గంటగంటకో దుర్ఘటన
‘ఏ నిమిషానికి.. ఏమి జరుగునో ఎవరూహించెదరు?’ అని ఓ సినీకవి అన్నట్టుగా మారింది నేటి రోడ్డు ప్రమాదాల తీరు. వాహనంతో రోడ్డెక్కిన ప్రతిసారి ప్రమాదం వెన్నంటే ఉన్నట్టు లెక్క.
రోడ్డెక్కితే అప్రమత్తత తప్పనిసరి
వాహనచోదకులు నిబంధనలు పాటిస్తే మేలు
పాల్వంచ పట్టణం, న్యూస్టుడే
పాత పాల్వంచలోని బంకు వద్ద లారీని ఢీకొట్టిన ఆటో
‘ఏ నిమిషానికి.. ఏమి జరుగునో ఎవరూహించెదరు?’ అని ఓ సినీకవి అన్నట్టుగా మారింది నేటి రోడ్డు ప్రమాదాల తీరు. వాహనంతో రోడ్డెక్కిన ప్రతిసారి ప్రమాదం వెన్నంటే ఉన్నట్టు లెక్క. వాహన రద్దీ నేపథ్యంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, ఏకాగ్రత దెబ్బతిన్నా, కనురెప్ప పాటులో ఊహించని ఘటన ఎదురవుతుంది. జీవితం తలకిందులవుతుంది. అతివేగం, నిబంధనల ఉల్లంఘన, అవగాహన లేమితో రోజులో ఏదో ఒక సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. 24 గంటల వ్యవధిలో గంటగంటకూ ఏదో ఒక సంఘటన వాటిల్లుతున్నట్లు ఇటీవల విడుదలైన కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేస్తోంది. పట్టణాలు, గ్రామాలనే తేడా లేకుండా అన్ని రకాల రహదారులు నెత్తురోడుతున్నాయి. ఫలానా సమయంలో ఎవరూ ఉండరనే నిర్లక్ష్యంతో అతివేగం అందుకుంటే ప్రమాదంలో చిక్కినట్టేనని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు.
రహదారిని బట్టే వేగం అవసరం
* వేగ నియంత్రణ అన్నిటికంటే ముఖ్యమైందని ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ద్విచక్రవాహనాలు స్థానిక రోడ్లపై గరిష్ఠంగా 40 కి.మీ., రాష్ట్ర రహదారులపై 60 కి.మీ., హైవేలపై 80 కి.మీ. వేగం దాటొద్దు. విశాల హైవేలైతే వాహన సామర్థ్యాన్ని బట్టి వంద కి.మీ. వేగం అందుకోవచ్చు.
* మోటారు వాహన చట్టం, సెక్షన్ 129 ప్రకారం వెనుక కూర్చున్న వారూ శిరస్త్రాణం ధరించాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 65 శాతం ప్రమాదాలు ద్విచక్రవాహనాల కారణంగానే సంభవిస్తున్నాయి. ప్రమాద మృతుల్లో సుమారు 70 శాతం మంది తలకు గాయాలైనవారే. హెల్మెట్ ధరించక ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడుస్తున్నారు.
* స్థానిక రహదారులపై కార్లలో వెళ్లేవారు కొందరు సీటు బెల్టు పెట్టుకోవడం లేదు. తక్కువ వేగమే కదాని అశ్రద్ధ చేస్తున్నారు. కానీ ఎదురుగా వచ్చే వాహనం గంటకు వంద కి.మీ. వేగంతో ఢీకొనడంతో ప్రమాద తీవ్రత పెరుగుతోంది.
* గ్రామీణ రహదారుల్లో, ముఖ్యంగా మలుపుల్లో అదుపులో లేని వేగం కారు ప్రమాదాలకు కారణమవుతోంది. బావులు, వాగుల్లో దూసుకెళ్తుండటంతో ప్రాణనష్టం సంభవిస్తోంది.
* సెల్ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాల సంఖ్య ఏటా పెరుగుతోంది. సీటు బెల్టు, శిరస్త్రాణం ధరించకుండా వాహనం నడపటమూ ఓ కారణవుతోంది. కార్లలో ఎల్ఈడీ తెరలు కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.
* సరకు రవాణా వాహనాల విషయంలో డ్రైవర్లు విశ్రాంతి లేకుండా నడపడం చేటు చేస్తోంది. గమ్యస్థానానికి వెళ్లాలన్న ఆత్రుత, నిద్రమత్తుతో రాష్ట్ర, జాతీయ రహదారులు నెత్తురోడేలా చేస్తున్నాయి. చోదకులు విశ్రాంతి తీసుకునేలా అధికారులు అవగాహన కల్పించాలి.
* టీ తాగేందుకో, కాలకృత్యాలు తీర్చుకునేందుకు కాసేపే కదా అని రోడ్డు అంచుల్లో భారీ వాహనాలు నిలిపేస్తుండటంతో రాత్రి పూట వెనుక నుంచి ఢీకొంటున్నారు. హైవే సిబ్బంది, గస్తీ బృందాలు ఇలాంటి సందర్భాల్లో అప్రమత్తం చేయాలి.
* అతివేగానికి మద్యం మత్తు తోడవుతోంది. తనిఖీలతో డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదాలను నివారించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బదిలీ పొందిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి
[ 19-04-2024]
గత విద్యా సంవత్సరంలో బదిలీ పొంది రిలీవర్ లేనందున రిలీవ్ చేయని ఉపాధ్యాయులను వెంటనే వారు బదిలీ పొందిన స్థానంలో నియమించాలని తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భానోత్ వీరు నాయక్ ప్రభుత్వాన్ని కోరారు. -
విజేతలకు బహుమతులు అందజేత
[ 19-04-2024]
పొన్నేల్లో బోడేపూడి ట్రస్ట్ ద్వారా మండల స్థాయి క్రికెట్ పోటీలు అంబేద్కర్ యువ మండలి ఆధ్వర్యంలో నిర్వహించారు. -
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు