వసతులు కల్పించాం.. విద్యా ప్రమాణాలు పెంపొందించాలి: కలెక్టర్
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించామని, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంపై ఉపాధ్యాయులు దృష్టిసారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు
స్టేషన్బస్తీ ఉర్దూ పాఠశాలను ప్రారంభిస్తున్న కౌన్సిలర్ మొగిలి లక్ష్మి, చిత్రంలో కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే హరిప్రియ తదితరులు
ఇల్లెందు, న్యూస్టుడే: కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించామని, విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంపై ఉపాధ్యాయులు దృష్టిసారించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమంలో భాగంగా రూ.62 లక్షలతో తీర్చిదిద్దిన ఇల్లెందులోని స్టేషనుబస్తీ ప్రభుత్వ ప్రాథమిక, ఉర్దూ ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆధ్వర్యంలో కౌన్సిలర్ మొగిలి లక్ష్మి బుధవారం ప్రారంభించారు. కలెక్టర్, ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ విద్యార్థులతో పాటు బల్లలపై కూర్చొని పాఠ్య పుస్తకాలు పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనుదీప్ మాట్లాడుతూ ఏప్రిల్లోగా జిల్లాలోని 368 పాఠశాలల్లోనూ ప్రత్యేక పనులు పూర్తిచేస్తామన్నారు. ఉపాధ్యాయులు ‘తొలిమెట్టు’ కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేసి విద్యార్థులు చదవడం, రాయడంపై పట్టుసాధించేలా బోధన కొనసాగించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పోస్టరులో స్టేషనుబస్తీ పాఠశాల చిత్రాలు ముద్రించే స్థాయిలో అధికారులు, ఉపాధ్యాయులు పనిచేశారని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆలోచనతో తల్లిదండ్రులు పాఠశాలల్లో కోరుకునే సదుపాయాలను కల్పించామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి చేరాలన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, పురపాలక ఛైర్మన్ డి.వెంకటేశ్వరరావు, వైస్ ఛైర్మన్ జానీపాషా, డీఈఓ ప్రసాద్, కౌన్సిలర్లు కొండపల్లి సరిత, ఆర్అండ్బీ ఈఈ భీమ్లా, కమిషనర్ షేక్ అంకుశ్ షావలీ, తహాసీల్దారు ఎం.కృష్ణవేణి, డీఈలు వెంకటేశ్వర్లు, రామకృష్ణ, ఎంఈఓ రాంసింగ్, హెచ్ఎంలు బుచ్చయ్య, అతియా పాల్గొన్నారు. స్థానిక సమస్యలను పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
తొలివిడతలో 30,684 ఎకరాలకు పోడు పట్టాలు
కొత్తగూడెం కలెక్టరేట్: గిరిజనులకు పోడుపట్టాల జారీకి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. పట్టాల జారీ ప్రక్రియపై జిల్లాస్థాయి అటవీ హక్కు కమిటీ (డీఎల్సీ) సభ్యులతో కలెక్టరేట్లో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ 332 పంచాయతీల్లోని 726 హ్యాబిటేషన్ల నుంచి 65,616 మంది గిరిజనులు, 17,725 మంది గిరిజనేతరుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం నివేదికలను డీఎల్సీకి పంపించినట్లు వివరించారు. తొలివిడతగా కొత్తగూడెం, భద్రాచలం డివిజన్లకు చెందిన 11,532 దరఖాస్తులకు 30,684.29 ఎకరాలకు పట్టాలు జారీ చేసేందుకు డీఎల్సీ నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను ఎంపిక జరిగిందన్నారు. ప్రక్రియ నిస్పాక్షికంగా, పారదర్శకంగా జరుగుతుందని స్పష్టం చేశారు. డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్సింగ్, అదనపు కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు స్వర్ణలత, రత్నకళ్యాణి, ఇల్లెందు ఎఫ్డీఓ నీరజ్కుమార్, ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్రాజు, డీఎల్సీ సభ్యులు ఆళ్లపల్లి, కరకగూడెం జడ్పీటీసీ సభ్యులు కె.హనుమంతరావు, కాంతారావు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
[ 19-04-2024]
గత విద్యా సంవత్సరంలో బదిలీ పొంది రిలీవర్ లేనందున రిలీవ్ చేయని ఉపాధ్యాయులను వెంటనే వారు బదిలీ పొందిన స్థానంలో నియమించాలని తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ వీరు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. -
విజేతలకు బహుమతులు అందజేత
[ 19-04-2024]
పొన్నేల్లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు