వ్యవసాయ రంగంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత భారత ప్రభుత్వం రైతు కేంద్రంగా ఏర్పడబోతోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
మాట్లాడుతున్న మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, చిత్రంలో మంత్రి అజయ్కుమార్, ఎమ్మెల్సీలు తాతా మధు,బండ ప్రకాశ్, జడ్పీ ఛైర్మన్ కమల్రాజు, మేయర్ నీరజ తదితరులు
ఖమ్మం వ్యవసాయం: ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ నినాదంతో వచ్చే లోక్సభ ఎన్నికల తర్వాత భారత ప్రభుత్వం రైతు కేంద్రంగా ఏర్పడబోతోందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు. వ్యవసాయ రంగంలో దేశానికి తెలంగాణ మార్గదర్శిగా నిలిచిందన్నారు. కేంద్ర బడ్జెట్లో భారత పత్తి సంస్థ(సీసీఐ)కి కేవలం రూ.లక్ష కేటాయించడమంటే త్వరలోనే వీటిని రద్దు చేసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.11 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ముదిరాజ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు బండా ప్రకాశ్ మాట్లాడుతూ... ఖమ్మం ఛైర్పర్సన్ పదవి ముదిరాజ్లకు కేటాయించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజ్, ఎమ్మెల్సీ తాతా మధు, మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ ఛైర్మన్ కూరాకుల నాగభూషయ్య, సుడా ఛైర్మన్ బచ్చు విజయ్కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా, వర్తక సంఘం అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు గుండాల కృష్ణ, మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, భద్రాద్రి బ్యాంకు ఛైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ప్రమాణ స్వీకారోత్సవం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఛైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, వైస్ ఛైర్మన్ షేక్ అఫ్జల్తో పాటు పాలకవర్గ సభ్యులతో జిల్లా మార్కెటింగ్శాఖ అధికారి కె.నాగరాజు, ఉన్నతశ్రేణి కార్యదర్శి ఆర్.మల్లేశం ప్రమాణం చేయించారు. ఉదయం 11.45 గంటలకు నూతన పాలకవర్గం మార్కెట్ కమిటీ కార్యాలయంలో సంప్రదాయబద్దంగా బాధ్యతలు చేపట్టింది.
ముదిగొండ: కరోనా ప్రభావంతో రుణమాఫీకి ఆటంకం ఏర్పడిందని, వడ్డీతో సహా సర్కారే రుణమాఫీ చేస్తుందని, రైతులు ఆందోళన చెందొద్దని మంత్రి నిరంజన్రెడ్డి భరోసా ఇచ్చారు. మాదాపురంలో రైతువేదికను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులం, మతం పేరుతో ప్రజల మధ్య కొట్లాటలు పెట్టి లబ్ధి పొందాలనే క్షుద్ర రాజకీయాలు చేయటం తగదన్నారు. మాజీ ఎంపీ పొంగులేటికి ఇప్పటి వరకు కరెంటు కనిపించి ఇప్పుడు చీకటైందా? రాజకీయాల కోసం తెలంగాణ చీకటి అవుతుందా అని ప్రశ్నించారు. మంత్రి అజయ్కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ ఛైర్మన్ కమల్రాజు, కలెక్టర్ వీపీˆ గౌతమ్, విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎంపీపీ హరిప్రసాద్, జడ్పీటీసీ సభ్యురాలు దుర్గ, సర్పంచి వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్లమెంట్ ఎన్నికల్లో భారాస అత్యధిక స్థానాలు విజయం
[ 23-04-2024]
మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇల్లందుకు చేరుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారాస నాయకులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో స్వాగతం -
ఏది నిజం?.. సోషల్ మీడియాలో సమాచార వ్యాప్తిపై ఈసీఐ సూచనలివీ..
[ 23-04-2024]
ఎన్నికలోస్తే చాలు, సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా సమాచారం వచ్చిపడుతుంది. వాటిల్లో పుకార్లు ఏవి? తప్పుదోవ పట్టించేవి ఏవి? నిజమైన సమాచారం ఏదో తెలియక ఓటర్లు తికమకపడుతుంటారు. -
బరిలో నిలవాలంటే.. పరిశీలన దశ దాటాల్సిందే!
[ 23-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి అఫిడవిట్లు సమర్పించారు. -
ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ సహా జిల్లా పరిషత్లకు సూచనలందాయి. -
రైతులకు అండగా ఉంటాం: నామా
[ 23-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరికి భారాస అండగా ఉంటుందని ఆపార్టీ ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
గ్యారంటీలు నమ్మి మోసపోకండి: తాండ్ర
[ 23-04-2024]
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నమ్మి ఓటర్లు మోసపోవద్దని, దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న భాజపాను ఆదరించాలని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు పేర్కొన్నారు. -
సెలవులొచ్చాయ్.. ప్రణాళికలు ఖరారయ్యాయ్!
[ 23-04-2024]
ఈవిద్యా సంవత్సరం నేడు (మంగళవారం) ముగియనుంది. పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి సారించింది. -
పది మందిలో ఐదుగురు స్థానికేతరులే..
[ 23-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా పది మంది గెలిచారు. వీరిలో ఐదుగురు స్థానికేతరులు కావటం విశేషం. -
అకాల వర్షంతో 700 ఎకరాల్లో పంట నష్టం
[ 23-04-2024]
జిల్లాలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులతో కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి ,లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, పినపాక, కరకగూడెం మండలాల్లో సుమారు 700 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు డీఏఓ బాబురావు సోమవారం తెలిపారు. -
‘పది’ విద్యార్థులు ఫలితాలపై ఒత్తిడి చెందొద్దు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురికావొద్దని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జేవీఎల్ శిరీష సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!