పోడు పట్టాల దరఖాస్తులకు డివిజన్ కమిటీ సిఫార్సు
జిల్లాలో పోడు భూములకు పట్టాలు జారీ చేసేందుకు 3,933 దరఖాస్తులకు సంబంధించి 4,925.63 ఎకరాల భూమికి రెవెన్యూ డివిజన్ స్థాయి కమిటీలు సిఫార్సు చేయగా జిల్లాస్థాయి కమిటీలో చర్చించినట్లు కలెక్టర్ గౌతమ్, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ గౌతమ్, ఐటీడీఏ పీవో గౌతమ్ తదితరులు
ఖమ్మం నగరం, న్యూస్టుడే: జిల్లాలో పోడు భూములకు పట్టాలు జారీ చేసేందుకు 3,933 దరఖాస్తులకు సంబంధించి 4,925.63 ఎకరాల భూమికి రెవెన్యూ డివిజన్ స్థాయి కమిటీలు సిఫార్సు చేయగా జిల్లాస్థాయి కమిటీలో చర్చించినట్లు కలెక్టర్ గౌతమ్, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు తెలిపారు. ఖమ్మంలోని ఐడీవోసీ భవనంలోని మినీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో పోడు భూములకు పట్టాల జారీ అంశం సమీక్షించారు. కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ... జిల్లాలోని 10 మండలాల్లో 94 గ్రామ పంచాయతీల పరిధిలో 132 ఆవాస ప్రాంతాల నుంచి గిరిజనులకు సంబంధించి 9,507(25,515 ఎకరాలు), గిరిజనేతరుల నుంచి 8980(17,678 ఎకరాలకు) దరఖాస్తులు అందినట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో విచారణ, సర్వే అనంతరం గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేయగా, రెవెన్యూ డివిజన్ స్థాయిలో కమిటీ పరిశీలించిన సిఫార్సుల మేరకు జిల్లా కమిటీలో చర్చించినట్లు తెలిపారు. అభ్యంతరాలుంటే పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తామన్నారు. ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు మాట్లాడుతూ... కల్లూరు రెవెన్యూ డివిజన్ స్థాయి కమిటీ 22 ఆవాసాల్లో 684 దరఖాస్తులకు సంబంధించి 693.48 ఎకరాలు, ఖమ్మం 83 ఆవాసాల నుంచి 3249 దరఖాస్తులకు సంబంధించి 4232.15 ఎకరాలకు హక్కు పత్రాలకు సిఫార్సు చేయగా జిల్లాస్థాయి కమిటీలో చర్చించినట్లు వివరించారు. అర్హులందరికీ అటవీ హక్కు పత్రాలు జారీ చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ స్నేహలత, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, గిరిజన అభివృద్ధి అధికారి కృష్ణనాయక్, జడ్పీటీసీ సభ్యులు ప్రియాంక, జగన్, బుజ్జి, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం: 2023-24 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశం కల్పించేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు అన్నారు. ఇందుకు సంబంధించి ప్రచార గోడ పత్రికను ఖమ్మం ఐడీవోసీ భవనంలో మంగళవారం వారు ఆవిష్కరించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గురుకుల డిగ్రీ కళాశాలలు మణుగూరు (పురుషులు), కొత్తగూడెం(మహిళలు), దమ్మపేట పెద్దవాగు ప్రాజెక్టు(మహిళలు), ఖమ్మం(మహిళలు) కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి కలిగిన 2023 మేలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తండ్రి వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతానికి చెందిన వారికి రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతానికి చెందిన వారికి రూ.2 లక్షల లోపు ఉండాలని, ఇంటర్లో 40 శాతం మార్కులు ఉండాలని సూచించారు. అర్హులైన అభ్యరులు ్ర్ర్ర.్మ్ణ్మ్ర్ణ్య౯్యఁ్యః్చ్ఝ.్మ’ః్చ-్ణ్చ-్చ.్ణ్న్ర.i- వెబ్ సైట్లో సమర్పించాలని పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 5 తుది గడువని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివిధ అనుమతులకు సువిధ
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం