కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం
తెలంగాణలోని అతి పెద్దవాటిలో ఒకటైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పీఠాన్ని అతి పిన్న వయస్కురాలు దోరేపల్లి శ్వేత(30) అధిష్ఠించబోతున్నారు.
ఖమ్మం మార్కెట్ పీఠంపై పిన్న వయస్కురాలు
దోరేపల్లి శ్వేత
ఖమ్మం వ్యవసాయం, న్యూస్టుడే: తెలంగాణలోని అతి పెద్దవాటిలో ఒకటైన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పీఠాన్ని అతి పిన్న వయస్కురాలు దోరేపల్లి శ్వేత(30) అధిష్ఠించబోతున్నారు. 1937 జులై 17న ఇక్కడ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం 1966 ప్రకారం 21.10.1969 నుంచి పని చేస్తోంది. ఇప్పటి వరకు 11 మంది ఛైర్మన్లు పని చేయగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న శ్వేత రెండో మహిళా ఛైర్పర్సన్. ఈమెకన్నా ముందు డౌలె లక్ష్మీప్రసన్న పని చేశారు. ఖమ్మం నగరానికి చెందిన శ్వేత.. తండ్రి దోరేపల్లి శ్రీనివాసరావు గుత్తేదారు, తల్లి జయ గృహిణి. సోదరి శ్రుతి హైదరాబాద్లో ఉంటున్నారు. ఈమె 10వ తరగతి వరకు స్థానిక నిర్మల్ హృదయ్ పాఠశాలలో, ఇంటర్ గుంటూరులోని వికాస్ కళాశాలలో, బీడీఎస్ ఖమ్మం మమత కళాశాలలో చదివారు. రెండుసార్లు కార్పొరేటర్గా గెలుపొందారు. వీరిది వ్యవసాయ కుటుంబం. తాత నర్సయ్య భూస్వామి. వ్యవసాయంలో అపార అనుభవం ఉన్న రైతు నేతలు, సీనియర్ నాయకులు అధిష్ఠించిన ఈ పదవి శ్వేతకు ఒక రకంగా సవాలు వంటిదే..
జోడు పదవులకు సై...: కార్పొరేటర్గా ఉన్న శ్వేత మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్గా ఎంపికైన తర్వాత జోడు పదవులపై పలువురికి సందేహాలు తలెత్తాయి. రెండో పదవి చేపట్టడంపై మార్కెటింగ్శాఖ చట్టంలో ఎలాంటి అభ్యంతరం లేదు. దీంతో రెండు పదవులనూ నిర్వహించే అవకాశం ఉంది.
ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు
మార్కెట్ కమిటీ 12వ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. రోడ్డుకు ఇరువైపులా కటౌట్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నేడు పత్తి యార్డులో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న కార్యక్రమానికి మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.
మార్కెట్ రోడ్డులో ఏర్పాటు చేసిన ప్రచార చిత్రాలు
ఇప్పటి వరకు ఛైర్మన్లుగా పని చేసిన వారు...
పోట్ల వీరయ్య, బయ్యన్న వీరయ్య, నూతలపాటి నందమయ్య, నూకల విజయపాల్రెడ్డి, సామినేని హేమంతరావు, మద్ది మల్లారెడ్డి, చింతనిప్పు లాలయ్య, మానుకొండ రాధాకిశోర్, గుండాల కృష్ణ, మద్దినేని వెంకటరమణ, డౌలె లక్ష్మీప్రసన్న
గిట్టుబాటు ధర కల్పించటమే లక్ష్యం
- దోరేపల్లి శ్వేత, ఖమ్మం ఏఎంసీ ఛైర్పర్సన్
రైతులకు నిత్యం అందుబాటులో ఉంటా. అధికారులు, వ్యాపారులను సమన్వయం చేసి రైతులకు గిట్టుబాటు ధర అందేలా కృషి చేస్తా. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. మంత్రి అజయ్కుమార్ సహకారం తీసుకుని ఏర్పాట్లు చేయిస్తా. రాష్ట్రంలోనే మోడల్ మార్కెట్గా తీర్చిదిద్దుతా.
రైతు కుటుంబం నుంచి వైస్ఛైర్మన్...
రఘునాథపాలెం మండలం రాంక్యాతండాకు చెందిన షేక్ అఫ్జల్(67) మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్గా నేడు ప్రమాణం చేయనున్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఈయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 1984లో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా, 2001 నుంచి 2006 వరకు రాంక్యాతండా సర్పంచిగా సేవలు అందించారు. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం ఛైర్మన్గా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీటిని తప్పనిసరిగా పరీక్షించాలి
[ 28-03-2024]
ప్రజలకు సరఫరా చేసే తాగునీటికి తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని ఎంపీడీవో రామకృష్ణ సూచించారు. -
కార్యకర్తలకు అండగా ఉంటా: పాయం
[ 28-03-2024]
కార్యకర్తలకు నిత్యం అండగా ఉంటానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. పినపాక మండలంలో గురువారం పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు
[ 28-03-2024]
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వాహనాన్ని బయ్యారం అడ్డరోడ్డులోని ఎన్నికల తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు సోదా చేశారు. -
దుస్తుల పంపిణీ
[ 28-03-2024]
పినపాక మండల పరిధిలోని తోగ్గూడెం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థులకు గ్రేస్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా దుస్తులు పంపిణీ చేశారు. -
కాంగ్రెస్లో చేరిన భారాస సొసైటీ డైరెక్టర్
[ 28-03-2024]
భారాసకు చెందిన కారేపల్లి సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ గురువారం కాంగ్రెస్ లో చేరారు. -
కరవు తీరా పని..!
[ 28-03-2024]
కరవు పరిస్థితులతో వ్యవసాయ కూలీ పనులు దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న గ్రామీణులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దన్నుగా నిలుస్తోంది. -
మూడు ప్రైవేట్ ఆసుపత్రుల సీజ్
[ 28-03-2024]
ఖమ్మం నగరంలో మూడు ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్ చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాలతి తెలిపారు. ఉన్నతాధికారులకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఖమ్మంలోని వివిధ ఆసుపత్రుల్లో బుధవారం తనిఖీచేశారు. -
‘గాడి’న పడకుంటే.. గత్తర గత్తర
[ 28-03-2024]
అనేక మంది ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కొన్ని మార్గాల్లో యువకులు పోటీలు పడుతూ ద్విచక్ర వాహనాలను అతివేగంతో వంకరటింకరగా నడుపుతున్నారు. -
ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి: తాండ్ర
[ 28-03-2024]
అయోధ్య-భద్రాద్రి ఆధ్యాత్మిక కారిడార్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఖమ్మం లోక్సభ భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
డ్రాగన్ పండు.. లాభాలు మెండు
[ 28-03-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు, విద్యాధికులు, యువ రైతులు సైతం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. -
ఆ ఇద్దరు దోచేస్తున్నారు..!
[ 28-03-2024]
‘దేశీ శిక్షణలో భాగంగా అధికారులకు రూ.10వేలు చెల్లించి తరగతులకు హాజరయ్యాను. ఒక్కరోజు గైర్హాజరైతే రూ.3వేలు వసూలు చేశారు. -
ఆక్రమణల చెరలోనే సాగర్ కాల్వలు
[ 28-03-2024]
నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మధిర బ్రాంచి కెనాల్ పరిధిలో ఉన్న ఊటుకూరు, మధిర మేజర్ కాల్వలు కబ్జాకు గురయ్యాయి. -
మద్యం మత్తులో యువకుల హల్చల్
[ 28-03-2024]
చంద్రుగొండలో మద్యం మత్తులో ఐదుగురు యువకులు పలువురిపై దాడిచేసిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. -
నిలబడలేకున్నా.. ఆసరా అందించరూ..
[ 28-03-2024]
నిరుపేద దంపతులు రెక్కల కష్టమ్మీద ముగ్గురు కుమార్తెల్లో ఇద్దరి పెళ్లిళ్లు చేశారు. ఆ కుటుంబాన్ని అనారోగ్య సమస్యలు వెంటాడాయి. -
మద్యం తాగాడని ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడి నిర్బంధం
[ 28-03-2024]
విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు మద్యం తాగి విధులకు హాజరై విద్యార్థులను కొట్టాడని పాఠశాలలో ఉంచి తాళం వేసిన ఘటన చర్ల మండలంలో చోటుచేసుకుంది. -
రామయ్య హుండీలో కాసుల గలగల..!
[ 28-03-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలోని మూడు రకాల హుండీలు కాసులతో కళకళలాడాయి. 26 రోజుల హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. జనరల్ హుండీల ద్వారా రూ.71,22,878 సమకూరింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్