2014 తర్వాతే అక్కడ అటవీ ఆక్రమణలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు దారుణహత్య నేపథ్యంలో వివాదానికి కారణమైన బెండాలపాడు అటవీ ప్రాంతాన్ని అటవీశాఖ మరోసారి నూతన సాంకేతిక పద్ధతుల్లో విశ్లేషించింది.
బెండాలపాడు అటవీ ప్రాంతంపై అటవీశాఖ శాస్త్రీయ విశ్లేషణ
2014లో ఆక్రమణలు, ఆవాసాలు లేకుండా పచ్చదనంతో కళకళలాడుతున్న ప్రదేశం
ఈనాడు, హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ అటవీ రేంజ్ అధికారి శ్రీనివాసరావు దారుణహత్య నేపథ్యంలో వివాదానికి కారణమైన బెండాలపాడు అటవీ ప్రాంతాన్ని అటవీశాఖ మరోసారి నూతన సాంకేతిక పద్ధతుల్లో విశ్లేషించింది. బెండాలపాడు అటవీ ప్రాంతంలో గొత్తికోయలు అడవిని నరికేసి పోడు సాగును మొదలుపెట్టింది, అక్కడ నివాసాలు ఏర్పాటుచేసుకుంది 2014 తర్వాతేనని అటవీశాఖ ప్రధాన కార్యాలయం అరణ్యభవన్లోని జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (జీఐఎస్) సెల్ నిర్ధారించింది. బెండాలపాడులో అక్కడి అటవీ ప్రాంతం 2010లో ఎలా ఉంది? 2014లో, 2002లో ఇలా వేర్వేరు సంవత్సరాల్లో అక్కడి క్షేత్రస్థాయి పరిస్థితుల్ని ఉపగ్రహ ఛాయాచిత్రాలతో విశ్లేషించింది. 2010లో అక్కడ గొత్తికొయల నివాసాలు ఏమీ లేవు. 2014 నుంచి క్రమక్రమంగా పోడు సాగు, ఇళ్ల ఏర్పాటుచేసుకున్నట్లు జీఐఎస్ సెల్ గుర్తించింది. 2022 నాటికి అక్కడ పెద్దమొత్తంలో అటవీ ప్రాంతాన్ని నరికేసి నివాసాలు ఏర్పాటుచేసుకున్నట్లు ఛాయాచిత్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోడు సాగులో 25 ఎకరాల్ని స్వాధీనపరచుకుని మొక్కలు నాటడంతో ఆయనపై కక్ష పెంచుకున్న గొత్తికోయలు హత్య చేశారు.
గొత్తికోయలను బహిష్కరించాలని తీర్మానం
చంద్రుగొండ: భారత రాజ్యాంగ దినోత్సవం రోజు గొత్తికోయలను గ్రామం నుంచి బహిష్కరిస్తూ తీర్మానించిన ఘటన బెండాలపాడులో చోటుచేసుకుంది. అటవీ రేంజర్ శ్రీనివాసరావుని గొత్తికోయలు హత్య చేసిన నేపథ్యంలో శుక్రవారం గ్రామసభలో ఈమేరకు తీరానించారు. బెండాలపాడు సమీపంలోని అటవీప్రాంతంలోని ఎర్రబోడులో నివసిస్తున్న గొత్తికోయల వల్ల ఇబ్బందికరంగా ఉందని, వారంతా గంజాయి, విప్పసారా తాగుతున్నారని గ్రామస్థులు ఆరోపించారు. మారణాయుధాలతో సంచరిస్తున్నారని, విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రం ఛత్తీస్గఢ్కు గొత్తికోయలను పంపించాలన్నారు. తీర్మాన పత్రాన్ని కార్యదర్శి సతీష్కు సర్పంచి పూసం వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ అంశంపై తహసీల్దారు రవికుమార్ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ గ్రామం నుంచి బహిష్కరించే హక్కు లేదన్నారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీటిని తప్పనిసరిగా పరీక్షించాలి
[ 28-03-2024]
ప్రజలకు సరఫరా చేసే తాగునీటికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఎంపీడీవో రామకృష్ణ సూచించారు. -
కార్యకర్తలకు అండగా ఉంటా: పాయం
[ 28-03-2024]
కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండలంలో గురువారం పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
[ 28-03-2024]
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వాహనాన్ని బయ్యారం అడ్డరోడ్డులోని ఎన్నికల తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు సోదా చేశారు. -
దుస్తుల పంపిణీ
[ 28-03-2024]
పినపాక మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థులకు గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. -
కాంగ్రెస్లో చేరిన భారాస సొసైటీ డైరెక్టర్
[ 28-03-2024]
భారాసకు చెందిన కారేపల్లి సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ గురువారం కాంగ్రెస్ లో చేరారు. -
కరవు తీరా పని..!
[ 28-03-2024]
కరవు పరిస్థితులతో వ్యవసాయ కూలీ పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గ్రామీణులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దన్నుగా నిలుస్తోంది. -
మూడు ప్రైవేట్ ఆసుపత్రుల సీజ్
[ 28-03-2024]
ఖమ్మం నగరంలో మూడు ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాలతి తెలిపారు. ఉన్నతాధికారులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఖమ్మంలోని వివిధ ఆసుపత్రుల్లో బుధవారం తనిఖీచేశారు. -
‘గాడి’న పడకుంటే.. గత్తర గత్తర
[ 28-03-2024]
అనేక మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కొన్ని మార్గాల్లో యువకులు పోటీలు పడుతూ ద్విచక్ర వాహనాలను అతివేగంతో వంకరటింకరగా నడుపుతున్నారు. -
ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి: తాండ్ర
[ 28-03-2024]
అయోధ్య-భద్రాద్రి ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
డ్రాగన్ పండు.. లాభాలు మెండు
[ 28-03-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు, విద్యాధికులు, యువ రైతులు సైతం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. -
ఆ ఇద్దరు దోచేస్తున్నారు..!
[ 28-03-2024]
‘దేశీ శిక్షణలో భాగంగా అధికారులకు రూ.10వేలు చెల్లించి తరగతులకు హాజరయ్యాను. ఒక్కరోజు గైర్హాజరైతే రూ.3వేలు వసూలు చేశారు. -
ఆక్రమణల చెరలోనే సాగర్ కాల్వలు
[ 28-03-2024]
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మధిర బ్రాంచి కెనాల్ పరిధిలో ఉన్న ఊటుకూరు, మధిర మేజర్ కాల్వలు కబ్జాకు గురయ్యాయి. -
మద్యం మత్తులో యువకుల హల్చల్
[ 28-03-2024]
చంద్రుగొండలో మద్యం మత్తులో ఐదుగురు యువకులు పలువురిపై దాడిచేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. -
నిలబడలేకున్నా.. ఆసరా అందించరూ..
[ 28-03-2024]
నిరుపేద దంపతులు రెక్కల కష్టమ్మీద ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరి పెళ్లిళ్లు చేశారు. ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. -
మద్యం తాగాడని ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడి నిర్బంధం
[ 28-03-2024]
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరై విద్యార్థులను కొట్టాడని పాఠశాలలో ఉంచి తాళం వేసిన ఘటన చర్ల మండలంలో చోటుచేసుకుంది. -
రామయ్య హుండీలో కాసుల గలగల..!
[ 28-03-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలోని మూడు రకాల హుండీలు కాసులతో కళకళలాడాయి. 26 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. జనరల్ హుండీల ద్వారా రూ.71,22,878 సమకూరింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్