జాతి రత్నాలు.. ఏజీ పూర్వ విద్యార్థులు
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు తమ కీర్తి పతాకను జాతీయ స్థాయిలో దిల్లీలోనూ ఎగురవేశారు. విశ్వవిద్యాలయం స్థాయిలోనే గాక జాతీయ స్థాయిలోనూ ప్రథమ స్థానం మనదేనని నిరూపించారు.
అశ్వారావుపేట, న్యూస్టుడే: అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు తమ కీర్తి పతాకను జాతీయ స్థాయిలో దిల్లీలోనూ ఎగురవేశారు. విశ్వవిద్యాలయం స్థాయిలోనే గాక జాతీయ స్థాయిలోనూ ప్రథమ స్థానం మనదేనని నిరూపించారు. ఈనెల 12న ప్రకటించిన జాతీయస్థాయి వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (అగ్రికల్చర్ శాస్త్రవేత్తల రిక్రూట్మెంటు బోర్డు)లో వందల మంది పోటీపడ్డా అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఏజీబీఎస్పీ పూర్తిచేసి పీజీ, పీహెచ్డీ చేస్తున్న ఎన్.అశ్వని జాతీయస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారు. జెనిటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్లో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. బంగారు పతకాలు అశ్విని వెంటే వచ్చాయి అంటే సరిపోతుంది. ఏజీబీఎస్సీలో బంగారు పతకంతో పాటు 3 రజత పతకాలు, విశ్వవిద్యాలయం స్థాయిలో 6 బంగారు పతకాలు, దిల్లీలో ఏజీ ఎంఎస్సీలో బంగారు పతకం వచ్చింది. ప్రస్తుతం ఇక్రిశాట్లో మూడో సంవత్సరం పీహెచ్డీ పరిశోధకురాలిగా పనిచేస్తున్నారు. ఉన్నత ప్రతిభ చూపుతూ జాతీయ స్థాయిలో వ్యవసాయ శాస్త్రవేత్తల నియామకాల్లో మొదటి స్థానంలో నిలిచిన అశ్విని తల్లితండ్రులు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాలో వ్యవసాయ కుటుంబం.
జాతీయ స్థాయిలో మెరిసిన షణ్ముఖ
అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఏజీబీఎస్సీ పూర్తి చేసిన మరో విద్యార్థిని షణ్ముఖ జాతీయ స్థాయిలో వ్యవసాయ శాస్త్రవేత్తగా అయిదో స్థానంలో నిలిచారు. షణ్ముఖ తండ్రి ఉప్పల్లో ఆర్టీసీ ఉద్యోగిగా పనిచేస్తుండగా తల్లి కుటుంబ బాధ్యతలు చేస్తూన్నారు. ఏజీబీఎస్సీలో ఉత్తమ ఓజీపీఏతో ఉత్తీర్ణత సాధించి ఎమ్మెస్సీలో జాతీయ స్థాయిలో 11వ, పీహెచ్డీలో అయిదో ర్యాంకు సాధించిన షణ్ముఖ కళాశాలలో ఎంచుకున్న తన లక్ష్యాన్ని నేడు చేరుకున్నారు. వ్యవసాయ విస్తరణ విభాగంలో శాస్త్రవేత్తగా నియమితులయ్యారు. వ్యవసాయ పరిశోధనా ఫలాలను రైతులకు చేరవేయడంలో విస్తరణ విభాగానిదే అసలైన ప్రాధాన్యం అంటారు షణ్ముఖ.
ఎంటమాలజీ శాస్త్రవేత్తగా కె.శ్రీనివాసరావు
అశ్వారావుపేటకు చెందిన మరో విద్యార్థి కె.శ్రీనివాసరావు ఎంటమాలజీ విభాగంలో శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. ఎంతోమంది పోటీపడగా వారిలో 11వ స్థానంలో నిలిచిన శ్రీనివాసరావు ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన శ్రీనివాసరావు ఏజీబీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి, పీజీ హైదరాబాదులో పూర్తి చేశారు. తల్లితండ్రులది వ్యవసాయ కుటుంబం. ఎంటమాలజీలో శాస్త్రవేత్తగా ఎంపిక కావడం అంటే రైతుకు సేవచేసే అవకాశం తనకు లభించినట్లే అంటారు శ్రీనివాసరావు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
-
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం జిల్లాలోని ప్రైవేటు కళాశాలలు సత్తాచాటాయి. బుధవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించినట్టు ఆయా కళాశాలల యాజమాన్యాలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.