logo

కారును ఢీకొన్న లారీ

లారీ ఓ కారును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన పినపాక మండలం జానంపేట శివారులో బుధవారం చోటుచేసుకుంది.

Published : 02 Feb 2023 04:32 IST

పినపాక, న్యూస్‌టుడే: లారీ ఓ కారును ఢీకొన్న ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన పినపాక మండలం జానంపేట శివారులో బుధవారం చోటుచేసుకుంది. దమ్మపేట మండలం మల్కారం గ్రామానికి చెందిన తోట ఫణికుమార్‌ కుటుంబ సభ్యులతో కలిసి కారులో మేడారం వెళ్తున్నారు. వీరి కారుని జానంపేట గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న ఇసుక లారీ బలంగా ఢీకొంది. కారు నడుపుతున్న ఫణికుమార్‌తోపాటు ఆయన అత్త, మామ సుజాత, నాగబాబు, మరో బంధువు వెంకటలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను 108లో మణుగూరు 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ఎస్సై టీవీఆర్‌ సూరి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ దిలీప్‌ తెలిపారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని