మట్టా దయానంద్కు గుండెపోటు
పెనుబల్లి మండలం అడవిమల్లేలలో శ్రీవేంకటేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి శనివారం హాజరైన భారాస నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గుండెపోటుకు గురయ్యారు.
పెనుబల్లి, సత్తుపల్లి, న్యూస్టుడే: పెనుబల్లి మండలం అడవిమల్లేలలో శ్రీవేంకటేశ్వరుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి శనివారం హాజరైన భారాస నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ గుండెపోటుకు గురయ్యారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకొని, ధ్వజస్తంభం వద్ద పూజలు చేస్తుండగా ఒక్కసారిగా కూలబడిపోవడంతో అతని అనుచరులు పట్టుకొని వెంటనే సత్తుపల్లి తరలించారు. సత్తుపల్లి వైద్యశాలలో దయానంద్ను పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా నిర్ధారించి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. దయానంద్ త్వరగా కోలుకోవాలని సత్తుపల్లిలో నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు అలవాల కరుణాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పెళ్లింట విషాదం..
శ్రీనివాసరావు
ములకలపల్లి, టేకులపల్లి, న్యూస్టుడే: కుమారుని రిసెప్షన్కు వెళ్తూ ఓ తండ్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. టేకులపల్లి మండలం గంగారం గ్రామీణ వైద్యుడు లక్కింశెట్టి శ్రీనివాసరావు(45)కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారుడు సాయికి అశ్వారావుపేట మండలానికి చెందిన యువతితో ఈ నెల 25న పాల్వంచ పెద్దమ్మగుడి వద్ద వివాహమైంది. వధువు ఇంటి వద్ద జరిగే రిసెప్షన్కు కుటుంబ సభ్యులు శనివారం ఉదయం ఓ వాహనంలో బయలుదేరారు. కొంత దూరం వచ్చాక శ్రీనివాసరావు ఆ వాహనం దిగి తాను ద్విచక్ర వాహనంపై వస్తానని చెప్పి ఇంటికి వెళ్లి బైక్పై బయలుదేరాడు. ములకలపల్లి మండలం కొత్తగంగారం శివారు అటవీ ప్రాంతంలో గోతుల వద్ద ఇతని బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడు. తలకు త్రీవ గాయమైంది. అటవీ ప్రాంతం కావడంతో చాలాసేపు ఎవరూ గమనించలేదు. ఆ మార్గంలో వచ్చినవారు 108కు సమాచారం ఇవ్వడంతో పాల్వంచ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కుటుంబసభ్యులు ఖమ్మం తరలిస్తుండగా మార్గంమధ్యలోనే శ్రీనివాసరావు మృతి చెందాడు. కుమారుడు కార్తిక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై సురేష్ తెలిపారు.
విద్యుదాఘాతంతో ఒకరి మృతి
బొజ్య మృతదేహం
మిర్యాలగూడ గ్రామీణం, న్యూస్టుడే: పొట్టకూటి కోసం వచ్చిన కార్మికుడు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం శివారులో శనివారం చోటుచేసుకుంది. ఏఈ కిషన్లాల్ తెలిపిన వివరాల ప్రకారం... వెంకటాద్రిపాలెం శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ పంపులో విద్యుత్తు పనుల నిమిత్తం ఏడుగురు కార్మికులను గుత్తేదారు తీసుకొచ్చారు. సదరు గుత్తేదారు.. అధికారులతో మాట్లాడి ఎల్సీ తీసుకుని విద్యుత్తు సరఫరా నిలిపివేయించారు. భద్రాద్రి జిల్లా ములకలపల్లి మండలం కొత్త గంగారం గ్రామానికి చెందిన కొరం బొజ్య(40), ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బత్తులపల్లి గ్రామానికి చెందిన గౌరాజు కృష్ణ మరో కార్మికుడు వీరస్వామి స్తంభం ఎక్కారు. పనిచేస్తుండగా... విద్యుత్తు సరఫరా కావడంతో బొజ్య, కృష్ణ విద్యుదాఘాతానికి గురై కిందపడ్డారు. బొజ్య అక్కడికక్కడే మృతిచెందగా కృష్ణకు గాయాలయ్యాయి. ఎల్సీ ఇవ్వటంలో నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఏఈ తెలిపారు. బొజ్యకు భార్య, కుమార్తె ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్