కొద్ది రోజుల్లో ‘వనమా అనర్హత కేసు’ తుది తీర్పు: జలగం
కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తాను కోర్టులో దాఖలు చేసిన కేసు తుది దశకు చేరిందని, కొద్ది రోజుల్లో తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెరాస నాయకుడు జలగం వెంకట్రావు అన్నారు.
మాట్లాడుతున్న కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్టుడే: కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని తాను కోర్టులో దాఖలు చేసిన కేసు తుది దశకు చేరిందని, కొద్ది రోజుల్లో తుది తీర్పు వచ్చే అవకాశం ఉందని ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, తెరాస నాయకుడు జలగం వెంకట్రావు అన్నారు. తీర్పు ఎలావున్నా స్వీకరించక తప్పదని, ప్రస్తుతం మాజీ అయిన తానే సిట్టింగ్ ఎమ్మెల్యేను కావొచ్చేమో అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్తూ గురువారం ఖమ్మంలో తన ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తన ప్రణాళిక తనకుందన్నారు. ఎన్నికలు వచ్చాక పోటీ చేయక తప్పదని, కొత్తగూడెంలోనే కాదు తాను పుట్టిన ఖమ్మంలోనూ తనకు సమాన హక్కుందన్నారు. టిక్కెట్ ఎవరు ఆశించినా తప్పులేదని, అధిష్ఠానం ఒకరికే టిక్కెట్ ఇస్తుందన్నారు. పొత్తుల్లో తెరాస ఓట్లు కమ్యూనిస్టులకు బదలాయింపు ఉమ్మడి జిల్లాలో సులభం కాదన్నారు. కాంగ్రెస్, భాజపాలు జిల్లాలో పెద్దగా ప్రభావం చూపలేవన్నారు. తెరాసలోనే నేతల మధ్య పోటీ అధికంగా ఉందికదా అన్న ప్రశ్నకు ఎన్నికల సమయానికి అన్నీ సర్దుబాటు అవుతాయన్నారు. నియోజకవర్గంలో ఉండరనే విమర్శలకు సమాధానమిస్తూ స్థానికంగా ఉంటేనే ప్రజలకు దగ్గరగా ఉన్నట్లు కాదని, తాను ఇక్కడే ఉండి ప్రజా సమస్యల విషయంలో జోక్యం చేసుకోవటం వల్ల వారికి నష్టం జరుగుతుందన్నారు. తన హయాంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులు మధ్యలో ఆపేశారని, శాంతిభద్రతలు గాడితప్పిన కొత్తగూడెం నియోజకవర్గంలో ప్రజలు తన అవసరాన్ని గుర్తిస్తున్నారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)