logo

ఖాతాదారుల ఆదరణతో బ్యాంకు పురోగమనం

ఖమ్మం నగరంలోని భద్రాద్రి కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు రజతోత్సవ వేడుకలను మంగళవారం గాంధీచౌక్‌లోని ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బ్యాంకు ఛైర్మన్‌ చెరుకూరి కృష్ణమూర్తి కేక్‌ కట్‌ చేశారు.

Published : 05 Oct 2022 04:16 IST

బ్యాంకు ఛైర్మన్‌ చెరుకూరి కృష్ణమూర్తిని సన్మానిస్తున్న ఉద్యోగులు, పాలకవర్గ సభ్యులు

ఖమ్మం గాంధీచౌక్‌, న్యూస్‌టుడే: ఖమ్మం నగరంలోని భద్రాద్రి కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు రజతోత్సవ వేడుకలను మంగళవారం గాంధీచౌక్‌లోని ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బ్యాంకు ఛైర్మన్‌ చెరుకూరి కృష్ణమూర్తి కేక్‌ కట్‌ చేశారు. అనంతరం బ్యాంకు డైరెక్టర్లు, సిబ్బంది కలిసి ఆయనను సన్మానించారు. ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఛైర్మన్‌ కృష్ణమూర్తి మాట్లాడుతూ రూ.55లక్షలతో ప్రారంభించిన బ్యాంకు గత పాతికేళ్లలో అనితరమైన విజయాలతో పురోగమిస్తోందన్నారు. ప్రస్తుతం 1.75 లక్షల మంది ఖాతాదారులతో 16 శాఖలతో రూ.930 కోట్లకుపైగా బ్యాంకింగ్‌ టర్నోవర్‌తో విరాజిల్లుతుందని చెప్పారు. కార్యక్రమంలో బ్యాంకు సీఈవో   వెంకటకామేశ్వరరావు, బ్యాంకు డైరెక్టర్లు రాజారావు, ఉమామహేశ్వరరావు, భాస్కర్‌, సాంబమూర్తి, సంతోష్‌కుమార్‌, ఏజీఎం నారాయణమూర్తి, వివిభ బ్రాంచిల మేనేజర్లు సత్యనారాయణ,  నర్సింహారావు, శ్యాంసుందర్‌, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని