మామిడి రైతుకు చేదు అనుభవం
రెండేళ్లుగా నష్టాల ఊబిలో చిక్కుకున్న మామిడి రైతులు.. ఈసారైనా లాభాల రుచి చూడాలని ఆశించినా పరిస్థితులు అనుకూలించటం లేదు.
ఈటీవీ, ఖమ్మం
పూతదశలోనే ఎండిపోతున్న మామిడి చెట్లు
రెండేళ్లుగా నష్టాల ఊబిలో చిక్కుకున్న మామిడి రైతులు.. ఈసారైనా లాభాల రుచి చూడాలని ఆశించినా పరిస్థితులు అనుకూలించటం లేదు. తామర పురుగు, ఇతర తెగుళ్ల దెబ్బతో మామిడి తోటలన్నీ వాడిపోతున్నాయి. పంటను కాపాడుకునేందుకు పురుగుమందులు పిచికారి చేస్తున్నా పరిస్థితిలో మార్పు రావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది దిగుబడులు క్షీణించి.. అంతకుముందు కొవిడ్ మహమ్మారితో నష్టాల పాలయ్యామని చెబుతున్నారు.
కాత దశలో కష్టాలు..
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సుమారు 45వేల ఎకరాల్లో మామిడి సాగవుతోంది. తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, కారేపల్లి, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, దమ్మపేట, చంద్రుగొండ, ముల్కలపల్లి, పాల్వంచ, టేకులపల్లి, ఇల్లెందు, జూలూరుపాడు మండలాల్లో రైతులు పండిస్తున్నారు. తోతాపురి, బంగినపల్లి, రసాల్, హిమాయత్, దశేరీ, కేసరి, రాయల్ స్పెషల్, చిన్నరసాలను ఎక్కువగా సాగుచేస్తున్నారు. తామర పురుగు, ఇతర తెగుళ్లు సోకటంతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. సీజన్ ఆరంభం నుంచీ పూత దశ వరకు రైతులు ఆశించిన మేర కనిపించిన మామిడి తోటలు.. తామర పురుగు, తెగుళ్లు సోకటంతో తేలిపోతున్నాయి.
దిగుబడి దిగులు
మామిడి తోటలను కాపాడుకునేందుకు సాగుదారులు అష్టకష్టాలు పడుతున్నారు. పూత దశ దాటి కాత వచ్చే సమయంలో తామర పురుగుతోపాటు ఇతర తెగుళ్ల నివారణకు ఇబ్బడిముబ్బడిగా పురుగుమందులు పిచికారి చేస్తున్నారు. ఒక్కో రైతు ఒక్కసారి మందుల పిచికారికి సుమారు రూ.20వేల నుంచి రూ.లక్ష వరకు వెచ్చిస్తున్నారు. ఒక్కొక్కరు ఇప్పటికే ఐదుసార్లు పురుగుమందులు పిచికారి చేసినా ఆశించిన ఫలితం కానరావటం లేదు. సాధారణంగా ఎకరాకు 10 టన్నుల దిగిబడి రావాల్సి ఉండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం రెండు, మూడు టన్నులూ వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు.
నివారణ చర్యలు చేపట్టాలి
మరియన్న ఉద్యానశాఖ అధికారి, భద్రాద్రి కొత్తగూడెం
మిర్చి పంటలకు ఆశించినట్లే ప్రస్తుతం మామిడి తోటలకు తామర పురుగు సోకుతోంది. పూత ఎండి పిందె రాలిపోవడం, కాయపగలటం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి నివారణకు 1గ్రాం జింక్ సల్ఫేట్+ 1గ్రాం బోరాన్ లీటరు నీటికి కలిపి పూమొగ్గ పెరిగే దశలో చెట్లు తడిచేలా పిచికారి చేయాలి. లీటరు నీటికి గ్రాము కార్బండాజిమ్ కలిపి పిచికారి చేస్తే పూత, పెందె దశలో ఆకుమచ్చ వ్యాప్తిని అరికట్టవచ్చు.
మూడేళ్లుగా నష్టాలే
సయ్యద్ నబీ, కల్లూరు
25 ఏళ్లుగా మామిడి సాగు చేస్తున్నాను. మూడేళ్లుగా నష్టాలే మిగులుతున్నాయి. ఈసారి మరీ దారుణం. తామరపురుగు ఉద్ధృతితో ఐదుసార్లు మందులు పిచికారి చేశాను. 80 చెట్లకు రూ.20వేలు వెచ్చించాను. అయినా పంట చేతికొచ్చేలా కనిపించట్లేదు.
పెట్టుబడులు వచ్చేలా లేవు
దేశిరెడ్డి నాగిరెడ్డి, రేజర్ల
పదెకరాల్లో మామిడి సాగుచేస్తున్నాను. తామర పురుగు, తేనెమంచుతో తోటలు మాడిపోయి పూత రాలిపోతుంది. ఎకరాకు రూ.50వేల వరకు పెట్టుబడి పెట్టాను. రూ.వేలు వెచ్చించి పురుగు మందులు పిచికారి చేసినా ఫలితం లేదు. ఈఏడాది పెట్టుబడులు వచ్చే పరిస్థితులూ లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన జీఎం
[ 25-04-2024]
ఇల్లందు ఏరియా సింగరేణి రన్స్ అండ్ గోల్స్ స్టేడియం (24 ఏరియా)లో వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోషియేషన్ ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. -
కారేపల్లిలో భాజపా అభ్యర్థి రోడ్ షో
[ 25-04-2024]
కారేపల్లి ప్రధాన రహదారిలో భాజపా ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు గురువారం రోడ్ షో నిర్వహించారు. -
ఆ ఊట నీళ్లే వారికి అమృతం.. 30 ఏళ్లుగా తాగుతున్న ఆదివాసీలు
[ 25-04-2024]
చర్ల మండలంలోని మారుమూల పల్లె వెంకటచెరువులో ఆదివాసీలు ఇప్పటికీ ఊటనీటినే తాగుతున్నారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట