ఆయిల్పాం సాగుపై అవగాహన కల్పించండి: కలెక్టర్
జిల్లాలో ఆయిల్పాం సాగును పెంచేందుకు రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఉద్యాన, వ్యవసాయ, బిందు సేద్యం, ఆయిల్ఫెడ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.
కొత్తగూడెం కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో ఆయిల్పాం సాగును పెంచేందుకు రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఉద్యాన, వ్యవసాయ, బిందు సేద్యం, ఆయిల్ఫెడ్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 16,860 ఎకరాల్లో ఆయిల్పాం మొక్కలు నాటాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఇప్పటివరకు 12 వేల ఎకరాల్లో నాటినట్టు, మార్చి 15 నాటికి లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశించారు. రాయితీ మొక్కలు తీసుకున్న రైతులు నాటారో లేదో ఉద్యాన, వ్యవసాయ అధికారులు తనిఖీ చేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. బిందు సేద్యం ఏర్పాటు ప్రక్రియ గురించి జైన్, కొటారి, నెటాఫిమ్, ఫినోలెక్స్ సంస్థల జిల్లా కో-ఆర్డినేటర్లను అడిగి తెలుసుకున్నారు. బిందు సేద్యం ఏర్పాటులో లక్ష్య సాధనలో వెనకబడి ఉన్న వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఉద్యాన శాఖ ఆధికారిని ఆదేశించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి జి.మరియన్న, జిల్లా వ్యవసాయాధికారి అభిమన్యుడు, ఆయిల్ఫెడ్ డివిజన్ అధికారి బాలకృష్ణ, గోద్రేజ్ సంస్థ మేనేజర్ రామకృష్ణ పాల్గొన్నారు.
నిధులు మంజూరు చేయాలి
జిల్లాలో అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదిత నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ అనుదీప్ కోరారు. నీతిఅయోగ్ మిషన్ డైరెక్టర్ రాకేష్ రంజన్ ఆకాంక్షిత మంగళవారం దిల్లీ నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ అంగన్వాడీ, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి రూ.6 కోట్లు అవసరమని ఇప్పటికే ప్రతిపాదనలు పంపామన్నారు. గర్భిణీలు, చిన్నారుల్లో రక్త హీనతను నివారించేందుకు ఎంపికచేసిన వెయ్యి అంగన్వాడీ కేంద్రాల్లో చిరుధాన్యాల సరఫరాకు చర్యలు తీసుకుంటునట్లు కలెక్టర్ వివరించారు. అనంతరం అనుదీప్ జిల్లా ప్రణాళిక అధికారి, చిరు ధాన్యాల ప్రాజెక్టు కో-ఆర్డినేటర్, యాస్పిరేషన్ ప్రోగ్రాం లీడర్తో సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిరుధాన్యాల ప్రాధాన్యం తెలిపే చదువుకు సంబంధించిన వనరులను ఏర్పాటు చేయాలని చిరుధాన్యాల ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ మోహన్ను ఆదేశించారు. జిల్లా ప్రణాళిక అధికారి యు.శ్రీనివాసరావు, చిరుధాన్యాల ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ మోహన్, యాస్పిరేషన్ ప్రోగ్రాం లీడర్ పీయూష్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
[ 19-04-2024]
గత విద్యా సంవత్సరంలో బదిలీ పొంది రిలీవర్ లేనందున రిలీవ్ చేయని ఉపాధ్యాయులను వెంటనే వారు బదిలీ పొందిన స్థానంలో నియమించాలని తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ వీరు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. -
విజేతలకు బహుమతులు అందజేత
[ 19-04-2024]
పొన్నేల్లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు