రామయ్య మురిసేలా..భక్తులు మెచ్చేలా..
కాలచక్రం ప్రకారం 60 ఏళ్లకోసారి ఇక్కడ సీతారామ పట్టాభిషేకం చేస్తుంటారు. ఇది 1987లో జరిగింది. ఆతర్వాత నుంచి 12ఏళ్లకోసారి పుష్కర క్రతువు నిర్వహిస్తున్నారు. తొలుత 1999, అనంతరం 2011లో పుష్కర పట్టాభిషేకం ఉత్సవాలు జరిగాయి.
* కాలచక్రం ప్రకారం 60 ఏళ్లకోసారి ఇక్కడ సీతారామ పట్టాభిషేకం చేస్తుంటారు. ఇది 1987లో జరిగింది. ఆతర్వాత నుంచి 12ఏళ్లకోసారి పుష్కర క్రతువు నిర్వహిస్తున్నారు. తొలుత 1999, అనంతరం 2011లో పుష్కర పట్టాభిషేకం ఉత్సవాలు జరిగాయి. ముచ్చటగా మూడోసారి మార్చి 22న ఉగాది నుంచి వేడుకలు మొదలయ్యే అవకాశముంది.
* శ్రీరామనవమి సెక్టార్లో 20వేల మంది టిక్కెట్ ద్వారా, 15వేల మంది ఉచితంగా కల్యాణం వీక్షించవచ్చు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, గవర్నర్ను పిలుస్తారన్న ప్రచారం ఉన్నప్పటికీ స్పష్టత కొరవడింది. చినజీయర్స్వామి పర్యవేక్షణలో పుష్కర పట్టాభిషేకం నిర్వహించే వీలుందని భావిస్తున్నా సందిగ్ధం వీడాల్సి ఉంది.
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో మార్చి 30న కల్యాణం, 31న పట్టాభిషేకం నిర్వహించాల్సి ఉంది. ఈతేదీలు అధికారికంగా ఖరారు కాలేదు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తుల సౌకర్యార్థం సమకూర్చాల్సిన వసతులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం.
సమకూర్చాల్సిన వసతులు
* 2011లో ఆలయం వెలుపల హోమగుండాలు ఏర్పాటుచేశారు. ఈసారి వీటిని రామరథం షెడ్డు వద్ద నెలకొల్పాలని అధికారులు యోచిస్తున్నారు.
* గతంలో ఉత్సవాల సమయంలో సరైన సదుపాయాలు లేక ఇసుక తిన్నెల్లో భక్తులు బస చేశారు. రద్దీతో క్యూలైన్లలో గంటల తరబడి నిల్చోవాల్సి వచ్చింది. వేసవి కావడంతో తాగునీటి కష్టాలు ఎదురయ్యాయి. ఈ సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి.
* భారీగా వాహనాలు రావడంతో పార్కింగ్ ప్రదేశాలు చాలలేదు. ఈసారి ట్రాఫిక్ చిక్కులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
* కాటేజీలకు మరమ్మతులు చేసి అందుబాటులోకి తీసుకురావాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* బ్రహ్మోత్సవాలకు నెల ముందు నుంచే ఆన్లైన్లో ప్రచారం చేసి టిక్కెట్లను అందుబాటులో ఉంచాలి. ప్రత్యేక వెబ్సైట్ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటుచేయాలి.
* ఇప్పటికే కొన్ని సత్రాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. మిగతావి ప్రైవేట్ పరం కాకుండా చూడాలి. ఈమేరకు దేవాదాయశాఖ మంత్రి స్థాయిలో సమీక్ష జరగాలని భక్తులు కోరుతున్నారు.
* రూట్మ్యాప్ తెలియక కొత్తగా వచ్చే యాత్రికులు తికమక పడ్డారు. సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలి.
* గోదావరిలో స్నానమాచరించేందుకు వెళ్లి లోతు తెలియక కొందరు ప్రమాదాలకు గురైన సందర్భాలున్నాయి. దీనిపై ప్రచారం కల్పించాలి.
* కల్యాణం తర్వాత ముత్యాల తలంబ్రాల కోసం భక్తులు ఎగబడుతుంటారు. రద్దీని నియంత్రించాలి. పట్టాభిషేకం సెక్టార్లో ఉచిత ప్రవేశంపై ప్రచారం కల్పించాలి.
* అన్నింటికీ మించి ఉత్సవ విధుల్లో ఉండే ఉద్యోగులు భక్తులతో మర్యాదగా మెలగాలి.
ప్రచారం కల్పిస్తాం: శివాజీ, ఈవో
వీలైనంత తొందరలోనే శ్రీరామనవమి ఉత్సవ వివరాలను ప్రకటించి ప్రచారం కల్పిస్తాం. వసతి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రసాదాలను తయారుచేస్తాం. సెక్టార్ టిక్కెట్ల ధరలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రముఖులను ఆహ్వానించే విషయం దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల పరిశీలనలో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది