అటవీ వీరుడి కుటుంబానికి అవమానం!
ఆయన అటవీ భూమిని పరిరక్షించడంలో తెగువ చూపారు... విధి నిర్వహణలోనే హత్యకు గురై ప్రాణాలు కోల్పోయాలు... ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఖమ్మం రోటరీనగర్, న్యూస్టుడే
ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబానికి కేటాయించిన స్థలం
ఆయన అటవీ భూమిని పరిరక్షించడంలో తెగువ చూపారు... విధి నిర్వహణలోనే హత్యకు గురై ప్రాణాలు కోల్పోయాలు... ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అంత్యక్రియల్లో పాల్గొని ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు సేవలను కొనియాడారు. సేవలకు గుర్తింపుగా రూ.50 లక్షల పరిహారం, 500 చ.గ ఇంటి స్థలం, భార్యకు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. హామీల అమలులో భాగంగా ఇచ్చిన ఇంటి స్థలానికి ఏర్పాటు చేసిన ప్రహరీని కొద్ది రోజులకే తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది మృతుని కుటుంబాన్ని అవమానించడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పరిహారం ఇలా...
శ్రీనివాసరావు కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, 500 చగ ఇంటి స్థలం, భార్య భాగ్యలక్ష్మికి ఉద్యోగావకాశం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఖమ్మం నగరంలో బుర్హాన్పురం రెవెన్యూ సర్వే నెం.93లో 500 చగ ఇంటి స్థలాన్ని కేటాయించారు. సర్వ హక్కులు కల్పించేందుకు ప్రభుత్వ ధర ప్రకారం చదరపు గజానికి రూ.9,500 చొప్పున మొత్తం రూ.47.5 లక్షలు చెల్లించాలని కోరారు. దీన్ని పింఛనులో నెలకు 39,585 చొప్పున పదేళ్లపాటు చెల్లించేందుకు శ్రీనివాసరావు కుటుంబం అంగీకరించింది. దీంతో స్థలానికి ఉత్తర్వులను ఖమ్మం జిల్లా కలెక్టరు వీపీ గౌతమ్ చేతుల మీదుగా 2023 జనవరి ఒకటిన భార్య భాగ్యలక్ష్మికి అందజేశారు. సదరు స్థలానికి గూగుల్ మ్యాప్తో సహా ఖమ్మం అర్బన్ రెవెన్యూ అధికారులు అందించారు.
ప్రహరీ తొలగింపు...
తదుపరి శ్రీనివాసరావు కుటుంబాన్ని కలెక్టరేట్కు పిలిపించి ప్రహరీ నిర్మించుకోవాలని, బోరు వేసుకుని నల్లా కనెక్షను తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు రూ.2 లక్షలు వెచ్చించి సదరు స్థలానికి రెడీమేడ్ ప్రహరీని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఉన్న నిద్రగన్నేరు చెట్టు తొలగించేందుకు ఆ కుటుంబం అటవీ శాఖకు చలానా కూడా చెల్లించింది. కానీ రెండు రోజుల్లోనే సదరు ప్రహరీని రాత్రికిరాత్రి తొలగించడం చర్చనీయాంశమైంది. వేలాది ఎకరాల అటవీ భూమిని కాపాడి ప్రభుత్వానికి విశేష సేవలందించిన మృతుడు శ్రీనివాసరావును అవమానించడమేనంటూ దీనిపై ఈర్లపూడి గ్రామస్థులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
హత్య నేపథ్యమిదీ...
పోడు సాగుకు అడ్డు వస్తున్నాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు బీట్లో 2022 నవంబరు 22న జరిగిన గొత్తికోయల దాడిలో అటవీ శాఖ ఫారెస్ట్ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు(40) మృతి చెందారు. దీనిపై ఆ శాఖ ఉద్యోగులు తీవ్ర నిరసన తెలిపాయి. ఆయన హత్యపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.
నీటి పారుదల శాఖ స్థల వివాదం న్యాయస్థానంలో ఉంది. ఎన్నెస్పీ ఉద్యోగులు ఈ స్థలం తమకే కేటాయించాలని గతంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఈ కార్యాలయం నిర్మించాలనే ప్రతిపాదన కూడా ఉంది. ఉత్తర్వులు ఇచ్చినా సదరు స్థలాన్ని శ్రీనివాసరావు కుటుంబానికి స్వాధీనం చేయలేదు. ప్రత్యామ్నాయ స్థలం అన్వేషిస్తున్నాం. త్వరలోనే కలెక్టరు చేతుల మీదుగా అందజేస్తాం.
శైలజ, తహసీల్దారు, ఖమ్మం అర్బన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏన్కూరులో హనుమాన్ శోభాయాత్ర
[ 23-04-2024]
ఏన్కూర్లో హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. వివిధ గ్రామాల భక్తులు టీఎల్ పేట రామాలయానికి చేరుకొని అక్కడ నుంచి 10 కి.మీ శోభాయాత్రతో పాటు ద్విచక్ర వాహన ప్రదర్శన నిర్వహించారు. -
భాగ్యనగర్ తండాలో బోనాల వేడుక
[ 23-04-2024]
భాగ్యనగర్ తండాలో బోనాల వేడుకను మంగళవారం వైభవంగా నిర్వహించారు. -
పార్లమెంట్ ఎన్నికల్లో భారాస అత్యధిక స్థానాలు విజయం
[ 23-04-2024]
మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత నామినేషన్ కార్యక్రమానికి వెళ్లేందుకు ఇల్లందుకు చేరుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారాస నాయకులు దిండిగల రాజేందర్ ఆధ్వర్యంలో స్వాగతం -
ఏది నిజం?.. సోషల్ మీడియాలో సమాచార వ్యాప్తిపై ఈసీఐ సూచనలివీ..
[ 23-04-2024]
ఎన్నికలోస్తే చాలు, సామాజిక మాధ్యమాల్లో కుప్పలుతెప్పలుగా సమాచారం వచ్చిపడుతుంది. వాటిల్లో పుకార్లు ఏవి? తప్పుదోవ పట్టించేవి ఏవి? నిజమైన సమాచారం ఏదో తెలియక ఓటర్లు తికమకపడుతుంటారు. -
బరిలో నిలవాలంటే.. పరిశీలన దశ దాటాల్సిందే!
[ 23-04-2024]
గుజరాత్లోని సూరత్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైంది. సదరు అభ్యర్థి నామినేషన్ పత్రాల్లోని సంతకాలు తమవి కావని ముగ్గురు ప్రతిపాదకులు రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ)కి అఫిడవిట్లు సమర్పించారు. -
ప్రాదేశిక ఎన్నికలకు రంగం సిద్ధం
[ 23-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి పంచాయతీరాజ్ కమిషనర్ సహా జిల్లా పరిషత్లకు సూచనలందాయి. -
రైతులకు అండగా ఉంటాం: నామా
[ 23-04-2024]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వీరికి భారాస అండగా ఉంటుందని ఆపార్టీ ఖమ్మం లోక్సభ స్థానం అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. -
గ్యారంటీలు నమ్మి మోసపోకండి: తాండ్ర
[ 23-04-2024]
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను నమ్మి ఓటర్లు మోసపోవద్దని, దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న భాజపాను ఆదరించాలని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు పేర్కొన్నారు. -
సెలవులొచ్చాయ్.. ప్రణాళికలు ఖరారయ్యాయ్!
[ 23-04-2024]
ఈవిద్యా సంవత్సరం నేడు (మంగళవారం) ముగియనుంది. పాఠశాలల విద్యార్థులకు ప్రభుత్వం బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి సారించింది. -
పది మందిలో ఐదుగురు స్థానికేతరులే..
[ 23-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానానికి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా పది మంది గెలిచారు. వీరిలో ఐదుగురు స్థానికేతరులు కావటం విశేషం. -
అకాల వర్షంతో 700 ఎకరాల్లో పంట నష్టం
[ 23-04-2024]
జిల్లాలో ఆదివారం సాయంత్రం వీచిన ఈదురు గాలులతో కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి ,లక్ష్మీదేవిపల్లి, ఇల్లెందు, టేకులపల్లి, అశ్వారావుపేట, పినపాక, కరకగూడెం మండలాల్లో సుమారు 700 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు డీఏఓ బాబురావు సోమవారం తెలిపారు. -
‘పది’ విద్యార్థులు ఫలితాలపై ఒత్తిడి చెందొద్దు
[ 23-04-2024]
పదో తరగతి పరీక్ష ఫలితాలు ఎలా ఉన్నా విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురికావొద్దని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా.జేవీఎల్ శిరీష సోమవారం ఒక ప్రకటనలో సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?