ఏమార్చుతూ.. అడ్డదారులు తొక్కుతూ...
నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లు కన్నవారికి భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని అమలుచేస్తోంది.
ఈటీవీ- ఖమ్మం, సత్తుపల్లి, న్యూస్టుడే
* సత్తుపల్లికి చెందిన ఓ బాలికకు ఎనిమిది నెలల క్రితం వివాహమైంది. కల్యాణలక్ష్మి పథకానికి అర్హత లేదని తెలుసుకున్న దళారులు రంగప్రవేశం చేశారు. బాలిక ‘ఆధార్’ మార్చేశారు. ఆ తర్వాత కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేశారు. ప్రభుత్వ సాయమందింది. ముందస్తు ఒప్పందం ప్రకారం దళారులు రూ.30వేలను తమ జేబుల్లో వేసుకున్నారు.
* భద్రాద్రి జిల్లా కేంద్రం సమీపంలోని మండలానికి చెందిన ఒకామె వివాహమైన తరువాత కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు దళారీని ఆశ్రయించారు. పకడ్బందీ ప్రణాళికతో దరఖాస్తు చేశారు. క్షేత్రస్థాయిలో విచారణకు వెళ్లిన రెవెన్యూ అధికారులకు అనుమానమొచ్చింది. విద్యార్హత ధ్రువపత్రాలు అందించాలని కోరారు. చదువుకోలేదని బదులివ్వడటంతో వెనుదిరిగారు. మరోరోజు సిబ్బందిని పంపించి విచారణ జరపగా ఆమె చదువుకున్నట్లు మాత్రమే కాదు మైనర్గా తేల్చారు. దరఖాస్తును తిరస్కరించారు.
నిరుపేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లు కన్నవారికి భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని అమలుచేస్తోంది. పెళ్లి ఖర్చుల నిమిత్తం రూ.1,00,116 చొప్పున అందిస్తోంది. లబ్ధిదారుల కుటుంబాల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకుని అధికారుల సహకారంతో కొందరు వక్రమార్గంలో లబ్ధి పొందుతున్నారు. అడ్డదారుల్లో ఆధార్లో పుట్టిన తేదీలు మార్చి ప్రభుత్వ సాయమందేలా చూస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.20వేల నుంచి రూ.30వేల వరకు దళారులు దండుకుంటున్నారు.
లబ్ధి చేకూరాలిలా..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వేలాది నిరుపేద ఆడపిల్లల కుటుంబాలకు ప్రభుత్వ సాయమందింది. పెళ్లి చేసుకునే అమ్మాయి వయస్సు 18 ఏళ్లు, వరుడి వయస్సు 21 దాటితేనే ఈ పథకానికి అర్హులు. ఇద్దరిలో ఏ ఒక్కరికి అంతకన్నా తక్కువ వయస్సున్నా పథకం వర్తించదు. పెళ్లికూతురు ఆధార్, పదోతరగతి మెమో, కుల, ఆదాయ ధ్రువపత్రాలు, పాస్పోర్ట్ సైజు ఫొటోను దరఖాస్తుకు జతపరచాలి. వరుడి ఆధార్ కార్డు, పదోతరగతి మెమో, కుల ధ్రువపత్రం సమర్పించాలి. పెళ్లి కార్డు, వివాహ ధ్రువపత్రం, గెజిటెడ్ అధికారి సంతకం, పెద్దల వాంగ్మూలాలను దరఖాస్తుకు జతపరచాలి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ‘చెక్’ పెళ్లికూతురు తల్లి పేరిట మంజూరవుతుంది.
తూతూమంత్రంగా పరిశీలన
అర్హులకు అందాల్సిన ప్రభుత్వ పథకాన్ని కొందరు దళారులు పక్కదారి పట్టిస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాల ఎదుట తిష్ఠవేసి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన లబ్ధిదారుల కుటుంబీకులతో ముందే బేరం కుదుర్చుకుంటున్నారు. అనర్హులకైనా పథకం వర్తింపజేస్తామని నమ్మిస్తున్నారు. ఉభయ జిల్లాల్లో దళారుల ముఠాలు విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసే ప్రక్రియ నుంచి ప్రభుత్వ సొమ్ము అందేవరకు తామే చూసుకుంటామని అభయమిస్తున్నాయి. ఆధార్లో వయస్సు మార్చడంతోపాటు చదువుకోలేదని చెప్పి దరఖాస్తు చేసి ప్రభుత్వ సాయాన్ని అందిన కాడికి లాక్కుంటున్నారు. కొందరు తనిఖీ అధికారులు క్షేత్రస్థాయిలో తూతూమంత్రంగా దరఖాస్తులను పరిశీలించటం వల్లే అక్రమార్కుల పంట పండుతోందనే వాదనలు వ్యక్తమవుతున్నాయి.
అర్హులందరికీ సాయం
మధుసూదన్, అదనపు కలెక్టర్, ఖమ్మం
అర్హులందరికీ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆర్థిక సాయమందుతుంది. దీనికోసం దళారులను ఆశ్రయించొద్దు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి నిర్ధారించాకే చెక్కు మంజూరవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివిధ అనుమతులకు సువిధ
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!