గుండాల ఎంపీటీసీ సభ్యుడు హఠాన్మరణం
తెదేపా సీనియర్ నాయకుడు, గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని (55) శనివారం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. గుండాల నుంచి సొంత జీపులో ఇల్లెందు వెళ్లారు
సంధాని
గుండాల, న్యూస్టుడే: తెదేపా సీనియర్ నాయకుడు, గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని (55) శనివారం గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. గుండాల నుంచి సొంత జీపులో ఇల్లెందు వెళ్లారు. అక్కడినుంచి తన స్నేహితుని కారులో కొత్తగూడెం వెళ్తుండగా టేకులపల్లి మండలం సులానగర్ వద్ద గుండెపోటుకు గురయ్యారు. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అతణ్ని అదే కారులో కొత్తగూడెం పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతునికి భార్య సల్మా, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంధాని స్వస్థలం గుండాల.
స్పందించే మనస్తత్వం..: ఆపదొస్తే నేనున్నానంటూ స్పందించే మనస్తత్వం సంధానిది. అందరితో స్నేహభావంగా ఉండేవారు. దశాబ్దాల క్రితం చండ్ర పుల్లారెడ్డి హయాంలో అజ్ఞాత దళాలు ఉమ్మడిగా పనిచేశాయి. నక్సల్స్ కార్యకలాపాలకు ఆకర్షితుడైన సంధాని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యకు జీపు డ్రైవర్గా కొంతకాలం పనిచేశారు. అనంతరం పార్టీలో వర్గ విభేదాలు తలెత్తాయి. అదే సమయంలో ఎన్టీఆర్ తెదేపాను స్థాపించడంతో 1984 పార్టీలో కార్యకర్తగా చేరారు. అప్పటినుంచి క్రియాశీలకంగా పనిచేశారు. అప్పుడున్న పరిస్థితుల్లో వివిధ అజ్ఞాత నక్సల్స్ గ్రూపులకు చెందిన నాయకులు అధికార పార్టీలోవున్న వారిని టార్గెట్ చేసేవారు. అయినా బెదరకుండా సంధాని అందరితో సంబంధాలు సాగిస్తూ ముందుకెళ్లేవారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుని వద్ద గుర్తింపు ఉంది. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ములుగు ఎమ్మెల్యే సీతక్కతో సత్సంబంధాలు ఉండేవి. ప్రస్తుతం గుండాల ఎంపీటీసీ, తెదేపా మహబూబాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన మృతిపై పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల వాసులు సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రేగా కాంతారావు సంధాని భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం