పరమ పావనం.. సీతారామ కల్యాణం
భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో గురువారం సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన నిర్వహించారు. క్షేత్ర విశిష్టతను ప్రవచనం చేసిన తీరు మంత్రముగ్ధులను చేసింది.
కచేరీ చేస్తున్న ప్రముఖ కళాకారుడు మల్లాది సూరిబాబు
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయంలో గురువారం సుప్రభాతం పలికి ఆరాధించి నామార్చన నిర్వహించారు. క్షేత్ర విశిష్టతను ప్రవచనం చేసిన తీరు మంత్రముగ్ధులను చేసింది. మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ డీన్ ఘంటా రమేశ్ రాములవారిని దర్శించుకున్నారు. ఈయన వెంట భద్రాచలం గిరిజన బీఈడీ కళాశాల సిబ్బంది ఉన్నారు. బీ దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీరు సీతారాములు గురువారం భద్రాచలం రాములవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు సాదరంగా స్వాగతం పలికారు. ఈయన వెంట రామాలయం ఈఈ రవీంద్రనాధ్ ఉన్నారు. బీ భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి ఆలయంలో భక్తరామదాసు జయంత్యుత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ సంబురాలలో భాగంగా రెండో రోజైన గురువారం సంగీత కచేరీ ఆకట్టుకుంది. తబల, ఘటం, మృదంగం, వయోలిన్ వంటి వాయిద్య పరికరాలతో భక్తి కీర్తనలకు ప్రాణం పోశారు. భద్రాచలం దేవాలయ ఆస్థాన విద్వాంసులు మృదుమధురమైన నాదస్వరం వినిపించారు. వేర్వేరు చోట్ల స్థిరపడిన కళాకారులు తరలివచ్చి రామార్చన చేసి మెప్పించారు. మల్లాది సూరిబాబు కుటుంబానికి చెందిన ఉద్దండులైన కళాకారులు ఆలపించిన ప్రతీ పాట పరమాద్భుతంగా వినిపించడంతో చిత్రకూట మండపంలో చప్పట్ల మోత మోగింది. 29 వరకు ఈ వాగ్గేయకారోత్సవాలు ఉంటాయని ఈవో శివాజీ తెలిపారు.
నేలకొండపల్లి, న్యూస్టుడే: నేలకొండపల్లిలోని భక్తరామదాసు ధ్యాన మందిరంలో శ్రీవెంకటాద్రి భక్తసమాజం ప్రత్యేక కీర్తనలు ఆలపించింది. చెన్నై నుంచి సుమారు 50 మందికిపైగా కళాకారులు, వాయిద్యకారులు ఇక్కడకు వచ్చారు. ఆలయ పూజారి సౌమిత్రి రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
కీర్తనలు ఆలపిస్తున్న వెంకటాద్రి భక్త సమాజ బృందం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
-
తెలంగాణలో నామినేషన్లు దాఖలు చేసిన పలువురు అభ్యర్థులు
-
వైకాపాకి ఓటు వేస్తే డ్రైనేజీలో వేసినట్టే: వైఎస్ షర్మిల
-
నారాయణమూర్తి మనవడికి జాక్పాట్.. ఒక్క రోజులో ₹4 కోట్లు!
-
మా ఎమ్మెల్యేలను టచ్ చేస్తే.. మాడి మసైపోతావ్: కేసీఆర్పై సీఎం రేవంత్ ఫైర్
-
‘ఇద్దరు యువ రాజుల చిత్రాన్ని’ యూపీ ప్రజలు తిరస్కరించారు: మోదీ