ముక్కోటి వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు
భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఉత్తర ద్వారం వద్ద కింది భాగంలో గతంలో ఉన్న గరుత్మంతుడి బొమ్మ స్థానంలో కొత్తదాన్ని తీర్చిదిద్దుతున్నారు.
ప్రత్యేక అధికారిగా ఏడీసీ జ్యోతి నియామకం?
భద్రాచలం, న్యూస్టుడే
ఎత్తు పెరగనున్న క్యూలైన్లు
భద్రాచలం రామాలయంలో ముక్కోటి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఉత్తర ద్వారం వద్ద కింది భాగంలో గతంలో ఉన్న గరుత్మంతుడి బొమ్మ స్థానంలో కొత్తదాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉండడంతో పాటు ఆధ్యాత్మిక భావం కలిగిస్తోంది. ఇందులో పక్షి ఆకారంలో రెక్కలతో పాటు పాము స్పష్టంగా కనిపిస్తుంది. స్వాగత ద్వారాలను సుందరంగా తయారు చేసేందుకు శంఖు చక్రాల బొమ్మలను అలంకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న క్యూలైన్ల ఎత్తు నాలుగున్నర అడుగులు ఉండగా వీటిని ఐదున్నర అడుగులకు పెంచాలని నిర్ణయించారు. జులైలో వచ్చిన వరదలకు కొన్ని చోట్ల క్యూలైన్లు పాడవగా వీటిని తొలగించి కొత్త వాటిని నిర్మించే పనులు కొనసాగుతున్నాయి. గురువారం ఆన్లైన్లో సెక్టార్ టిక్కెట్లను ఉంచడంతో తొలి రోజున సాయంత్రం వరకు 150 మంది వీటిని కొనుగోలు చేశారు. జిల్లాలోని ఐదు కౌంటర్లలో మొదటి రోజు నామమాత్రపు స్పందన ఉండటంతో ప్రచారాన్ని పెంచాలని భావిస్తున్నారు. మొత్తంగా 3,800 టికెట్లను విక్రయించనున్నారు.
ఆ అధికారి వచ్చేనా
అన్ని ఏర్పాట్లను ఈవో శివాజీ నేతృత్వంలో ఇద్దరు ఏఈవోలు, నలుగురు సూపరింటెండెంట్లు పర్యవేక్షించనున్నారు. 2023 జనవరి 1న తెప్పోత్సవం, 2న ఉత్తర ద్వార దర్శనం నిర్వహించనున్నారు. నూతన సంవత్సర వేడుకల నిమిత్తం పుణ్యక్షేత్రానికి విశేష సంఖ్యలో భక్తులు వచ్చే వీలుంది. ఈ పరిస్థితుల్లో భద్రాచలం రామాలయం గురించి తెలిసిన సీనియర్ను ఉత్సవ అధికారిగా నియమిస్తారని తెలిసింది. గతంలో ఇక్కడ ఈవోగా చేసి ప్రస్తుతం దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న కె.జ్యోతి ఫెస్టివల్ అధికారిగా వస్తారని సమాచారం. దీనిపై ఇంకా ఉత్తర్వులు రాలేదని తెలిసింది. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, కమిషనర్ అనిల్కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇతర ప్రముఖులను ఆహ్వానించే వీలుంది. సాధారణంగా శ్రీరామ నవమికి గవర్నర్ను ఆహ్వానిస్తుంటారు. ఇప్పుడు ముక్కోటికి పిలుస్తారా లేదా అన్నది త్వరలో స్పష్టత రానుంది. ప్రముఖులు వస్తే ప్రొటోకాల్ విధులు కీలకం కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే
[ 29-03-2024]
ఖమ్మం జిల్లా ఏన్కూర్లో గుడ్ ఫ్రైడేను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఏన్కూర్లో ఆర్సీఎం చర్చి నుంచి ప్రార్థనలు చేస్తూ సిలువ మార్గంగా టీఎల్ పేట చర్చి వరకు చేరుకున్నారు. -
సార్వత్రిక సమరం.. సిబ్బంది సిద్ధం..!
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై ఈసీ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఓటరు నమోదు నుంచి అభ్యర్థుల నామినేషన్లు, పోలింగ్, కౌంటింగ్ వరకు ప్రతి ఘట్టంలో అధికారులు, ఎన్నికల సిబ్బంది కీలకంగా వ్యవహరిస్తారు. -
దండుకున్నారు.. తిప్పించుకుంటున్నారు..!
[ 29-03-2024]
కొత్తగూడెం నియోజకవర్గంలో ‘దళితబంధు’ పేరిట భారీగా వసూళ్ల పర్వం సాగింది. ఒక్కొక్కరి నుంచి ఏకంగా రూ.3 లక్షలు దండుకున్నారు. ఈవ్యవహారంలో అప్పటి ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులు, పురపాలికలోని కొంతమంది ప్రజాప్రతినిధులు కీలకంగా వ్యవహరించారు. -
అసైన్డ్ భూముల్లో కట్టడాల కూల్చివేత
[ 29-03-2024]
ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతంలో అసైన్డ్ భూముల్లో అసలు యజమానులు కాకుండా కొనుగోలు చేసినవారు చేపట్టిన నిర్మాణాలను రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు గురువారం కూల్చివేశారు. -
పిండం దశలోనే పిసికేస్తున్నారు!
[ 29-03-2024]
ఆరోగ్య సమస్యలకు చికిత్స అందిస్తామని అనుమతులు తీసుకున్న ఆస్పత్రిలో గర్భవిచ్ఛిత్తికి పాల్పడుతున్నారు. ధనార్జన కోసం అనైతిక వైద్యం చేస్తూ పిండ దశలోనే ప్రాణాలు తీసేస్తున్నారు. -
అటు సాధన.. ఇటు శోధన
[ 29-03-2024]
రూ.15వేల రుణం కోసం ఆశపడిన ఐదుగురు మహిళలు, తెలియకుండానే తమ ఖాతాల ద్వారా రూ.కోట్ల లావాదేవీలు నడిపారు. నమ్మించిన యువకుడు ఒక బ్యాంకు ఖాతా పేరు చెప్పి, మరో బ్యాంకు ఖాతా తెరచి మోసగించాడని ఆలస్యంగా గ్రహించారు. -
‘సైబర్’ దోపిడీ సొమ్ము.. అమాయకుల ఖాతాలకు!
[ 29-03-2024]
సైబర్ నేరస్థులు అమాయకుల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారని, వాటి సాయంతో లూటీ సొమ్మును వాడుకుంటున్నారని ఎస్పీ బి.రోహిత్రాజు గురువారం తెలిపారు. -
ఎండల గండాలకు జాగ్రత్తలే గొడుగు
[ 29-03-2024]
మార్చి నెలలోనే ఎండలు ముదిరాయి. వారం రోజుల నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని సింగరేణి, పలు పరిశ్రమల ప్రభావిత ప్రాంతాల్లో వేడి ఇంకొంచెం ఎక్కువగా ఉంటోంది. -
అప్పుల బాధతో యువరైతు బలవన్మరణం
[ 29-03-2024]
పంటల దిగుబడి సరిగా రాలేదన్న మనస్తాపంతో ఓ యువరైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. పాల్వంచ గ్రామీణ ఎస్సై బి.శ్రీనివాస్ కథనం ప్రకారం.. మండలంలోని యానంబైలు గ్రామానికి చెందిన మంత్రి శశికుమార్ (26) నాలుగెకరాల్లో పత్తి, అయిదు ఎకరాల్లో వరి సాగు చేశాడు. -
ఆనందం.. అంతలోనే విషాదం
[ 29-03-2024]
కుమార్తె పెళ్లి జరిపించి బాధ్యత తీర్చుకున్నానని ఆ తల్లి ఎంతో సంబరపడింది. కుమారుడు, బంధువులతో కలిసి ఆనందంగా పెళ్లి వేడుక జ్ఞాపకాలతో కారులో స్వస్థలానికి తిరుగుపయనమయ్యారు. -
మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, కొరియర్ అరెస్టు
[ 29-03-2024]
నిషేధిత సీపీఐ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు, మావోయిస్టు కొరియర్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.రోహిత్రాజు తెలిపారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. -
9 నుంచి శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు
[ 29-03-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు జరిగే శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని ఆర్డీఓ దామోదర్రావు ఆదేశించారు. రామాలయం ఈఓ రమాదేవితో కలిసి తన కార్యాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ