logo

వెలిసిన మావోయిస్టుల కరపత్రాలు

దండుపేట రహదారిలో శనివారం మావోయిస్టుల గోడపత్రికలు వెలిశాయి. డిసెంబరు 2 నుంచి 8 వరకు నిర్వహించనున్న పీఎల్‌జీఏ వారోత్సవాలను గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

Published : 27 Nov 2022 05:15 IST

చర్ల, న్యూస్‌టుడే: దండుపేట రహదారిలో శనివారం మావోయిస్టుల గోడపత్రికలు వెలిశాయి. డిసెంబరు 2 నుంచి 8 వరకు నిర్వహించనున్న పీఎల్‌జీఏ వారోత్సవాలను గ్రామాల్లో ఘనంగా నిర్వహించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరిట ఈ గోడపత్రాలు వెలిశాయి. ఓ ప్రభుత్వ కార్యాలయం సమీపంలోనూ ప్రతక్షమయ్యాయి. మండలంలోని వివిధ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని