కలిసి చదివి... కలల సాకారం
వారు నలుగురు మిత్రులు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. కానీ ఏదో వెలితి.. ఉన్నతోద్యోగాలు సాధించాలనేది వారి కల. పట్టుదలతో కృషి చేశారు. ఖమ్మంలో ఓ గది అద్దెకు తీసుకొని కలిసి చదివారు. బృంద చర్చలతో అవగాహన పెంచుకున్నారు
ఉన్నతోద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు
ఎర్రుపాలెం, న్యూస్టుడే
వారు నలుగురు మిత్రులు. ఉపాధ్యాయ వృత్తి చేపట్టారు. కానీ ఏదో వెలితి.. ఉన్నతోద్యోగాలు సాధించాలనేది వారి కల. పట్టుదలతో కృషి చేశారు. ఖమ్మంలో ఓ గది అద్దెకు తీసుకొని కలిసి చదివారు. బృంద చర్చలతో అవగాహన పెంచుకున్నారు. పట్టువదలని విక్రమార్కుల్లా శ్రమించి గ్రూపు-2 ఉద్యోగాలు సాధించి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఉన్నత ఉద్యోగాలు సాధించిన నలుగురు ఉపాధ్యాయుల ప్రస్థానంపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం..
ఉపాధ్యాయుడి నుంచి ఉప తహసీల్దార్గా..
ఎర్రుపాలెం మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన మందడపు రామారావు 2006 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యాడు. తిరుమలాయపాలెం మండలంలోని పడమటి తండా పాఠశాలలో పనిచేస్తూ గ్రూప్-2కు సిద్ధమయ్యారు. మిత్రులతో కలిసి ఖమ్మం నగరంలో ఓ గది అద్దెకు తీసుకుని పాఠశాల నుంచి వచ్చిన తరువాత పరీక్షలకు సమాయత్తమయ్యారు. తొలి ప్రయత్నంలో 2016లో పరీక్ష రాసి ఇంటర్వ్యూలో విజయం సాధించి ఉప తహసీల్దార్గా ఎంపికయ్యారు. హన్మకొండ కలెక్టరేట్లో శిక్షణ పొంది ప్రస్తుతం జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో విధులు నిర్వహిస్తున్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు తెలుగు అకాడమీ పుస్తకాలు, పోటీ పరీక్షల టెస్ట్ పేపర్స్ సిలబస్కు అనుగుణంగా చదవాలి. ‘ఈనాడు’, ఆంగ్ల దిన పత్రికలు చదవడం ద్వారా సామాజిక అంశాలు, బృంద చర్చలతో పరిజ్ఞానం పెరుగుతుంది. నిత్యం 8 గంటలు శ్రమించా.
సబ్ రిజిస్ట్రార్గా స్ఫూర్తిదాయక పయనం
ఇల్లెందు పట్టణానికి చెందిన నూకలపాటి అప్పారావు 2002 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. చింతకాని మండలంలోని తిమ్మినేనిపాలెం ఉన్నత పాఠశాలలో పని చేస్తూ.. గ్రూపు-2కు సిద్ధమయ్యారు. తొలి ప్రయత్నంలో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ రావటంతో చేరకుండా రెండో ప్రయత్నం చేశారు. 2016లో గ్రూపు-2 పరీక్షలో సబ్ రిజిస్ట్రార్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం కరీంనగర్ సుల్తానాబాద్లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు తెలుగు అకాడమీ, అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవాలి. ప్రణాళికబద్ధంగా చదవాలి. ప్రతి సబ్జెక్టుపై అవగాహన పెంచుకొని లక్ష్య సాధనకు శ్రమించాలి.
ఇల్లందకుంట ఈవోగా విధులు
నేలకొండపల్లి మండలంలోని అప్పలనర్సింహాపురం గ్రామానికి చెందిన కందుల సుధాకర్ 2003 డీఎస్సీ నెగ్గి ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. తిరుమలాయపాలెం మండలంలోని రావిచెట్టుతండాలో పనిచేస్తూ గ్రూపు-2కు సిద్ధమయ్యారు. తొలి ప్రయత్నంలో ఎక్సైజ్ ఎస్సైగా ఉద్యోగం వచ్చినా చేరలేదు. రెండో ప్రయత్నంలో 2016లో దేవాదాయ శాఖలో ఈఓగా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని ఇల్లందకుంట ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పాఠశాలకు వెళ్లి వచ్చి మిత్రులతో కలిసి గదిలో చదివి పరీక్షలకు సిద్ధమయ్యా. ప్రతి సబ్జెక్టును చర్చించి అవగాహన పెంచుకున్నా.
సెలవు పెట్టి చదివి కొలువు సాధన
జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామానికి చెందిన లంకా ఫణికిషోర్ 2002 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. చింతకాని మండలం పాతర్లపాడు పాఠశాలలో పనిచేస్తూ గ్రూపు-2కు సిద్ధమయ్యారు. తొలిసారి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టు వస్తే చేరకుండా రెండోమారు 2016లో ఉప తహసీల్దార్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం జనగామ జిల్లాలోని లింగాలఘన్పూర్ మండలంలో పని చేస్తున్నారు.
పాఠశాలకు రెండు నెలలు సెలవు పెట్టి సిద్ధమయ్యా. కోచింగ్ లేకుండా తెలుగు అకాడమీ పుస్తకాలను చదివా. ప్రతిరోజూ 10 నుంచి 15 గంటలు ప్రిపేర్ అయ్యా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
[ 19-04-2024]
గత విద్యా సంవత్సరంలో బదిలీ పొంది రిలీవర్ లేనందున రిలీవ్ చేయని ఉపాధ్యాయులను వెంటనే వారు బదిలీ పొందిన స్థానంలో నియమించాలని తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ వీరు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. -
విజేతలకు బహుమతులు అందజేత
[ 19-04-2024]
పొన్నేల్లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె