ఖమ్మం రైల్వేస్టేషన్లో గంజాయి పట్టివేత
ఖమ్మం రైల్వేస్టేషన్లో ఇద్దరు మహిళల నుంచి రూ.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. జీఆర్పీ స్టేషన్లో ఎస్సై పి.భాస్కర్రావు వివరాలు వెల్లడించారు.
స్వాధీనం చేసుకున్న గంజాయి, నిందితులను చూపుతున్న పోలీసులు
ఖమ్మం మామిళ్లగూడెం, న్యూస్టుడే: ఖమ్మం రైల్వేస్టేషన్లో ఇద్దరు మహిళల నుంచి రూ.5 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. జీఆర్పీ స్టేషన్లో ఎస్సై పి.భాస్కర్రావు వివరాలు వెల్లడించారు. తెలంగాణ రైల్వే ఎస్పీ ఎస్కె.సలీమా, కాజీపేట్ డీఎస్పీ మల్లారెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మం జీఆర్పీ, ఆర్పీఎఫ్ సీఐలు ఎ.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం రైల్వేస్టేషన్లో తనిఖీలు నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు స్వప్నా నాయక్, సఫిరా మాలి రెండో ప్లాట్ఫాంపై అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో వారి వద్దనున్న 3 సంచుల్లో 14 కిలోల గంజాయిని గుర్తించారు. నిందితులు బరంపూర్ రైల్వేస్టేషన్ నుంచి సికింద్రాబాద్కు కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలులో గంజాయిని తరలిస్తుండగా రైలు టిక్కెట్ తనిఖీ చేస్తున్నారని గుర్తించి ఖమ్మం రైల్వేస్టేషన్లో దిగారు. రెండో ప్లాట్ఫాంపై మరో రైలు కోసం వేచి ఉండగా పట్టుకున్నామని, గంజాయి విలువ రూ.5 లక్షలు ఉంటుందని ఎస్సై భాస్కర్రావు తెలిపారు. కేసు నమోదు చేసి కాజీపేట్ రైల్వే న్యాయస్థానానికి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కాజీపేట్ రైల్వే ఎస్సై కె.అశోక్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.
ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే: ఆటోనగర్కు చెందిన కల్యాణ్, వరంగల్ క్రాస్రోడ్డుకు చెందిన ఎన్.కల్యాణ్, జలగంనగర్కు చెందిన ఫయాజ్ గుర్తు తెలియని వ్యక్తుల వద్ద గంజాయి కొనుగోలు చేసి ప్లాస్టిక్ సంచిలో వేసుకొని చిన్నచిన్న పొట్లాలుగా విక్రయించడానికి ప్రయత్నిస్తుండగా కోదాడ అడ్డరోడ్డు వద్ద ఖమ్మం గ్రామీణ పోలీసులు మంగళవారం వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 350 గ్రాముల గంజాయి, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారేపల్లిలో భాజపా అభ్యర్థి రోడ్ షో
[ 25-04-2024]
కారేపల్లి ప్రధాన రహదారిలో భాజపా ఖమ్మం ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు గురువారం రోడ్ షో నిర్వహించారు. -
ఆ ఊట నీళ్లే వారికి అమృతం.. 30 ఏళ్లుగా తాగుతున్న ఆదివాసీలు
[ 25-04-2024]
చర్ల మండలంలోని మారుమూల పల్లె వెంకటచెరువులో ఆదివాసీలు ఇప్పటికీ ఊటనీటినే తాగుతున్నారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
[ 25-04-2024]
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు బుధవారం విడుదల య్యాయి. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 63.84 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో ఖమ్మం జిల్లా నాలుగో స్థానంలో, -
కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాంరెడ్డి
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డిని ఆ పార్టీ అధిష్ఠానం బుధవారం ప్రకటించింది. కాంగ్రెస్ శ్రేణుల నెలన్నర రోజుల ఉత్కంఠకు తెరపడింది. -
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!