జనగణమన..ప్రగతి పథాన
ఎందరో మహనీయులు ప్రాణాలర్పించి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని.. మరెందరో మహానుభావులు శ్రమించి భారతావని సమగ్రాభివృద్ధికి రాజ్యాంగాన్ని రచించారని.. అదే స్ఫూర్తితో జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు.
నూతన సమీకృత కలెక్టరేట్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
మాట్లాడుతున్న గౌతమ్
ఈటీవీ, ఖమ్మం: ఎందరో మహనీయులు ప్రాణాలర్పించి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని.. మరెందరో మహానుభావులు శ్రమించి భారతావని సమగ్రాభివృద్ధికి రాజ్యాంగాన్ని రచించారని.. అదే స్ఫూర్తితో జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషిచేస్తున్నామని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గణతంత్ర వేడుకల సందర్భంగా ఖమ్మంలోని నూతన సమీకృత కలెక్టరేట్లో గురువారం ప్రసంగించారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
కలెక్టర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
* కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం కింద జిల్లాలో 15,81,782 మందికి పరీక్షలు నిర్వహిస్తాం. అవసరమైన వారికి కళ్లద్దాలు ఉచితంగా పంపిణీ చేస్తాం.
* దళితబంధు పథకం కింద 3,462 మందికి రూ.346.20కోట్ల యూనిట్లు అందజేశాం.
* ధరణి వెబ్సైట్తో జిల్లాలో దీర్ఘకాలిక భూసమస్యలకు పరిష్కారం లభిస్తోంది. 45,667 దరఖాస్తులు స్వీకరించి 38,861 దరఖాస్తులు పరిష్కరించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అందజేశాం.
కలెక్టర్ గౌతమ్ నుంచి ప్రశంస పత్రం అందుకుంటున్న ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఏలూరి శ్రీనివాస్, చిత్రంలో అదనపు కలెక్టర్లు స్నేహలత, మధుసూదన్, అదనపు డీసీపీ శబరీష్
* రైతుబంధు పథకం ద్వారా 2022 యాసంగిలో 3,02,057 మంది రైతులకు రూ.295.74 కోట్లు పంపిణీ చేశాం. రైతు బీమా కింద 298 కుటుంబాలకు రూ.14.90 కోట్ల పరిహారం అందించాం.
* మన ఊరు- మన బడి కార్యక్రమం మొదటి విడతలో 426 పాఠశాలలను రూ.135 కోట్లతో ఆధునికీకరిస్తున్నాం. ఈపనుల్లో ఖమ్మం జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
* ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా మంజూరు చేసిన నిధులతో ఖమ్మం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాం. రూ.100 కోట్లతో గోళ్లపాడు ఛానల్ ఆధునికీకరణ పనులు చేపట్టాం.
* పరిపాలన సౌలభ్యం కోసం జిల్లా కార్యాలయాలన్నీ ఒకేచోట కొలువుదీరేలా ప్రభుత్వం రూ.53.20 కోట్లతో నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాన్ని నిర్మించింది.
జాతీయ జెండాకు వందనం చేస్తున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, జడ్పీ ఛైర్మన్ కమల్రాజు తదితరులు
169 మందికి ప్రశంస పత్రాలు..
ఖమ్మం నగరం, న్యూస్టుడే: విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 156 మంది అధికారులు, ఉద్యోగులు, 13 మంది క్రీడాకారులకు ప్రశంస పత్రాలను కలెక్టర్ గౌతమ్ అందజేశారు. వీరిలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఏలూరి శ్రీనివాసరావు మాత్రమే జిల్లాస్థాయి అధికారి. కామేపల్లి మండలం కొమ్మినేపల్లి, వైరా మండలం గరికపాడు, చింతకాని మండలం లచ్చగూడెం, రఘునాథపాలెం మండలం హర్యాతండా, తల్లాడ మండలం తెలగవరం, నేలకొండపల్లి మండలం మోటాపురం పంచాయతీలు ప్రశంస పత్రాలు అందుకున్నాయి. జిల్లా న్యాయమూర్తి డా.టి.శ్రీనివాసరావు, జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషణం, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ ఉమా మామహేశ్వరరావు, అదనపు కలెక్టర్లు స్నేహలత, మధుసూదన్, కార్పొరేషన్ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ కలెక్టర్ రాధికా గుప్తా, అదనపు డీసీపీ శబరీష్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్సింగ్, తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపాలెం: వేపకుంట్లలో 74 అడుగుల త్రివర్ణ పతాకంతో..
భారీ జాతీయ పతాకాలు తయారుచేసే ఖమ్మం నగరానికి చెందిన ‘ఫ్లాగ్స్ అండ్ పోల్స్’ కేంద్రం యజమాని పద్మావతి.. హైదరాబాద్లోని సంజీవయ్య పార్కులో భారీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ఒక్కొక్క జాతీయ పతాకం తయారీకి 10-12 మంది సభ్యుల బృందానికి వారం రోజులు పడుతుందన్నారు. ఖర్చు రూ.1,12,000 వరకు అవుతుందని, దేశంలోని 25 రాష్ట్రాలకు జాతీయ జెండాలను పంపుతున్నామన్నారు.
సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడాలి: జిల్లా జడ్జి
జిల్లా కోర్టులో జెండాకు వందనం చేస్తున్న న్యాయమూర్తి టి.శ్రీనివాసరావు తదితరులు
ఖానాపురం హవేలి, న్యూస్టుడే: సమాజంలో సాంఘిక దురాచారాలైన అవినీతి, వరకట్నం, భ్రూణహత్యలను రూపుమాపడానికి సమష్టిగా కృషి చేయాలని జిల్లా న్యాయమూర్తి డాక్టర్ టి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో మువ్వన్నెల పతాకాన్ని గురువారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఇటువంటి సాంఘిక దురాచారాలను రూపుమాపటానికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఆర్.డానీరూథ్, ఎన్.సంతోష్కుమార్, ఎన్.అమరావతి, మహ్మద్ అబ్దుల్ జావీద్ పాషా, కె.ఆషారాణి, ఎన్.వెంకటహైమ పూజిత, ఎన్.శాంతి సోని, పి.మౌనిక, ఎ.ఆశాలత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గొల్లపూడి రామారావు తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం నేరవిభాగం, న్యూస్టుడే: గణతంత్ర వేడుకలను పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పోలీసు కమిషనర్ కార్యాలయం, పోలీసు హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో అడిషనల్ డీసీపీ(అడ్మిన్) డాక్టర్ శబరీష్, పోలీసు శిక్షణ కేంద్రం, సిటీ ఆర్ముడ్ రిజర్వ్ పోలీసు హెడ్క్వార్టర్స్, శ్రీకృష్ణ ప్రసాద్ మెమోరియల్ స్కూల్లో అడిషనల్ డీసీపీ(ఏఆర్) కుమారస్వామి, ఖమ్మంలోని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ బొల్లినేని ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ రామోజు రమేష్, సీసీఆర్బీ ఏసీపీ వెంకటస్వామి, ఎస్బీ ఏసీపీ ప్రసన్నకుమార్, సీసీఎస్ ఏసీపీ రవి, కార్యాలయ ఏవో అక్తరున్నీసాబేగం, ఆర్ఐలు సాంబశివరావు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.
* ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో ఆర్ఎం ఎస్తర్ ప్రభులత, జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో డీఎఫ్వో జయప్రకాశ్, ఖమ్మం అగ్నిమాపక కార్యాలయంలో ఎస్ఎఫ్వో పిన్నింటి రాజేశ్వరరావు జాతీయ పతాకాలు ఎగురవేశారు.
ఖమ్మం నగరం, న్యూస్టుడే: జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు, డిప్యూటీ సీఈవో చంద్రశేఖర్ తదితరులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం సీఈవో వింజం అప్పారావు జాతీయ జెండా ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివిధ అనుమతులకు సువిధ
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.