Passport: పాస్పోర్టు విచారణ నాలుగు రోజులే!
పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. పోలీసు విచారణ ఎప్పుడు జరుగుతుందో, వారు ఎప్పుడు వస్తారో తెలియక దరఖాస్తుదారులు ఆందోళనకు గురయ్యేవారు.
ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే
పాస్పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి నిరీక్షించాల్సి వచ్చేది. పోలీసు విచారణ ఎప్పుడు జరుగుతుందో, వారు ఎప్పుడు వస్తారో తెలియక దరఖాస్తుదారులు ఆందోళనకు గురయ్యేవారు. వారు వచ్చినపుడు అందుబాటులో లేకుంటే పరిస్థితి ఏంటి? పాస్పోర్టు ఇస్తారా, తిరస్కరిస్తారా అనే సందేహాలు ప్రజలను వేధించేవి. వీటిని అధిగమించేందుకు తెలంగాణ పోలీసు శాఖ వెరీఫాస్ట్ అనే సాప్ట్వేర్ను ప్రవేశపెట్టింది. దీంతో పాస్పోర్టు జారీ ప్రక్రియ మరింత వేగవంతమైంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో వేగంగా పాస్పోర్టు జారీకి వెరిఫికేషన్ను పూర్తి చేస్తున్నారు. దేశస్థాయిలో తెలంగాణ పోలీసు శాఖ పాస్పోర్టుల జారీలో మూడుసార్లు ది బెస్ట్ వెరిఫికేషన్ అవార్డును కేంద్ర విదేశాంగ శాఖ నుంచి అందుకుంది. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం పాస్పోర్టు కేంద్రానికి అందిన దరఖాస్తులను ఆధునిక సాంకేతిక విధానంలో విచారణ వేగవంతంగా సాగిస్తున్నారు.
అందివచ్చిన ‘వెరీఫాస్ట్’ సాంకేతికత
రాష్ట్ర పోలీసు శాఖ ప్రవేశపెట్టిన వెరీఫాస్ట్ అప్లికేషన్తో ప్రజలకు పాస్పోర్టు అందించేందుకు విచారణను వేగవంతం చేస్తున్నారు. దరఖాస్తు చేసిన నాలుగురోజుల్లోనే వెరిఫికేషన్ను పోలీసులు పూర్తి చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఇది రికార్డు సమయం కావడం విశేషం. ప్రస్తుతం పాస్పోర్టు కోసం దరఖాస్తు చేసిన వారి ఇంటికి వెళ్లి విచారణ చేసి వారు చెప్పిన వివరాల్లో వాస్తవాలను నిర్ధారించి పాస్పోర్టు కార్యాలయానికి పోలీసులు నివేదిక అందిస్తున్నారు. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా దరఖాస్తుదారులు విచారణ ప్రక్రియను తెలుసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతోపాటు కాల్ సెంటర్ ద్వారా విచారణకు వెళ్లిన పోలీసుల పనితీరు, ప్రవర్తనను అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. విచారణకు వెళ్లిన వారు ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిస్తే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటారు. ఈ విషయంలో జిల్లా పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి ఆరోపణలు ఎదుర్కోలేదు.
పాస్పోర్టు దరఖాస్తుల విచారణకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నాం. నాలుగు రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేస్తున్నాం. ఇది ఎంతో పారదర్శకంగా జరుగుతుంది. ఎలాంటి ఆరోపణలు వచ్చినా సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
-విష్ణు ఎస్ వారియర్, సీపీ, ఖమ్మం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారేపల్లిలో భాజపా అభ్యర్థి రోడ్ షో
[ 25-04-2024]
కారేపల్లి ప్రధాన రహదారిలో భాజపా ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు గురువారం రోడ్ షో నిర్వహించారు. -
ఆ ఊట నీళ్లే వారికి అమృతం.. 30 ఏళ్లుగా తాగుతున్న ఆదివాసీలు
[ 25-04-2024]
చర్ల మండలంలోని మారుమూల పల్లె వెంకటచెరువులో ఆదివాసీలు ఇప్పటికీ ఊటనీటినే తాగుతున్నారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!