వివాహిత, తల్లిదండ్రులపై గొడ్డలితో దాడి
వివాహిత, ఆమె తల్లిదండ్రులపై అత్తింటి వారు గొడ్డలి, కత్తులతో దాడికి పాల్పడ్డ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఈ క్రమంలో వివాహిత కుటుంబ సభ్యులు చేసిన ప్రతిదాడిలో ఒకరు గాయాలపాలయ్యారు.
కంటిపై గాయాలతో ఓర్సు శైలజ
ఆళ్లపల్లి, న్యూస్టుడే: వివాహిత, ఆమె తల్లిదండ్రులపై అత్తింటి వారు గొడ్డలి, కత్తులతో దాడికి పాల్పడ్డ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. ఈ క్రమంలో వివాహిత కుటుంబ సభ్యులు చేసిన ప్రతిదాడిలో ఒకరు గాయాలపాలయ్యారు. బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం.. గుండాల మండలం కాచనపల్లి గ్రామానికి చెందిన దుంప రాములు, పూలమ్మ దంపతుల కుమార్తె శైలజను అదే గ్రామానికి చెందిన ఓర్సు రాంబాబుకిచ్చి నాలుగేళ్ల క్రితం వివాహం చేశారు. రెండేళ్లపాటు వారి కాపురం సజావుగా సాగింది. భర్త, అత్తమామలు అదనపు కట్నం పేరుతో శైలజను మానసికంగా, శారీరకంగా హింసించి పుట్టింటికి పంపించారు. గ్రామ పెద్దలు, పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి తిరిగి ఆమెను అత్తవారింటికి పంపారు. అదే క్రమంలో రాంబాబు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెను ఇంటికి తీసుకొచ్చాడు. భార్యను తరచూ తిడుతూ, కొడుతూ పుట్టింటికి వెళ్లిపోమని వేధిస్తుండేవాడు. వేధింపులు భరించలేక వారం క్రితం శైలజ పుట్టింటికి తిరిగి వచ్చింది. భర్త వివాహేతర సంబంధ విషయమై ప్రశ్నించేందుకు శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో శైలజ, తన తల్లిదండ్రులతో కలిసి అత్తంటికి వెళ్లింది. ఈ క్రమంలో గొడ్డలి, కత్తులతో రాంబాబు, అతని సోదరుడు ఓర్సు మల్లయ్య, వదిన రాధ, తల్లిదండ్రులు వెంకన్న, సారమ్మలు దాడికి పాల్పడటంతో శైలజ, ఆమె తల్లిదండ్రులు గాయపడ్డారు. ప్రతిదాడిలో రాంబాబు తండ్రి వెంకన్నకు తల, నడుముపై తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, బంధువులు ప్రైవేటు వాహనంలో ఆళ్లపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మైరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఏరియా వైద్యశాలకు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఓర్సు రాంబాబు, తల్లిదండ్రులు, అన్నవదినలపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఆళ్లపల్లి ఎస్సై రతీశ్ తెలిపారు.
ప్రతిదాడిలో గాయపడ్డ ఓర్సు వెంకన్న
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారేపల్లిలో భాజపా అభ్యర్థి రోడ్ షో
[ 25-04-2024]
కారేపల్లి ప్రధాన రహదారిలో భాజపా ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు గురువారం రోడ్ షో నిర్వహించారు. -
ఆ ఊట నీళ్లే వారికి అమృతం.. 30 ఏళ్లుగా తాగుతున్న ఆదివాసీలు
[ 25-04-2024]
చర్ల మండలంలోని మారుమూల పల్లె వెంకటచెరువులో ఆదివాసీలు ఇప్పటికీ ఊటనీటినే తాగుతున్నారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ