అనవసర రుణం.. అప్పులపాలయ్యే మార్గం!
స్వయం సహాయక మహిళా సంఘాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వడ్డీలేకుండా ప్రభుత్వం బ్యాంకు అనుసంధాన(లింకేజీ) రుణాలను అందిస్తోంది. ఇందుకోసం సెర్ప్ ఉద్యోగులు గ్రామాల్లో సంఘాల్లోని మహిళలకు అవగాహన కల్పించి వారికి రుణాలను అందిస్తున్నారు
ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్టుడే
స్వయం సహాయక మహిళా సంఘాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా వడ్డీలేకుండా ప్రభుత్వం బ్యాంకు అనుసంధాన(లింకేజీ) రుణాలను అందిస్తోంది. ఇందుకోసం సెర్ప్ ఉద్యోగులు గ్రామాల్లో సంఘాల్లోని మహిళలకు అవగాహన కల్పించి వారికి రుణాలను అందిస్తున్నారు. రుణాలతో వారు వివిధ వ్యాపారాలు, అవసరాలను తీర్చుకొని తిరిగి నెలవారీ పద్ధతిలో చెల్లిస్తున్నారు. వీటి పర్యవేక్షణకు, మహిళలను చైతన్యం చేసేందుకు గ్రామస్థాయిలో సీసీలు, మండల స్థాయిలో ఏపీఎంలు, జిల్లా స్థాయిలో డీపీఎంలు ఉంటారు. కానీ రుణ లక్ష్యాలు పెంచుతూ సెర్ప్ అధికారులు ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా ఆ శాఖ ఉద్యోగుల ఐకాస ఆందోళన బాట పట్టింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డీఆర్డీవోలకు తమ సమస్యలు వివరిస్తూ వినతిపత్రాలు అందించింది.
నవంబరులో భారీగా పెంపు
క్షేత్రస్థాయిలో మహిళా సంఘాల వాస్తవ అవసరాల ఆధారంగా సూక్ష్మరుణ ప్రణాళికలను ఏటా తయారు చేస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు రుణలక్ష్యాన్ని విధించారు. ఉన్నట్టుండి సెర్ప్ అధికారులు నవంబర్ నెలలో రుణలక్ష్యాన్ని భారీగా పెంచారు. కానీ సంఘాల సంఖ్య పెంచలేదు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా పెంచడంతో లక్ష్యాన్ని సాధించడానికి సెర్ప్ అధికారులు ఎక్కువగా కష్టపడాల్సి వస్తోంది.
అదనంగా ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాలిమహిళా సంఘాల సభ్యులు బ్యాంకు లింకేజీతో పాటు ఇదే సెర్ప్లోని ఇతర విభాగాలు స్త్రీనిధి, మండల సమైక్య, మైక్రోఫైనాన్స్ నుంచి రుణాలు తీసుకుంటారు. వీటిని నెలవారీగా క్రమంతప్పకుండా చెల్లించాలి. ఇలా రుణలక్ష్యాన్ని పెంచడం వల్ల అవసరం లేకున్నా మహిళలు రుణాలను తీసుకుంటే ఆయా సంఘాల్లోని సభ్యులు అప్పుల పాలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్పీఏ సైతం ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. ఇలా అవసరం లేకున్నా రుణాలను మంజూరు చేయడం వల్ల బ్యాంకులకు అదనంగా ప్రాసెసింగ్ ఫీజులు చెల్లించాల్సి వస్తుంది.
మహిళా సంఘాలకు అందించే అనుసంధాన రుణలక్ష్యాన్ని ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా పెంచారు. సెర్ప్ ఉన్నతాధికారులు ఇచ్చిన లక్ష్యాన్ని చేరేందుకు ఉద్యోగులు పనిచేయాలి. అర్హత కలిగిన ప్రతి మహిళకు రుణాన్ని అందించాలి.
విద్యాచందన, డీఆర్డీవో
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటుకు పోటెత్తేలా
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2019లో జరిగిన సార్వత్రిక సమరంలో పోలింగ్ శాతం తక్కువ నమోదవటంపై కారణాలు అన్వేషించింది. -
అయిదో రోజూ నామినేషన్ల సందడి
[ 24-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు. -
ప్రచార తీరు.. మారింది గురూ..!
[ 24-04-2024]
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఊరూరా ర్యాలీలు, మైకుల హోరుతో ప్రచారం జోరుగా సాగేది. శాసనసభ, లోక్సభ స్థానాల బరిలో నిలిచిన అభ్యర్థులు కనీసం ఒక్కసారైనా ప్రతి గ్రామాన్ని చుట్టేసి వచ్చేవారు. -
అడుగడుగునా అడ్డంకులే..
[ 24-04-2024]
సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. -
భద్రాచలం నుంచి తొలి మంత్రి కమలకుమారి
[ 24-04-2024]
ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కర్రెద్దుల కమలకుమారి భద్రాచలం ఎంపీగా నెగ్గి కేంద్రంలో సహాయ మంత్రిగా ఉండి మన్యానికి సేవలు అందించారు. -
పడిపోతున్న ఎండు మిరప ధరలు
[ 24-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎండు మిరప ధరలు పడిపోతున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
దేశ యవనికపై అశ్వారావుపేట పూర్వ విద్యార్థులు సత్తా
[ 24-04-2024]
దేశ యవనికపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపికలో ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. -
కోల్ ప్లాంట్ కింగ్
[ 24-04-2024]
కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్ ప్లాంట్లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు. -
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల పనులపై కలెక్టర్ సమీక్ష
[ 24-04-2024]
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనుల పూర్తి బాధ్యత హెచ్ఎంలదే అని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్ నుంచి హెచ్ఎంలతో వీడియోకాన్ఫరెన్స్లో మంగళవారం మాట్లాడారు. -
అన్నీ బాగుంటేనే అనుమతులు
[ 24-04-2024]
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈనెల 19 నుంచి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.