రథ సప్తమి వేళ చంద్రప్రభ వాహన సేవ
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం రథ సప్తమి సందర్భంగా చంద్ర ప్రభ వాహన సేవ నిర్వహించారు.
సీతారాముల వారి వెండి రథ సేవ
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయంలో శనివారం రథ సప్తమి సందర్భంగా చంద్ర ప్రభ వాహన సేవ నిర్వహించారు. వెండి రథ సేవ చేశారు. దేవతామూర్తులకు నూతన వస్త్రాలను అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విశేష సంఖ్యలో దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అర్చకులు రామయ్యకు సుప్రభాతం పలికి ఆరాధించారు. బంగారు తులసీదళాలను స్వామి పాదాల వద్ద ఉంచి మొక్కుకున్నారు. వారానికి ఒకసారి కొనసాగే ఈ వేడుకను వైదిక పెద్దలు ఘనంగా నిర్వహించారు. ఉప ప్రధానార్చకుడు రామస్వరూప్ ఆధ్వర్యంలో నిత్య కల్యాణంలో భాగంగా మాంగళ్యధారణ తలంబ్రాల వేడుక నిర్వహించారు. దర్బారు సేవ భక్తిశ్రద్ధలను పెంచింది. ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ తివారీ రాములవారిని దర్శించుకున్నారు. ఆలయ సూపరింటెండెంట్ నిరంజన్ స్వాగతం పలకగా వైదిక పెద్దలు ఆశీర్వచనం పలికారు. హైదరాబాద్లోని నాంపల్లికి చెందిన భక్తులు రామకోటి పుస్తకాలను తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు.
నేటితో వాగ్గేయకారోత్సవాల ముగింపు
శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో వాగ్గేయకారోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన శనివారం కళాకారులు ఆలపించిన కీర్తనలు ఆధ్యాత్మికతను చాటాయి. నాదస్వరం వీనుల విందు చేసింది. ప్రతి గళం కోకిల గానమై నిలిచింది. మృదంగం, వయోలిన్ ద్వారా పలికిన సంగీతం శ్రోతలను రస సాగరంలో ముంచెత్తింది. రామదాసు జయంతి ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి.
నగరంలోని ఆలయాల్లో..
పర్ణశాల రామాలయంలో సూర్యభగవానుడికి అభిషేకం
ఖమ్మం సాంస్కృతికం, న్యూస్టుడే: రథ సప్తమిని పురస్కరించుకొని నగరంలోని పలు దేవాలయాల్లో శనివారం సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ట్రంకు రోడ్డులోని శ్రీగుంటుమల్లేశ్వరస్వామి దేవస్థానం, పర్ణశాల రామాలయంలో అర్చకుల ఆధ్వర్యంలో సూర్యునికి క్షీరాభిషేకాలు, పంచామృతాభిషేకాలు చేశారు. తితిదే, వీహెచ్పీ ఆధ్వర్యంలో పలు పాఠశాలల్లో విద్యార్థులతో ఆదిత్య హృదయం, అష్టోత్తర పారాయణం చేసి సూర్య నమస్కారాలు చేయించారు. అర్చకులు దాములూరి కృష్ణశర్మ, పవన్ కుమారాచార్యులు, ఆలయ ఈవోలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
-
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం జిల్లాలోని ప్రైవేటు కళాశాలలు సత్తాచాటాయి. బుధవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించినట్టు ఆయా కళాశాలల యాజమాన్యాలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా