ప్రణాళిక అనుసరిస్తే తల్లీబిడ్డా క్షేమం
కూసుమంచికి చెందిన కె.త్రివేణి అనే గర్భిణికి తీవ్రంగా నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను 108లో మండల కేంద్రంలోని పీహెచ్సీకి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రసవం అయ్యి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
సత్తుపల్లి, న్యూస్టుడే
ఇటీవల 108లో ప్రసవించినగర్భిణి
కూసుమంచికి చెందిన కె.త్రివేణి అనే గర్భిణికి తీవ్రంగా నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను 108లో మండల కేంద్రంలోని పీహెచ్సీకి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రసవం అయ్యి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఖమ్మం దానవాయిగూడెం నుంచి జిల్లా ఆస్పత్రికి అంబులెన్సులో గర్భిణిని తరలిస్తుండగా జడ్పీ సెంటరుకు చేరుకోగానే నొప్పులు అధికమవడంతో రహదారి వెంబడి వాహనం నిలిపి సిబ్బంది కాన్పు చేశారు.
మారుమూల మన్యం ప్రాంతంలోనే కాదు. పట్టణాలు, ఆస్పత్రులకు చేరువలో ఉన్న గ్రామాల నుంచి పురిటి నొప్పులతో గర్భిణులను తరలిస్తుండగా మార్గమధ్యలోనే కాన్పులు చేయాల్సి వస్తోంది. అంబులెన్సుల్లో వైద్య సిబ్బంది ఉండటంతో ప్రమాదాల నుంచి తప్పించుకుంటున్నా.. ప్రైవేటు వాహనాల్లో తరలిస్తుండగా ఇలాంటి సమస్యలు తలెత్తినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వారిలో హైరిస్క్ కేసులుంటే ప్రాణాంతకమే అవుతుంది. అధునాతన వైద్యసేవలు అందుబాటులోకి వస్తున్నా.. ఇలాంటి పరిస్థితులకు ప్రధానంగా అవగాహన లోపమే కారణమవుతోంది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ బర్త్ప్లాన్ను అనుసరిస్తే తల్లీబిడ్డా సురక్షితంగా బయటపడొచ్చని వైద్యులు సూచిస్తున్నారు.
ఎందుకిలా?
వైద్య సిబ్బంది సలహాలు, సూచనలు పాటించకుండా, నొప్పులు వచ్చేంత వరకు ఇళ్ల వద్దే ఉంటూ పురిటినొప్పులు ఎక్కువై హడావిడిగా ఆస్పత్రులకు తరలించే సమయంలో మధ్యలోనే ప్రసవాలు అయ్యి తల్లీబిడ్డా ఇబ్బందులు పడిన సందర్భాలు లేకపోలేదు. ఒక్కోసారి 108 వాహనాలు వేరే ప్రాంతాలకు వెళ్లినపుడు సరైన వాహన సదుపాయాలు లేక అవస్థలు ఎదుర్కొంటున్నారు.ఏడు నెలలకే కాన్పులు కావడం, పుట్టిన బిడ్డ బరువు తక్కువ, పలు అనారోగ్య కారణాలతో జన్మించి అస్వస్థతకు గురికావడం వంటి అనేక ఘటనలు ఉమ్మడి జిల్లాలో చోటుచేసుకున్నాయి.
వైద్యసిబ్బంది పర్యవేక్షణ
హైరిస్క్ గర్భిణులను ముందుగానే గుర్తించి వారికి పరీక్షలు చేయించి అవసరమైన మందులను ఇచ్చి సురక్షితమైన కాన్పులు జరిగేలా ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు వ్యవహరించాల్సి ఉంటుంది. సాధారణ కాన్పుల కోసం సమకూర్చుతున్న వ్యాయామ సదుపాయాలను గర్భిణులు సద్వినియోగం చేసుకునేలా మిడ్వైఫరీ నర్సులు చూడాలి. ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తమ పరిధిలోని గర్భిణులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. నాలుగో చెకప్ మాత్రం గైనకాలజిస్ట్తోనే చేయించుకోవాలి. అవసరమైన టీకాలతోపాటు ప్రతి గర్భిణికి సాధారణ కాన్పు, శస్త్రచికిత్సలపై అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి గురు, శుక్రవారాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి పరీక్షలు చేస్తుంటారు. పురిటినొప్పులు, సాధారణ నొప్పులకు తేడాలను ప్రతి గర్భిణీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రసవం తేదీకి రెండుమూడు రోజుల ముందు ఆసుపత్రిలో చేరి వైద్యుల పర్యవేక్షణలో ఉంటే కాన్పు ఎలాంటి రిస్క్ లేకుండా చేసేందుకు వీలుంటుంది.
బర్త్ప్లాన్ అమలు తీరిది
మతాశిశుమరణాలు తగ్గించాలనే సంకల్పంతో ప్రభుత్వం రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ (ఆర్సీహెచ్) కింద బర్త్ప్లాన్ను తీసుకొచ్చింది. గర్భం దాల్చిన తర్వాత బర్త్ప్లాన్లో దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వైద్య, రక్తపరీక్షల అనంతరం ఆరు నెలల వరకు గర్భిణులకు ఆశాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చెకప్లు చేయించడం, ఆ తర్వాత 7, 8, 9 నెలల్లో సీహెచ్సీల్లో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించేలా జాగ్రత్తలు తీసుకుంటారు. సదరు గర్భిణి ఎక్కడ కాన్పు చేయించుకుంటారో ముందే నమోదు చేసుకోవాలి.
‘ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఆరు నెలల కాలంలో దాదాపు 50 మంది గర్భిణులకు 108లో కాన్పులు జరిగాయి.’
నెలలు నిండిన తర్వాత చెకప్లు చేయించుకోవాలి
బి.విజయలక్ష్మి, గైనకాలజిస్ట్,సత్తుపల్లి సీహెచ్సీ
నెలలు నిండిన తర్వాత వారానికోసారి గర్భిణులు చెకప్లు చేయించుకోవాలి. ప్రసవం సమయం సమీపించే క్రమంలో ముందుగానే ఆసుపత్రుల్లో చేరి వైద్యుల పర్యవేక్షణలో ఉండాలి. గర్భిణులు రెగ్యులర్గా ఏఎన్సీ చెకప్లు చేయించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మధ్యలో రక్తస్రావం అయినా, ఉమ్మనీరు వస్తున్నా, వెనుక భాగంలో నొప్పులు వచ్చినా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీటిని తప్పనిసరిగా పరీక్షించాలి
[ 28-03-2024]
ప్రజలకు సరఫరా చేసే తాగునీటికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఎంపీడీవో రామకృష్ణ సూచించారు. -
కార్యకర్తలకు అండగా ఉంటా: పాయం
[ 28-03-2024]
కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండలంలో గురువారం పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
[ 28-03-2024]
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వాహనాన్ని బయ్యారం అడ్డరోడ్డులోని ఎన్నికల తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు సోదా చేశారు. -
దుస్తుల పంపిణీ
[ 28-03-2024]
పినపాక మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థులకు గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. -
కాంగ్రెస్లో చేరిన భారాస సొసైటీ డైరెక్టర్
[ 28-03-2024]
భారాసకు చెందిన కారేపల్లి సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ గురువారం కాంగ్రెస్ లో చేరారు. -
కరవు తీరా పని..!
[ 28-03-2024]
కరవు పరిస్థితులతో వ్యవసాయ కూలీ పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గ్రామీణులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దన్నుగా నిలుస్తోంది. -
మూడు ప్రైవేట్ ఆసుపత్రుల సీజ్
[ 28-03-2024]
ఖమ్మం నగరంలో మూడు ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాలతి తెలిపారు. ఉన్నతాధికారులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఖమ్మంలోని వివిధ ఆసుపత్రుల్లో బుధవారం తనిఖీచేశారు. -
‘గాడి’న పడకుంటే.. గత్తర గత్తర
[ 28-03-2024]
అనేక మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కొన్ని మార్గాల్లో యువకులు పోటీలు పడుతూ ద్విచక్ర వాహనాలను అతివేగంతో వంకరటింకరగా నడుపుతున్నారు. -
ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి: తాండ్ర
[ 28-03-2024]
అయోధ్య-భద్రాద్రి ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
డ్రాగన్ పండు.. లాభాలు మెండు
[ 28-03-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు, విద్యాధికులు, యువ రైతులు సైతం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. -
ఆ ఇద్దరు దోచేస్తున్నారు..!
[ 28-03-2024]
‘దేశీ శిక్షణలో భాగంగా అధికారులకు రూ.10వేలు చెల్లించి తరగతులకు హాజరయ్యాను. ఒక్కరోజు గైర్హాజరైతే రూ.3వేలు వసూలు చేశారు. -
ఆక్రమణల చెరలోనే సాగర్ కాల్వలు
[ 28-03-2024]
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మధిర బ్రాంచి కెనాల్ పరిధిలో ఉన్న ఊటుకూరు, మధిర మేజర్ కాల్వలు కబ్జాకు గురయ్యాయి. -
మద్యం మత్తులో యువకుల హల్చల్
[ 28-03-2024]
చంద్రుగొండలో మద్యం మత్తులో ఐదుగురు యువకులు పలువురిపై దాడిచేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. -
నిలబడలేకున్నా.. ఆసరా అందించరూ..
[ 28-03-2024]
నిరుపేద దంపతులు రెక్కల కష్టమ్మీద ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరి పెళ్లిళ్లు చేశారు. ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. -
మద్యం తాగాడని ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడి నిర్బంధం
[ 28-03-2024]
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరై విద్యార్థులను కొట్టాడని పాఠశాలలో ఉంచి తాళం వేసిన ఘటన చర్ల మండలంలో చోటుచేసుకుంది. -
రామయ్య హుండీలో కాసుల గలగల..!
[ 28-03-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలోని మూడు రకాల హుండీలు కాసులతో కళకళలాడాయి. 26 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. జనరల్ హుండీల ద్వారా రూ.71,22,878 సమకూరింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ