మంచిని ఆశిద్దాం.. విజయం సాధిద్దాం
చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికే ‘దసరా’.. ఆధునిక కాలంలో మా‘నవ’ జీవనంలో వచ్చిన మార్పులే సమాజంపై మంచి చెడుల్ని నిర్దేశిస్తున్నాయి. ప్రకృతి దుర్వినియోగం, మితిమీరిన సాంకేతిక వినియోగం, అత్యాశలే మనపై దుర్మార్గ శక్తుల్ని, మనలో దుష్ట ఆలోచనల్ని తీసుకొస్తున్నాయి.. సమస్య ఉన్నచోటే పరిష్కారమూ దొరుకుతుంది.
పాల్వంచ పట్టణం, న్యూస్టుడే
చెడుపై మంచి సాధించిన విజయానికి సూచికే ‘దసరా’.. ఆధునిక కాలంలో మా‘నవ’ జీవనంలో వచ్చిన మార్పులే సమాజంపై మంచి చెడుల్ని నిర్దేశిస్తున్నాయి. ప్రకృతి దుర్వినియోగం, మితిమీరిన సాంకేతిక వినియోగం, అత్యాశలే మనపై దుర్మార్గ శక్తుల్ని, మనలో దుష్ట ఆలోచనల్ని తీసుకొస్తున్నాయి.. సమస్య ఉన్నచోటే పరిష్కారమూ దొరుకుతుంది. దసరా పర్వదినం సందర్భంగా ఉభయ జిల్లాల్లో పలు సామాజిక సమస్యలు, వాటిని నియంత్రించాల్సిన ఆవశ్యకతను విశ్లేషిస్తూ కథనం..
చెత్తపై యుద్ధం
శివారులన్నీ ‘చెత్త’ దారులే.. మున్నేరు పక్కన, ముర్రేడు చెంతన నిలువెత్తు రూపం.. మనదే ఆ పాపం..! పట్నంతో పల్లెల పోటీ.. ఎవరికి వారే ‘ఘనా’పాటి చెత్తను చిత్తు చేద్దాం.. దానికి సేంద్రియ రూపమిద్దాం పునర్వినియోగమైతేనే ‘అర్థం’.. ఆరోగ్యం భద్రం
ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఏడు పురపాలికలు, నగరపాలక పరిధిలో నిత్యం 300 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు తయారవుతున్నాయి. కేవలం 65 శాతం మాత్రమే రీసైక్లింగ్ అవుతుండగా మిగిలిన 35 శాతం గుట్టల్లా పేరుకుపోతున్నాయి. రెండు జిల్లాల్లో 44 మండలాల పరిధిలో నిత్యం 220 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను నివాసాల నుంచి సేకరిస్తున్నారు. 2019 వరకు గ్రామాల్లో డంపింగ్ యార్డులు లేవు. వ్యర్థాల పునర్వినియోగం లేకపోవటంతో వ్యర్థాలు సేకరించినా ఉపయోగం లేకుండా పోతోంది.
విజయమిలా..
అన్నిచోట్లా నివాసాల నుంచే తడి, పొడి వ్యర్థాలను వేరుగా సేకరించాలి. తడి వ్యర్థాలతో ఇంట్లోనే సేంద్రియ ఎరువు తయారు చేసుకునేలా అవగాహన కల్పించాలి. మూడు, నాలుగు వార్డులకు కలిపి ఒక తడి, పొడి వనరుల సేకరణ కేంద్రాలను ఏర్పాటుచేయాలి.
ప్లాస్టిక్ను పాతరేద్దాం
పాలిచ్చే గేదెలు మొదలు పరుగెత్తే నదుల దాకా పాలి‘థిన్’ బాధితులే.. అవనిలో కరగని, విరగని రూపం భావితరాలకదే పెద్ద శాపం అడపాదడపా దాడులు.. అవి కాదు పరిష్కారాలు ఏలికలు చెబితే చాలదు.. చూపితేనే ‘ప్రత్యామ్నాయం’ ‘దారి’పడేదాకా హలధారి రూపమెత్తాల్సిందే..!
ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో నిత్యం 100 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటిలో 80 మెట్రిక్ టన్నులు రీసైక్లింగ్ యూనిట్కు పంపుతున్నారు. గ్రామాల్లో 65 మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతున్నా రీసైక్లింగ్ లేదు. పట్టణాలకు పోటీగా పల్లెల్లో పాలిథిన్ వినియోగం పెరగడం ఆందోళనకర అంశం.
* రీసైకిల్ కాని ప్లాస్టిక్ను విడతల వారీగా ఎత్తివేయాలి. ప్రత్యామ్నాయ వస్తువులను విరివిగా అందుబాటులోకి తేవాలి. ఉభయ జిల్లాల్లో స్థానిక మహిళా సంఘాలు, నిరుద్యోగ యువతతో వీటి తయారీని ప్రోత్సహించాలి.
పౌరస్పృహే పరమావధి!
చెప్పేందుకు కాదు.. చేసేందుకే నీతులు పొరుగువారి నుంచి ఆశించినదే నీవాచరించు.. ని‘బంధనాలు’ కావవి.. సమానత్వ సాధనకు దగ్గరి దారులు పదుగురి సౌఖ్యమే పరమావధి కావాలి.. పౌరస్పృహ పాటింపే అందుకు మార్గమన్నది గుర్తెరగాలి..
చాలామంది ప్రధానంగా పట్టణాల్లో చెత్తను కాల్వల్లో, రోడ్డుపై పారవేస్తున్నారు. రూ.లక్షలు వెచ్చించి కొన్న స్థలాల నిర్వహణను గాలికి వదిలేస్తున్నారు. ట్రాఫిక్ ఉల్లంఘన అయితే చెప్పే పనేలేదు.
* 2021-22లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించటంతో ఉభయ జిల్లాల్లో దాదాపు 11 లక్షల మంది అపరాధ రుసుం చెల్లించారు. వ్యక్తిగత క్రమశిక్షణను పాఠశాల స్థాయి నుంచి ఆచరణాత్మకంగా నేర్పటమే పరిష్కారం.
యువతా జరభద్రం
ఉరకలెత్తే వయసు.. పరుగులెత్తే మనసు అగ్నికి వాయువు తోడైనట్టు.. చేతిలో రయ్యుమనే బైక్ రాకెట్టు నిశా కళ్ల నీడలో మిగిలేది ప్రమాద జాడలే.. ‘దారి’ తప్పిన యువతకు మంత్రణమే దివ్యౌషధం.. గతానుభవాలే అధ్యాయాలు.. అమ్మానాన్నల ఆకాంక్షల్ని గుర్తుతేవటమే వేగ నిరోధకాలు!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఏటా పెరుగుతున్నాయి. మృతుల్లో యువత శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మితిమీరిన వేగం, మద్యం మత్తు, అధ్వాన దారులు, మూలమలుపులు, స్పోర్ట్ బైక్ల వినియోగమే ఇందుకు కారణాలు.
* 2021 జనవరి నుంచి 2022 ఆగస్టు వరకు ఉమ్మడి ఖమ్మంలో 645 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకోగా 467 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో 153 మంది 18-35 ఏళ్లలోపు వారుండటం బాధాకరం.
కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పిల్లల్ని కోల్పోయిన తల్లిదండ్రుల వ్యథార్థ జీవితాలను కళ్లకు కట్టినట్టు ఉదహరించాలి. బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు చేపట్టాలి.
ఆశ్రమ విద్యార్థి..
అమ్మ అప్యాయత, నాన్న ఓదార్పును వదిలి వచ్చినవారు.. పేదరికం సేదదీరే ఇంట్లో చదువు సాగక పెట్టేబేడా సర్దుకువచ్చిన వారు.. గురువులే బాధ్యతల బరువులెత్తి భద్రమైన భవితను అందిస్తారని ఆశించి వచ్చినవారు.. మట్టిలో మాణిక్యాలు.. అనుభవాల కలబోతలు వాళ్లు! పాకురుపట్టిన నీళ్లు.. కంటనీరు తెప్పించే కూరలు చెదలు పట్టిన గదులు.. వ్యాధులు తెచ్చే శౌచాలయాలు ఇవి తొలగితేనే ‘గురు’ విద్యకు అర్థం.. పరమార్థం!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాఠశాల, జిల్లా స్థాయి హాస్టళ్లు, ఆశ్రమాలు, గురుకులాలు మొత్తం 360 వరకు ఉన్నాయి. వీటిల్లో 50 వేలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. హాస్టళ్లలో సరిపడా మరుగుదొడ్లు, తాగునీరు, గదులు అందుబాటులో లేక అమ్మాయిల అవస్థలు చెప్పనలవి కావు. ఒక్కో గదిలో 30-50 మంది ఉండాల్సి వస్తోంది. సీజనల్ వ్యాధుల సమయంలో ఒకరికి వస్తే అంతా జ్వరం బారినపడుతున్నారు.
ఒకప్పటితో పోల్చితే వసతి గృహాల నిర్వహణలో అభిలషణీయమైన మార్పులు చాలా వచ్చాయి. మౌలిక వసతులను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తేనే పూర్తి స్థాయి లక్ష్య సాధన సాధ్యమవుతుంది. నిధులు వచ్చేలా, సకాలంలో పనులు పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత జిల్లా ఉన్నతాధికారులదే.
కామపిశాచి..
కామం కళ్లు మూసేస్తోంది.. విలువల వలువల్ని ఊడదీస్తోంది.. పసిప్రాయాన్ని, పచ్చని కాపురాన్ని చిదిమేస్తోంది.. ప్రియుని మోజులో భార్య.. ప్రియురాలి మోజులో భర్త కడుపున పుట్టిన పిల్లల్నీ గుట్టుగా కాలరాయిస్తోంది..! ‘నెట్టింట అశ్లీలత’ నట్టింటే నర్తిస్తోంది.. కర్రుకాల్చే చట్టాలే కాదు.. కాటేసే శక్తులకూ అడ్డుకట్ట వేయాలి నివారణ కంటే నిరోధమే ఉత్తమం!
ఉమ్మడి ఖమ్మంలో 2019 జనవరి నుంచి 2022 ఆగస్టు వరకు 680 పోక్సో కేసులు నమోదయ్యాయి. 2021 జనవరి నుంచి 2022 ఆగస్టు వరకు 427 అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఏటా ఈ కేసుల తీవ్రత పెరుగుతుండటం ఆందోళనకర పరిణామం.
అశ్లీల వెబ్సైట్లు, మాదక ద్రవ్యాల వినియోగం.. ఇలాంటి వాటికి బానిసైన వారే ఎక్కువగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. వారికి మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. సైట్లను, మాదక ద్రవ్యాలను నిరోధించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
[ 19-04-2024]
గత విద్యా సంవత్సరంలో బదిలీ పొంది రిలీవర్ లేనందున రిలీవ్ చేయని ఉపాధ్యాయులను వెంటనే వారు బదిలీ పొందిన స్థానంలో నియమించాలని తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ వీరు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. -
విజేతలకు బహుమతులు అందజేత
[ 19-04-2024]
పొన్నేల్లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి