పంజర వలకు ప్రోత్సాహం కరవు
అతి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సంఖ్యలో చేపలను పెంచగలిగే పద్ధతి.. పంజర వల విధానం. నిర్ణీత ప్రాంతంలో వలల మధ్య అధిక సాంద్రత విధానంతో కృత్రిమంగా ఆహారం ఇచ్చి చేపలను పెంచే అవకాశం ఈ విధానంతో సాధ్యమవుతుంది.
పంజరవల విధానంతో చేపల పెంపకం తీరును పరిశీలిస్తున్న రాష్ట్రస్థాయి అధికారులు (దాచిన చిత్రం)
కూసుమంచి, న్యూస్టుడే: చేపల పెంపకానికి సరైన ప్రోత్సాహం లభించడం లేదు.. పంజర వల విధానంలో మత్స్యకారులు వాటాధనం చెల్లించి ఏడాది గడిచినప్పటికీ ఎదురుచూపులే మిగులుతున్నాయి..
అతి తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ సంఖ్యలో చేపలను పెంచగలిగే పద్ధతి.. పంజర వల విధానం. నిర్ణీత ప్రాంతంలో వలల మధ్య అధిక సాంద్రత విధానంతో కృత్రిమంగా ఆహారం ఇచ్చి చేపలను పెంచే అవకాశం ఈ విధానంతో సాధ్యమవుతుంది. ప్లాస్టిక్ డ్రమ్ములు లేదా ఫోటింగ్ కేజెస్(నీట మునగని డబ్బాలు)కు వలలను వేలాడ దీసి జలాశయంలోనే నిర్ణీత ప్రాంతంలో నిలిపి ఉంచి వాటిలో చేపలను పెంచే విధానం ఝార్ఖండ్ రాష్ట్రంలో అమలులో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధ్యయనం చేసి పాలేరు జలాశయంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ఒక్క యూనిట్ ఖర్చు రూ.30 లక్షలు కాగా, 20 శాతం వాటాధనాన్ని మత్స్యకారులు సమకూర్చాల్సి ఉంటుంది. 80 శాతం ప్రభుత్వం రాయితీనిస్తోంది. ఈక్రమంలో పాలేరులో 2016లోనే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. 2017 మరింతగా విస్తృతపరిచారు. మరింతగా ప్రోత్సహిస్తాని మంత్రులు అధికారులు, హామీనిచ్చారు.
వాటాధనం చెల్లించి ఏడాది
ప్రస్తుతం పాలేరు జలాశయంలో 10 యూనిట్ల ద్వారా చేపల పెంపకం సాగుతోంది. తద్వారా 100 మంది మత్స్యకారులు జీవనం సాగిస్తున్నారు. మంచి ఆదాయం గడిస్తున్నారు. ఈక్రమంలో తమనూ ప్రోత్సహించాలంటూ మరో వంద మంది మత్స్యకారులు 10 గ్రూపులుగా ఏర్పడి ఒక్కొక్కరు రూ.60 వేల చొప్పున వాటాధనం చెల్లించారు. ఏడాది గడుస్తున్నప్పటికీ మంజూరు లభించకపోవడంతో ఎదురుచూపులే వారికి శరణ్యమయ్యాయి.
ప్రభుత్వానికి ప్రతిపాదించాం
బి.శ్రీనివాస్, జీఎం రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య
పాలేరు మత్స్యకారులు పది గ్రూపులుగా ఏర్పడి పంజరవల విధానంతో చేపల పెంపకం కోసం తమ వాటాధనం చెల్లించి ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. త్వరలోనే మంజూరయ్యే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటుకు పోటెత్తేలా
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2019లో జరిగిన సార్వత్రిక సమరంలో పోలింగ్ శాతం తక్కువ నమోదవటంపై కారణాలు అన్వేషించింది. -
అయిదో రోజూ నామినేషన్ల సందడి
[ 24-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు. -
ప్రచార తీరు.. మారింది గురూ..!
[ 24-04-2024]
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఊరూరా ర్యాలీలు, మైకుల హోరుతో ప్రచారం జోరుగా సాగేది. శాసనసభ, లోక్సభ స్థానాల బరిలో నిలిచిన అభ్యర్థులు కనీసం ఒక్కసారైనా ప్రతి గ్రామాన్ని చుట్టేసి వచ్చేవారు. -
అడుగడుగునా అడ్డంకులే..
[ 24-04-2024]
సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. -
భద్రాచలం నుంచి తొలి మంత్రి కమలకుమారి
[ 24-04-2024]
ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కర్రెద్దుల కమలకుమారి భద్రాచలం ఎంపీగా నెగ్గి కేంద్రంలో సహాయ మంత్రిగా ఉండి మన్యానికి సేవలు అందించారు. -
పడిపోతున్న ఎండు మిరప ధరలు
[ 24-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎండు మిరప ధరలు పడిపోతున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
దేశ యవనికపై అశ్వారావుపేట పూర్వ విద్యార్థులు సత్తా
[ 24-04-2024]
దేశ యవనికపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపికలో ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. -
కోల్ ప్లాంట్ కింగ్
[ 24-04-2024]
కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్ ప్లాంట్లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు. -
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల పనులపై కలెక్టర్ సమీక్ష
[ 24-04-2024]
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనుల పూర్తి బాధ్యత హెచ్ఎంలదే అని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్ నుంచి హెచ్ఎంలతో వీడియోకాన్ఫరెన్స్లో మంగళవారం మాట్లాడారు. -
అన్నీ బాగుంటేనే అనుమతులు
[ 24-04-2024]
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈనెల 19 నుంచి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.