అన్నదాతల కంటతడి
విద్యుత్తు కోతలతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుందని రైతులు ఆనందంతో యాసంగిలో వరి సాగుకు మొగ్గుచూపారు. నాట్ల ప్రక్రియ పూర్తయ్యిందో.. లేదో విద్యుత్తు కోతలు ప్రారంభమయ్యాయి.
విద్యుత్తు కోతలతో నీరందక ఎండుతున్న పైర్లు
ఖమ్మం రోటరీనగర్, దుమ్ముగూడెం, ఇల్లెందు, చర్ల, న్యూస్టుడే
విద్యుత్తు కోతలతో పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తుందని రైతులు ఆనందంతో యాసంగిలో వరి సాగుకు మొగ్గుచూపారు. నాట్ల ప్రక్రియ పూర్తయ్యిందో.. లేదో విద్యుత్తు కోతలు ప్రారంభమయ్యాయి. పక్షం రోజులుగా సరిపడా నీరందక పైర్లు బీటలు వారుతున్నాయి. కళ్లెదుటే పైర్లు ఎండిపోతుండటంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
* ఖమ్మం జిల్లాలో 1.06లక్షలు, భద్రాద్రి కొత్తగూడెంలో 47,978 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. ఉభయ జిల్లాల్లో మంగళవారం సాయంత్రం 5గంటల సమయంలో 606 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ ఏర్పడింది. గతేడాది ఇదే సమయానికి 468మెగావాట్లు మాత్రమే ఉంది. అసాధారణంగా డిమాండ్ పెరగడంతో ఉపకేంద్రాలపై ఒత్తిడి పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
* ప్రస్తుతం వరి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు, పామాయిల్, పప్పుదినుసులు, పండ్లతోటలు సాగవుతున్నాయి. చెరువులు, కాల్వల కింద మినహా మిగిలిన ప్రాంతాల్లో వ్యవసాయ మోటార్ల వినియోగంతో విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగుతోంది.
ఇలాగైతే పంట చేతికందదు
జర్పులా రవి, విజయ దంపతులు, ధర్మాతండా, కూసుమంచి మండలం
ఉమ్మడిగా నీటిని వినియోగించుకునే బావి పరిధిలో ఎకరం విస్తీర్ణంలో వరి సాగుచేశాం. మరో అర ఎకరంలో కూరగాయలు పండిస్తున్నాం. విద్యుత్తు కోతల నేపథ్యంలో సరిపడా నీరందక వరిపైరు నిలువునా ఎండిపోతోంది. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆతర్వాత నీరందించినా పంట చేతికందదు. ఎకరం పొలం దున్నడానికి రూ.6,500, నాటు వేసేందుకు రూ.4వేలు, ఎరువుల ఖర్చు రూ.2వేలు వెరసి ఇప్పటివరకు రూ.12,500 వెచ్చించాం.
సమయపాలన పాటించట్లేదు
పేరపాక వెంకటేశ్వర్లు, చింతగుర్తి, రఘునాథపాలెం మండలం
పది రోజులుగా అధికారులు సమయపాలన పాటించకుండా ఇష్టమొచ్చినట్లు విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం రెండెకరాల్లో మిర్చి, మరో రెండెకరాల్లో పెసర పంట పండిస్తున్నాను. గంటకు మించి విద్యుత్తు సరఫరా కాకపోవటంతో తడిచిన సాళ్లే తడుస్తున్నాయి. కనీసం నాలుగు గంటల పాటు వరుసగా విద్యుత్తు సరఫరా చేయాలి.
చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయ్
లంకరాజు, రైతు, చర్ల మండలం
ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం వరకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయాలి. ప్రభుత్వం చెప్పినట్టు 24 గంటలూ సరఫరా చేస్తే బాగుంటుంది. విద్యుత్తు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పంటలు ఎండిపోతున్నాయి. మోటార్లు కాలిపోతున్నాయి. వ్యవసాయానికి ఇచ్చే విద్యుత్తు సరఫరాలో అంతరాయాన్ని తొలగించాలి.
బోరు మోటారు కాలిపోయింది
గుగులోత్ మోతీలాల్, చుక్కలబోడు, టేకులపల్లి మండలం
రెండెకరాల్లో మిర్చి పంట పండిస్తున్నాను. విద్యుత్తు కోతలు, లోవోల్టేజీ కారణంగా బోరు మోటారు కాలిపోయింది. మరమ్మతులకు రూ.8వేలు ఖర్చయ్యింది. అసలే మిర్చి దిగుబడి ఆశాజనకంగా లేదు. లోవోల్టేజీతో నీరందక మిరప పిందె సాగడం లేదు.
పగటిపూటే అందించాలి..
యలమంచి వంశీకృష్ణ, దుమ్ముగూడెం
తొలకరి వ్యవసాయం సమయంలో ఎడతెరిపిలేని వర్షాలు, గోదావరి వరదలతో తీవ్రంగా నష్టపోయాం. అనంతరం పంటలకు తామర, ఎర్రనల్లి, కత్తెర పురుగులు, వేరు కుళ్లు తెగుళ్లు సోకి సతమతమయ్యాం. ప్రస్తుతం విద్యుత్తు కోతలు, అంతరాయంతో మరింత నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. రాత్రి సమయాల్లో విద్యుత్తు సరఫరా చేసినా వ్యవసాయ కూలీలు అందుబాటులో లేక రైతులు విద్యుత్తును వినియోగించుకోలేని దుస్థితి ఏర్పడింది. రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని పగలు ఎనిమిది గంటల పాటు విద్యుత్తు సరఫరా చేయాలి.
డిమాండ్కు తగినట్టు సరఫరా
ఎ.సురేందర్, ఎస్ఈ, ఖమ్మం
జిల్లాలో డిమాండ్కు తగినట్లు విద్యుత్తు సరఫరా అవుతోంది. ఈ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నారు. వ్యవసాయ రంగానికి ఆటంకం కలగకుండా సరఫరా చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
[ 19-04-2024]
గత విద్యా సంవత్సరంలో బదిలీ పొంది రిలీవర్ లేనందున రిలీవ్ చేయని ఉపాధ్యాయులను వెంటనే వారు బదిలీ పొందిన స్థానంలో నియమించాలని తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ వీరు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. -
విజేతలకు బహుమతులు అందజేత
[ 19-04-2024]
పొన్నేల్లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!