logo

విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ అందజేత

జిల్లావ్యాప్తంగా ఉన్న ఎస్సీ వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను గురువారం అందించారు.

Published : 27 Jan 2023 02:47 IST

ఖమ్మం సంక్షేమవిభాగం: జిల్లావ్యాప్తంగా ఉన్న ఎస్సీ వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను గురువారం అందించారు. ఈనెల 25వ తేదీన ఎస్సీ వసతి గృహాల్లోని పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతులు నిర్వహించకపోవడం, స్టడీ మెటీరియల్‌ను అందించకపోవడంపై ‘ప్రేరణ కలిగించరా’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఖమ్మంలోని ఎస్సీ బాలికల వసతిగృహం(ఏ)లో విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను ఎస్సీడీడీ కస్తాల సత్యనారాయణ, వసతిగృహ సంక్షేమాధికారి నెల్లూరి విజయ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లావ్యాప్తంగా ఉన్న 35 వసతి గృహాల్లోని 534 మంది విద్యార్థులకు మెటీరియల్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఆదివారం ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు వీటిని ఉపయోగించుకొని నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. వసతిగృహ సిబ్బంది శారదాబాయి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని