logo

డబ్బుతో ప్రలోభ పెడతారు జాగ్రత్త : ఎంపీ

‘ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎప్పుడూ రానివారు వస్తుంటారు. డబ్బు ఆశ చూపి ప్రలోభాలకు గురిచేస్తారు. వారి మాటలకు మోసపోవద్దు.

Updated : 29 Jan 2023 06:34 IST

లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు అందిస్తున్న
ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు 

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: ‘ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎప్పుడూ రానివారు వస్తుంటారు. డబ్బు ఆశ చూపి ప్రలోభాలకు గురిచేస్తారు. వారి మాటలకు మోసపోవద్దు. మాయగాళ్లకు కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని తెలపండ’ని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి నుంచి 37 మందికి లబ్ధిదారులకు మంజూరైన రూ.13 లక్షల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలసి శనివారం అందజేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా కేసీఆర్‌ను గద్దె దించడం భాజపా, కాంగ్రెస్‌ వల్ల కాదని, సీఎంగా కేసీఆర్‌ గెలిచి హ్యాట్రిక్‌ సాధిస్తారని నామా పేర్కొన్నారు. నియోజకవర్గంలో అన్ని సర్వేలూ భారాస ముందంజలో ఉన్నట్లు తెలుపుతున్నాయని, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. తొలుత నారంవారిగూడెంలో నూతనంగా నిర్మించిన ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొని పూజలు చేశారు. జమ్మిగూడెంలో వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఎంపీపీ శ్రీరామమూర్తి, వైస్‌ ఎంపీపీ ఫణింద్ర, దమ్మపేట జడ్పీటీసీ సభ్యుడు పైడి వెంకటేశ్వరరావు, సర్పంచులు అట్టం రమ్య, సాధు జ్యోత్స్నబాయ్‌, మందపాటి రాజమోహన్‌రెడ్డి, బిర్రం వెంకటేశ్వరరావు, ఎస్కే ముబార్‌ బాబా, తాడేపల్లి రవి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని