నేటి నుంచి ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ
జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానుంది. ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాపై విద్యాశాఖ కసరత్తు చేసింది.
ఉపాధ్యాయుల జాబితా వివరాలు పరిశీలిస్తున్న జేడీ వెంకటనర్సమ్మ, డీఈవో శర్మ, అధికారులు
కొత్తగూడెం విద్యావిభాగం: జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ శుక్రవారం ప్రారంభం కానుంది. ఉద్యోగోన్నతుల సీనియారిటీ జాబితాపై విద్యాశాఖ కసరత్తు చేసింది. తుది జాబితా ప్రకారం జడ్పీ ఉన్నత పాఠశాల(లోకల్బాడీ)ల్లో 2005 డిసెంబరు 31 లోపు నియమితులైన స్కూల్ అసిస్టెంట్లు(ఎస్ఏ), ఎల్ఎఫ్ఎల్ హెచ్.ఎం.లు 195 మందికి ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతి దక్కనుంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 2006 డిసెంబరు 31లోపు నియమితులైన 26 మంది ఎస్ఏలూ హెచ్.ఎం.లు కానున్నారు. పాతపాల్వంచలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్ల్ల(ఎస్జీటీ) ఎస్ఏ ఉద్యోగోన్నతుల ప్రక్రియ సాగనుంది. అర్హులైన వారి వివరాలను ఒక హెచ్.ఎం., మరో టెక్నికల్ అసిస్టెంట్తో కూడిన సుమారు 10 బృందాలు సిద్ధం చేయనున్నాయి. ఈ ప్రక్రియను డీఈవో సోమశేఖర్శర్మ, ఏఎస్వో సతీశ్కుమార్, ఏపీవో కిరణ్కుమార్, టెక్నికల్ అధికారులు మోహన్ తదితరులు పర్యవేక్షిస్తారు. ఈ జాబితాలో చోటు దక్కేవారు ఈ నెల 28 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వెంటనే మార్గదర్శకాలు జారీ చేయనున్నారు. జిల్లాలోని 23 మండలాల్లో వివిధ కేటగిరీలలో 1,538 ఖాళీలున్నట్లు గుర్తించిన అధికారులు.. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు 37 రోజుల షెడ్యూల్ను రూపొందించారు.
కొత్తగూడెం విద్యావిభాగం: ఉపాధ్యాయ ఉద్యోగోన్నతులు, బదిలీల సీనియార్టీ జాబితా తయారీ పకడ్బందీగా జరుగుతుందని జిల్లా పరిశీలకులు, జాయింట్ డైరెక్టర్ వెంకటనర్సమ్మ అన్నారు. డీఈవో కార్యాలయంలో కొనసాగుతున్న ప్రక్రియను గురువారం పరిశీలించారు. డీఈవో సోమశేఖర్శర్మ, ఏఎస్వో సతీశ్కుమార్, ప్రభుత్వ పరీక్షల సహాయాధికారి మాధవరావు, ఏపీవో కిరణ్కుమార్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివిధ అనుమతులకు సువిధ
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.