బాబోయ్.. భయోమెట్రిక్
బోధన, బోధనేతర సిబ్బంది సమయపాలన పాటించేందుకు ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాటుచేసిన బయోమెట్రిక్ పరికరాలు మొరాయిస్తున్నాయి.
మొరాయిస్తున్న పరికరాలు
ఖమ్మం విద్యావిభాగం, న్యూస్టుడే
కారేపల్లి కళాశాలలో హాజరు కోసం బారులు తీరిన ఉద్యోగులు
బోధన, బోధనేతర సిబ్బంది సమయపాలన పాటించేందుకు ప్రభుత్వ కళాశాలల్లో ఏర్పాటుచేసిన బయోమెట్రిక్ పరికరాలు మొరాయిస్తున్నాయి. కళాశాలకు సకాలంలో చేరుకున్నా బయోమెట్రిక్ యంత్రాలు మొరాయిస్తుండటంతో 15 నిమిషాల గ్రేస్ టైం ముగిసిపోతుందని, ఆతర్వాత వేలిముద్రలు వేసినా గైర్హాజరైనట్టే చూపుతుందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాజరు వేయాలంటూ మళ్లీ లేఖలు రాయాల్సి వస్తోందని చెబుతున్నారు.
ఫిబ్రవరి 1 నుంచి అమలు..
2014 వరకు ఆయా కళాశాలల్లో వసూలు చేసిన రుసుముల్లో మిగిలిన మొత్తాలను ఇంటర్ బోర్డు డిపాజిట్ చేయించుకుంది. ఆ డబ్బుల నుంచి ఒక్కో కళాశాలకు నాలుగు సీసీ కెమెరాలు, రెండు బయోమెట్రిక్ యంత్రాల చొప్పున నాటి బోర్డు కార్యదర్శి టెండర్లు పిలిచి కొన్నారు. ఆ తర్వాత సరఫరా చేశారు. ఆరు నెలలు కాగానే మంత్రమేసినట్లు యంత్రాలు పనిచేయటం మానేశాయి. సుమారు రూ.4కోట్ల వరకు వృథా అయినట్లు సమాచారం. ఆపై కొవిడ్ పేరిట బయోమెట్రిక్ పరికరాలను పక్కన పెట్టారు. ఇటీవల విధుల్లో చేరిన కొత్త కార్యదర్శి ఇంటర్ బోర్డు నిధుల నుంచి బయోమెట్రిక్ యంత్రాలు కొని 405 కళాశాలలతో పాటు 33 జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయాలకు సరఫరా చేశారు. ఈఏడాది ఫిబ్రవరి 1 నుంచి వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు.
సాంకేతిక సమస్యలతో సతమతం
ఒక్కో కళాశాలలో అటెండరు నుంచి ప్రిన్సిపల్ వరకు 30 నుంచి 60 మంది ఉద్యోగులున్నారు. ఓ కంపెనీ సిమ్ కార్డు సాయంతో యంత్రాలు పనిచేస్తాయి. సిగ్నళ్లు సరిగ్గా లేని ప్రాంతాల్లో ఒక్కొక్కరు వేలిముద్రలు వేయాలంటే మూడు నుంచి నాలుగు నిమిషాల సమయం పడుతోంది. సిబ్బంది అందరూ తమ హాజరు నమోదు చేసుకోవటానికి సుమారు గంట నుంచి 2 గంటల వరకు సమయం పడుతోంది. యంత్రాలను ఆహ్వానించినా, సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ అనుసంధాన బయోమెట్రిక్ హాజరు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది.
జాగ్రత్తలు తీసుకోవాలి
కె.రవిబాబు, డీఐఈఓ, ఖమ్మం
సిరిపురం కళాశాలలో చిన్న సమస్య ఉంటే పరిష్కరించాం. వేలిముద్రలు సరిగ్గా రాకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈసమస్యను అధిగమించవచ్చు. ఇంతవరకు ఎక్కడి నుంచి ఫిర్యాదులు రాలేదు. సమస్య ఉత్పన్నమైతే సాంకేతిక సహాయకుడిని పంపించి పరిష్కరిస్తాం. బయోమెట్రిక్ విధానం వల్ల ఉద్యోగులు సకాలంలో కళాశాలలకు హాజరవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన భారాస ఎంపీ అభ్యర్థి నామా
[ 24-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. -
ఓటుకు పోటెత్తేలా
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2019లో జరిగిన సార్వత్రిక సమరంలో పోలింగ్ శాతం తక్కువ నమోదవటంపై కారణాలు అన్వేషించింది. -
అయిదో రోజూ నామినేషన్ల సందడి
[ 24-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు. -
ప్రచార తీరు.. మారింది గురూ..!
[ 24-04-2024]
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఊరూరా ర్యాలీలు, మైకుల హోరుతో ప్రచారం జోరుగా సాగేది. శాసనసభ, లోక్సభ స్థానాల బరిలో నిలిచిన అభ్యర్థులు కనీసం ఒక్కసారైనా ప్రతి గ్రామాన్ని చుట్టేసి వచ్చేవారు. -
అడుగడుగునా అడ్డంకులే..
[ 24-04-2024]
సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. -
భద్రాచలం నుంచి తొలి మంత్రి కమలకుమారి
[ 24-04-2024]
ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కర్రెద్దుల కమలకుమారి భద్రాచలం ఎంపీగా నెగ్గి కేంద్రంలో సహాయ మంత్రిగా ఉండి మన్యానికి సేవలు అందించారు. -
పడిపోతున్న ఎండు మిరప ధరలు
[ 24-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎండు మిరప ధరలు పడిపోతున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
దేశ యవనికపై అశ్వారావుపేట పూర్వ విద్యార్థులు సత్తా
[ 24-04-2024]
దేశ యవనికపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపికలో ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. -
కోల్ ప్లాంట్ కింగ్
[ 24-04-2024]
కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్ ప్లాంట్లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు. -
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల పనులపై కలెక్టర్ సమీక్ష
[ 24-04-2024]
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనుల పూర్తి బాధ్యత హెచ్ఎంలదే అని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్ నుంచి హెచ్ఎంలతో వీడియోకాన్ఫరెన్స్లో మంగళవారం మాట్లాడారు. -
అన్నీ బాగుంటేనే అనుమతులు
[ 24-04-2024]
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈనెల 19 నుంచి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
నాలుగో రోజూ లాభాల్లో.. 22,400 ఎగువన నిఫ్టీ
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి