శిక్షణ భళా.. ఉపాధి కళకళ
నేటి పోటీ ప్రపంచంలో అరకొర నైపుణ్యాలతోనే విద్యార్థులు బయటకు వచ్చి కష్టపడుతున్నారు. డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఉపాధి అవకాశాల కోసం దిక్కులు చూస్తున్నారు. నైపుణ్య మెళకువలు లేక ఉద్యోగ వేటలో చతికిలపడుతున్నారు.
విద్యార్థులు, యువతకు మార్గనిర్దేశం
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే
ఖమ్మం ఎస్ఆర్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు
నేటి పోటీ ప్రపంచంలో అరకొర నైపుణ్యాలతోనే విద్యార్థులు బయటకు వచ్చి కష్టపడుతున్నారు. డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఉపాధి అవకాశాల కోసం దిక్కులు చూస్తున్నారు. నైపుణ్య మెళకువలు లేక ఉద్యోగ వేటలో చతికిలపడుతున్నారు. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన వారు కూడా ఉద్యోగ పోటీ పరీక్ష ఎదుర్కొనే సత్తాలేక నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉమ్మడి జిల్లా విద్యార్థులు, యువతకు ‘టాస్క్’ అండగా నిలుస్తోంది.
18 అంశాల్లో టాస్క్ తర్ఫీదు
కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను చేర్పించటం తప్ప వారికి ఉపాధి మార్గాలు చూపటం లేదు. అవకాశాలు కోల్పోతున్న యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ నాలెడ్జ్(టాస్క్) వారధిగా నిలుస్తోంది. గ్రామీణ విద్యార్థులు ఆంగ్లంపై పట్టు వచ్చేలా ఈ కోర్సులో ప్రతిభకు సానపెడుతున్నారు. ప్రత్యేక కార్యశాలలు నిర్వహించి శిక్షణ అందిస్తున్నారు. స్థానిక కళాశాలల్లో బోధకులతో పాటు ప్రత్యేకంగా టాస్క్ బృందం సభ్యులు బోధిస్తున్నారు. గత నెల రోజుల నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో శిక్షణ ఇస్తున్నారు. సుమారు 18 రకాల అంశాల్లో తర్ఫీదు ఇచ్చి టాస్క్ ధ్రువపత్రాలు అందజేస్తున్నారు.
నమోదుకు 24 వరకు గడువు
2022-23 విద్యాసంవత్సరానికి విద్యార్థులు, కళాశాల నమోదు కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 24వ తేదీ నమోదుకు తుది గడువు. ఇంజినీరింగ్, డిగ్రీ, పాలిటెక్నిక్, ఎంబీఏ, ఫార్మసీ అన్ని రంగాల్లో అభ్యసించే విద్యార్థులకు తక్కువ రుసుములతో శిక్షణ అందిస్తున్నారు.
పలు సంస్థల భాగస్వామ్యం
ప్రభుత్వం ‘టాస్క్’లో బహుళజాతి సంస్థలను భాగస్వాములను చేసింది. ఐటీతో పాటు ఇతర రంగాల పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకుంది. నైపుణ్యాలున్న అభ్యర్థులను కోరుకుంటున్న పరిశ్రమలకు వేదికగా నిలుస్తోంది. చదువు పూర్తి చేసుకున్న వారికి భాగస్వామ్య సంస్థల్లో ప్రవేశాలుంటే సమాచారం అందిస్తారు. దీనిలో నమోదు చేసుకున్న విద్యార్థులకు దిగ్గజ సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
ప్రస్తుతం పరిశ్రమల అవసరాలు ఎలా ఉన్నాయి, ఉద్యోగుల నుంచి యాజమాన్యాలు ఎలాంటి నైపుణ్యాలు ఆశిస్తున్నాయనే అంశాలను విద్యార్థులకు వివరిస్తున్నారు. పరిశ్రమలు నెలకొల్పటంలో మెళకువలు, అవసరాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఆలోచనలకు సాంకేతికత జోడించి అవకాశాలు ఎలా సృష్టించాలనే అంశాలను నేర్పిస్తున్నారు. వ్యక్తిగత సామర్థ్యాలు, బృందాన్ని నడిపించగల నైపుణ్యం, సాంకేతికత, విజ్ఞానం వంటి అంశాల్లో ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నారు. నిరుద్యోగులుగా ఉన్న వారికి ప్రస్తుతం ఖమ్మం నగరంలో ఐటీ హబ్లో ఏర్పాటుచేసిన టాస్క్ కార్యాలయంలో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్లమెంట్ ఎన్నికల్లో భారాస అత్యధిక స్థానాలు విజయం
[ 23-04-2024]
మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇల్లందుకు చేరుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారాస నాయకులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో స్వాగతం -
ఏది నిజం?.. సోషల్ మీడియాలో సమాచార వ్యాప్తిపై ఈసీఐ సూచనలివీ..
[ 23-04-2024]
ఎన్నికలోస్తే చాలు, సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా సమాచారం వచ్చిపడుతుంది. వాటిల్లో పుకార్లు ఏవి? తప్పుదోవ పట్టించేవి ఏవి? నిజమైన సమాచారం ఏదో తెలియక ఓటర్లు తికమకపడుతుంటారు. -
బరిలో నిలవాలంటే.. పరిశీలన దశ దాటాల్సిందే!
[ 23-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి అఫిడవిట్లు సమర్పించారు. -
ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ సహా జిల్లా పరిషత్లకు సూచనలందాయి. -
రైతులకు అండగా ఉంటాం: నామా
[ 23-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరికి భారాస అండగా ఉంటుందని ఆపార్టీ ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
గ్యారంటీలు నమ్మి మోసపోకండి: తాండ్ర
[ 23-04-2024]
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నమ్మి ఓటర్లు మోసపోవద్దని, దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న భాజపాను ఆదరించాలని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు పేర్కొన్నారు. -
సెలవులొచ్చాయ్.. ప్రణాళికలు ఖరారయ్యాయ్!
[ 23-04-2024]
ఈవిద్యా సంవత్సరం నేడు (మంగళవారం) ముగియనుంది. పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి సారించింది. -
పది మందిలో ఐదుగురు స్థానికేతరులే..
[ 23-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా పది మంది గెలిచారు. వీరిలో ఐదుగురు స్థానికేతరులు కావటం విశేషం. -
అకాల వర్షంతో 700 ఎకరాల్లో పంట నష్టం
[ 23-04-2024]
జిల్లాలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులతో కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి ,లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, పినపాక, కరకగూడెం మండలాల్లో సుమారు 700 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు డీఏఓ బాబురావు సోమవారం తెలిపారు. -
‘పది’ విద్యార్థులు ఫలితాలపై ఒత్తిడి చెందొద్దు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురికావొద్దని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జేవీఎల్ శిరీష సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!