దేశభవిష్యత్తు నిర్దేశకులు ఓటర్లే
ఓటుహక్కు.. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరాయి లాంటిదని కలెక్టర్ వీపీ గౌతమ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలంటే తమకు సంబంధించిన అంశం కాదనే భావనను యువతీయువకులు, పట్టణవాసులు విడనాడాలని సూచించారు.
‘ఈనాడు’తో కలెక్టర్ వీపీ గౌతమ్
ఓటుహక్కు.. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదిరాయి లాంటిదని కలెక్టర్ వీపీ గౌతమ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలంటే తమకు సంబంధించిన అంశం కాదనే భావనను యువతీయువకులు, పట్టణవాసులు విడనాడాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వారందరూ విధిగా ఓటరుగా నమోదై ఉండాలన్నారు. ఇంట్లో కూర్చునే ఓటుహక్కు పొందేలా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ‘ఈనాడు’తో కలెక్టర్ గౌతమ్ ముచ్చటించారు. ఆ వివరాలు మీ కోసం..
యువత నిర్లిప్తం వీడాలి..
పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం అధికంగా నమోదవుతోంది. పేదలు, వృద్ధులు ఓటేసేందుకు ముందంజలో ఉంటున్నారు. సెలవు ఉన్నా సరే కొందరు ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు, యువత ఇళ్లల్లోనే కాలక్షేపం చేస్తున్నారు. ఎన్నికలంటే తమకు సంబంధం లేదనే అపోహను వీడాలి. రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నా.. ప్రతి ఒక్కరి జీవితంలో రాజకీయం మిళితమై ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. వ్యక్తి, వ్యవస్థ భవిష్యత్తును మార్చే సాధనంగా ఉన్న ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి.
జాబితాలో పేరు ఉండాల్సిందే..
కొంతమంది ఓటర్లు తమ వద్ద ఓటరు గుర్తింపు కార్డు ఉందని, ఎన్నికలు వచ్చినప్పుడు ఓటేసేందుకు వెళ్తారు. కానీ వారి పేరు ఓటరు జాబితాలో ఉండదు. రోజురోజుకూ కొత్త ఓటర్లు నమోదవుతూనే ఉంటారు. ఈ ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో పాత ఓటరు తన గుర్తింపు కోల్పోతారు. ప్రతిసారీ ఓటర్ల జాబితా మారుతుంది. ఓటరు కార్డుంటే ఓటుహక్కు ఉన్నట్లు కాదు.. కొత్తగా వెలువడిన ఓటరు జాబితాలో పేరుంటేనే ఓటేసేందుకు అర్హులు. జాబితాలో పేరు లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.
విరివిగా అవగాహన కార్యక్రమాలు..
జిల్లాలో ఓటరు నమోదు, ఓటుహక్కు వినియోగంపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ఎన్నికల సంఘం తాజాగా దరఖాస్తు ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చింది. ఏటా నాలుగుసార్లు ఓటుహక్కుకు దరఖాస్తు చేసుకోవచ్చు. 17 ఏళ్లు నిండినవారూ ఏడాది ముందుగానే ఓటరుగా నమోదయ్యేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అంశాలన్నీ యువతకు తెలియజేసేలా ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలలు, గురుకుల విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రతి కళాశాలకు తహసీల్దారును ఇన్ఛార్జిగా నియమించి యువతీ, యువకులను ఓటర్లుగా చేర్చాం. మూడు నెలల పాటు చేపట్టిన కార్యక్రమాలతో 44 వేల మంది ఓటర్లు కొత్తగా చేరారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని 47 వేల మందికి కొత్తగా ఓటరు కార్డులు జారీ చేస్తున్నాం.
నేడు విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు
ఖమ్మం నగరం: జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు స్వీప్ నోడల్ అధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. ఓటు నమోదు, ఓటుహక్కు వినియోగంపై ఖమ్మంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఏఎస్ఆర్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, నయాబజార్ జూనియర్ కళాశాల, ఎస్ఆర్బీజీఎన్నార్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామన్నారు. కొత్త ఓటర్లకు మధ్యాహ్నం 3 గంటలకు ఐడీవోసీ భవనంలో గుర్తింపు కార్డులు కలెక్టర్ గౌతమ్ అందజేస్తారని పేర్కొన్నారు. బుధవారం ఉదయం కేజీబీవీలు, మోడల్ స్కూల్స్లో ప్రార్థనతో పాటు ఓటు నమోదుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించాలని కలెక్టర్ సూచించారన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏన్కూరులో హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
ఏన్కూర్లో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల భక్తులు టీఎల్ పేట రామాలయానికి చేరుకొని అక్కడ నుంచి 10 కి.మీ శోభాయాత్రతో పాటు ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. -
భాగ్యనగర్ తండాలో బోనాల వేడుక
[ 23-04-2024]
భాగ్యనగర్ తండాలో బోనాల వేడుకను మంగళవారం వైభవంగా నిర్వహించారు. -
పార్లమెంట్ ఎన్నికల్లో భారాస అత్యధిక స్థానాలు విజయం
[ 23-04-2024]
మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇల్లందుకు చేరుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారాస నాయకులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో స్వాగతం -
ఏది నిజం?.. సోషల్ మీడియాలో సమాచార వ్యాప్తిపై ఈసీఐ సూచనలివీ..
[ 23-04-2024]
ఎన్నికలోస్తే చాలు, సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా సమాచారం వచ్చిపడుతుంది. వాటిల్లో పుకార్లు ఏవి? తప్పుదోవ పట్టించేవి ఏవి? నిజమైన సమాచారం ఏదో తెలియక ఓటర్లు తికమకపడుతుంటారు. -
బరిలో నిలవాలంటే.. పరిశీలన దశ దాటాల్సిందే!
[ 23-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి అఫిడవిట్లు సమర్పించారు. -
ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ సహా జిల్లా పరిషత్లకు సూచనలందాయి. -
రైతులకు అండగా ఉంటాం: నామా
[ 23-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరికి భారాస అండగా ఉంటుందని ఆపార్టీ ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
గ్యారంటీలు నమ్మి మోసపోకండి: తాండ్ర
[ 23-04-2024]
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నమ్మి ఓటర్లు మోసపోవద్దని, దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న భాజపాను ఆదరించాలని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు పేర్కొన్నారు. -
సెలవులొచ్చాయ్.. ప్రణాళికలు ఖరారయ్యాయ్!
[ 23-04-2024]
ఈవిద్యా సంవత్సరం నేడు (మంగళవారం) ముగియనుంది. పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి సారించింది. -
పది మందిలో ఐదుగురు స్థానికేతరులే..
[ 23-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా పది మంది గెలిచారు. వీరిలో ఐదుగురు స్థానికేతరులు కావటం విశేషం. -
అకాల వర్షంతో 700 ఎకరాల్లో పంట నష్టం
[ 23-04-2024]
జిల్లాలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులతో కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి ,లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, పినపాక, కరకగూడెం మండలాల్లో సుమారు 700 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు డీఏఓ బాబురావు సోమవారం తెలిపారు. -
‘పది’ విద్యార్థులు ఫలితాలపై ఒత్తిడి చెందొద్దు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురికావొద్దని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జేవీఎల్ శిరీష సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ