Khammam: వయసు 27.. వార్షిక వేతనం రూ.3.20 కోట్లు
అతని వయస్సు 27 ఏళ్లు.. వార్షిక వేతనం రూ.3.20 కోట్లు.. ప్రముఖ గూగుల్ సంస్థలో ఉద్యోగం.. మన్యంలో పుట్టిన మాణిక్యం కొండా అఖిల్ ప్రతిభ ఇది..
ఇల్లెందు, న్యూస్టుడే: అతని వయస్సు 27 ఏళ్లు.. వార్షిక వేతనం రూ.3.20 కోట్లు.. ప్రముఖ గూగుల్ సంస్థలో ఉద్యోగం.. మన్యంలో పుట్టిన మాణిక్యం కొండా అఖిల్ ప్రతిభ ఇది. ఖమ్మం జిల్లా ఇల్లెందు మండలం సుభాష్నగర్ గ్రామానికి చెందిన కొండా నారాయణ, రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు. నారాయణ ఆర్ఎంపీగా పనిచేస్తూ మెడికల్ దుకాణం నడిపేవారు. కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. మొదటి కుమార్తె ప్రగతి బీడీఎస్, రెండో కుమార్తె పవిత్ర ఎంఫార్మసీ, మూడో కుమార్తె ప్రశాంతిని సాఫ్ట్వేర్ చదివించి పెళ్లిళ్లు చేశారు. అఖిల్ను చదివించే క్రమంలో ఆర్థిక సమస్యలు మరింత పెరిగాయి. 1నుంచి 5వ తరగతి వరకు పలు ప్రైవేటు పాఠశాలల్లో చదివించాల్సి వచ్చింది. పాఠశాలలో ఫీజులు చెల్లించలేని పరిస్థితిలో ఓ డ్రిల్ మాస్టర్ సింగరేణి పాఠశాలలో చేర్పించేందుకు సహకరించాడు. తానే ఫీజు చెల్లించి నారాయణకు అండగా నిలిచాడు.
గూగుల్లో ఉద్యోగం
హైదరాబాద్లోని ఓ ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థ 7వ తరగతిలో చేరేందుకు ప్రవేశ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో అఖిల్ ఉమ్మడి ఏపీలో ఆరో స్థానం సాధించాడు. దీంతో ఆ విద్యాసంస్థ అఖిల్కు 7వ తరగతి నుంచి ఇంటర్(ఎంపీసీ) పూర్తయ్యే వరకు ఉచితంగా అన్ని రకాల సౌకర్యాలు కల్పించింది. ఐఐటీ ప్రవేశ పరీక్షలో 1,200 ర్యాంకు రావడంతో ఖరగ్పూర్ ఐఐటీ కాలేజీలో సీటు లభించింది. అక్కడ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశాడు. అమెరికా వెళ్లి ఎంఎస్ చదవాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో తిరిగి ఇల్లెందుకు వచ్చి ఓ ప్రైవేటు సంస్థలో రెండేళ్లు చిన్నపాటి ఉద్యోగం చేశారు. తనలో ఉన్న కోరికను నెరవేర్చుకునేందుకు తండ్రి సహకారంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు బ్యాంకులో విద్యా రుణం(ఎడ్యుకేషన్ లోన్) రూ.80 లక్షలు తీసుకున్నాడు. ఇతరుల వద్ద రూ.20 లక్షలు అప్పు తీసుకున్నారు. అనంతరం న్యూయార్క్ నగరంలోని కొలొంబియా యూనివర్సిటీలో ఎంఎస్లో చేరాడు. 2022 మేలో చదువు పూర్తి చేశాడు. వార్షిక వేతనం రూ.3.2 కోట్లు ఇచ్చేందుకు గూగుల్ సంస్థ అఖిల్తో ఒప్పందం చేసుకుంది. 2022 జులై 11న అఖిల్ కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన సంస్థలో స్టేజ్-2 అధికారిగా చేరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది