో తల్లిదండ్రులకు, వారి పిల్లలకు విడివిడిగా కౌన్సెలింగ్ ఇస్తాం. వారి సమస్యను సున్నితంగా పరిష్కరిస్తాం. రాజీ అనంతరం తల్లిదండ్రులు వారి పిల్లలు సంతోషంగా ఉంటున్నారు. న్యాయసేవాధికార సంస్థ చొరవతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో వయోవృద్ధులకు ప్రత్యేకంగా వార్డు ఏర్పాటు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సార్వత్రిక సమరం.. సిబ్బంది సిద్ధం..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఓటరు నమోదు నుంచి అభ్యర్థుల నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి ఘట్టంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు. -
దండుకున్నారు.. తిప్పించుకుంటున్నారు..!
[ 29-03-2024]
కొత్తగూడెం నియోజకవర్గంలో ‘దళితబంధు’ పేరిట భారీగా వసూళ్ల పర్వం సాగింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.3 లక్షలు దండుకున్నారు. ఈవ్యవహారంలో అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు, పురపాలికలోని కొంతమంది ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. -
అసైన్డ్ భూముల్లో కట్టడాల కూల్చివేత
[ 29-03-2024]
ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో అసలు యజమానులు కాకుండా కొనుగోలు చేసినవారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు గురువారం కూల్చివేశారు. -
పిండం దశలోనే పిసికేస్తున్నారు!
[ 29-03-2024]
ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తామని అనుమతులు తీసుకున్న ఆస్పత్రిలో గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ధనార్జన కోసం అనైతిక వైద్యం చేస్తూ పిండ దశలోనే ప్రాణాలు తీసేస్తున్నారు. -
అటు సాధన.. ఇటు శోధన
[ 29-03-2024]
రూ.15వేల రుణం కోసం ఆశపడిన ఐదుగురు మహిళలు, తెలియకుండానే తమ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు నడిపారు. నమ్మించిన యువకుడు ఒక బ్యాంకు ఖాతా పేరు చెప్పి, మరో బ్యాంకు ఖాతా తెరచి మోసగించాడని ఆలస్యంగా గ్రహించారు. -
‘సైబర్’ దోపిడీ సొమ్ము.. అమాయకుల ఖాతాలకు!
[ 29-03-2024]
సైబర్ నేరస్థులు అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, వాటి సాయంతో లూటీ సొమ్మును వాడుకుంటున్నారని ఎస్పీ బి.రోహిత్రాజు గురువారం తెలిపారు. -
ఎండల గండాలకు జాగ్రత్తలే గొడుగు
[ 29-03-2024]
మార్చి నెలలోనే ఎండలు ముదిరాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, పలు పరిశ్రమల ప్రభావిత ప్రాంతాల్లో వేడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటోంది. -
అప్పుల బాధతో యువరైతు బలవన్మరణం
[ 29-03-2024]
పంటల దిగుబడి సరిగా రాలేదన్న మనస్తాపంతో ఓ యువరైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. పాల్వంచ గ్రామీణ ఎస్సై బి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని యానంబైలు గ్రామానికి చెందిన మంత్రి శశికుమార్ (26) నాలుగెకరాల్లో పత్తి, అయిదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. -
మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, కొరియర్ అరెస్టు
[ 29-03-2024]
నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
9 నుంచి శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు
[ 29-03-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు జరిగే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీఓ దామోదర్రావు ఆదేశించారు. రామాలయం ఈఓ రమాదేవితో కలిసి తన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.