ఐదేళ్లలో 100 మి.ట. బొగ్గు ఉత్పత్తే లక్ష్యం
ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టేలా ప్రణాళికలు రూపొందించినట్లు డైరెక్టర్(పా) ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకోసం మరో పది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు చెప్పారు.
గౌరవ వందనం స్వీకరిస్తున్న చంద్రశేఖర్
కొత్తగూడెం సింగరేణి: ఐదేళ్లలో 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టేలా ప్రణాళికలు రూపొందించినట్లు డైరెక్టర్(పా) ఎస్.చంద్రశేఖర్ తెలిపారు. ఇందుకోసం మరో పది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. కొత్తగూడెం ప్రకాశం మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఏడాది ఒడిశాలోని నైనీ కోల్ బ్లాకు నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఉత్పత్తిలో 29, రవాణాలో 37, టర్నోవర్లో 123, లాభాల్లో 193 శాతం వృద్ధి సాధించామన్నారు. సత్తుపల్లి గనుల నుంచి బొగ్గు రవాణాకు రైల్వే శాఖతో కలిసి రూ.1,000 కోట్లతో 54 కిలోమీటర్ల రైలు మార్గాన్ని నిర్మించుకున్నామని తెలిపారు. రిజర్వేషన్లను సింగరేణి పూర్తిస్థాయిలో అమలుచేస్తోందన్నారు. ఇప్పటికే 1,200 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. మరో 800 యూనిట్ల ప్లాంటు ఏర్పాటుకు ముఖ్యమంత్రి అనుమతించారని తెలిపారు. డైరెక్టర్లు ఎన్.బలరాం, సత్యనారాయణరావు, జీఎంలు కె.బసవయ్య, సీహెచ్ నర్సింహారావు, ఆనందరావు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ సలహాదారు దమ్మాలపాటి శేషయ్య, సీఎంవోఏఐ నాయకుడు మధుకర్ పాల్గొన్నారు. రుద్రంపూర్ జయశంకర్ మైదానంలో నిర్వహించిన కొత్తగూడెం ఏరియా స్థాయి వేడుకల్లో జీఎం జక్కం రమేష్ పతాకాన్ని ఆవిష్కరించారు. 8 మంది ఉత్తమ ఉద్యోగులను కుటుంబ సభ్యులతో సహా సన్మానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
-
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం జిల్లాలోని ప్రైవేటు కళాశాలలు సత్తాచాటాయి. బుధవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించినట్టు ఆయా కళాశాలల యాజమాన్యాలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.