వ్యాధుల గూడు..గిరిజనుల గోడు
అభం, శుభం తెలియని మూడేళ్ల బాలుడు.. అల్లరి చేష్టలతో ఇళ్లంతా సందడి చేయాల్సిన వయస్సులో మంచాన పడ్డాడు. బక్కచిక్కిన శరీరంతో నీరసించిపోయాడు
కొత్తగూడెం పట్టణం, న్యూస్టుడే
*అభం, శుభం తెలియని మూడేళ్ల బాలుడు.. అల్లరి చేష్టలతో ఇళ్లంతా సందడి చేయాల్సిన వయస్సులో మంచాన పడ్డాడు. బక్కచిక్కిన శరీరంతో నీరసించిపోయాడు. కొడుకు ఆటపాటలకు మురిసిపోవాల్సిన ఆ గిరిజన తల్లిదండ్రుల కళ్లలో ఆనందం ఆవిరైంది. వైద్య పరీక్షల్లో తలసీమియా ఉందని తేలడంతో వారి గుండెల్లో పిడుగు పడింది. బాలుడికి ఐదేళ్లు వచ్చే వరకు 80 సార్లకు పైగా రక్తం ఎక్కించారు. ఆర్థిక సమస్యలతో కాలేయాన్ని మార్పించలేదు. కొద్దినెలల క్రితం బాలుడు తనువు చాలించాడు. ఈ ఘటన జూలూరుపాడు మండలంలోని ఓ తండాలో చోటుచేసుకుంది.
* మణుగూరు మండలానికి చెందిన యువ జంట సంతానం కోసం తపిస్తోంది. నెల తప్పడం, అబార్షన్ అవడం, మృత శిశువు జన్మించటం.. ఇలా జరిగిన ప్రతిసారీ దంపతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగి పరీక్షలు చేయించుకుంటే ఇద్దరికీ సికిల్సెల్ ఉందని తేలింది.
గిరిజన ప్రాంతాల్లో తలసీమియా, సికిల్సెల్తో అనేకమంది నలిగిపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది జిల్లాల్లో ఈ తరహా వ్యాధులపై వైద్య, ఆరోగ్య శాఖ ఇటీవల దృష్టి సారించింది. ఎనిమిది జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉండటం గమనార్హం. తలసీమియా, సికిల్సెల్ బాధితులు క్రమేణా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అధికమవుతున్నారు. ఈఏడాది నిర్వహించిన శిబిరాల్లో పలువురు సికిల్సెల్, తలసీమియాతో బాధపడుతున్నట్లు అధికారులు తేల్చారు. చర్లలో ఐదేళ్ల నుంచి 17 ఏళ్లలోపువారు 18 మంది, 25 ఏళ్ల యువకుడు, జూలూరుపాడు మండలం బేతాళపాడులో ఆరేళ్ల నుంచి 12 ఏళ్ల పిల్లల్లో ఏడుగురు తలసీమియా, ఓ బాలుడు సికిల్సెల్ బారిన పడినట్లు గుర్తించారు. దుమ్ముగూడెం మండలం కొత్తపల్లిలో పదేళ్ల నుంచి 40 ఏళ్లలోపు తొమ్మిది మంది సికిల్సెల్, ఒకరు తలసీమియాతో బాధపడుతున్నట్లు తేల్చారు. బూర్గంపాడు మండలం నాగారంలో 25 ఏళ్ల మహిళ సికిల్సెల్ బారిన పడినట్లు గుర్తించారు. తలసీమియా, సికిల్సెల్ వ్యాధులు మేనరికం, జన్యుపరంగా సంక్రమించే ఆస్కారముందని వైద్యులు చెబుతున్నారు. పంజాబ్ ట్రైబ్స్లో ఎక్కవగా కన్పించే ఈ తరహా వ్యాధులు ఇక్కడి ఏజెన్సీ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయంటున్నారు.
స్వచ్ఛంద సంస్థల చేయూత
ఖమ్మం జిల్లాలో తలసీమియాతో 188 మంది, సికిల్సెల్ ఎనిమియాతో 60 మంది బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించారు. వీరితో పాటు రెండు వేర్వేరు సొసైటీల్లో 445 మంది బాధితుల పేర్లు నమోదయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ఆదివాసీల్లోనూ బాధితులున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరికి అత్యవసర సమయంలో స్వచ్ఛంద సంస్థలు రక్తాన్ని అందించేందుకు యత్నిస్తున్నాయి.
* భద్రాద్రి జిల్లాలో రెడ్క్రాస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలతో పాటు రక్త సేకరణ ప్రక్రియ జరుగుతోంది.
జీవితాంతం రక్తం ఎక్కించుకోవాల్సిందే..
డాక్టర్ వీరబాబు, పిల్లల వైద్య నిపుణుడు
తలసీమియా, సికిల్సెల్ బాధితులు జీవితాంతం రక్తం ఎక్కించుకోవాలి. ఈ వ్యాధులను పూర్తిస్థాయిలో నివారించలేం. చాలాసార్లు రక్తం ఎక్కించడం వల్ల పిల్లలు తట్టుకోకపోవచ్చు. కొందరు చనిపోతారు. తలసీమియా, సికిల్సెల్ బాధితులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రక్తం ఎక్కించేందుకు చర్యలు చేపడుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!