logo

ప్రతి కదలికనూ ప్రజలు గమనిస్తున్నారు: పొంగులేటి

ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది గుండెల్లో శీనన్నగా నిలిచానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Published : 29 Jan 2023 03:08 IST

సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాసరెడ్డి

కొణిజర్ల, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది గుండెల్లో శీనన్నగా నిలిచానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తనికెళ్లలోని గ్రేస్‌ కళాశాలలో శనివారం జరిగిన విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడారు. చదువుకునే రోజుల్లో ఆర్థికంగా నిలదొక్కుకుని పదిమందికి సాయం చేయాలనేది మొదటి లక్ష్యంగా ఉండేదని తెలిపారు. వ్యాపారరీత్యా నిలదొక్కుకున్న తరవాత రాజకీయాల్లోకి ప్రవేశిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు దీవించారన్నారు. పార్లమెంటు సభ్యునిగా, అది దిగిపోయిన తరవాత నా జీవితాన్ని, నడకను, ప్రతి కదలికను ఉమ్మడి జిల్లా ప్రజలతోపాటు, రెండు రాష్ట్రాల ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజల ప్రేమ, అభిమానం పొందడం చిన్న విషయం కాదన్నారు. ఇంటర్‌ తరవాత ఉన్న జీవితం చాలా విలువైనదని గాడితప్పకుండా చూసుకోవాలని సూచించారు. చదువంటే ఉద్యోగం ఒకటేకాదని, అదిలేకపోయినా తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా లక్ష్యాన్ని చేరుకుని ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. ఎంపీపీ గోసు మధు, ఎంపీటీసీ కోటేశ్వరరావు, డీఐఈవో రవిబాబు, గ్రేస్‌ సంస్థ అధ్యక్షుడు జాకబ్‌, ఏవో శైలజ, ప్రిన్సిపల్స్‌ కృష్ణయ్య, చంద్రబాబు, శ్రీవేణు, వాణి, సుమన, హోం ఇన్‌ఛార్జ్‌ పుల్లారావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని