ఖమ్మం మదిలో కళా తపస్వి
తెలుగు చలనచిత్ర దర్శక దిగ్గజం, కళా తపస్వి కె.విశ్వనాథ్కు పూర్వ ఖమ్మం జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఖమ్మం నగరానికి ఆయన మూడుసార్లు వచ్చారు.
పలుమార్లు ఘన సత్కారం అందుకున్న కె.విశ్వనాథ్
ఖమ్మం సాంస్కృతికం, న్యూస్టుడే
2018లో భక్తరామదాసు కళాక్షేత్రంలో విశ్వనాథ్కు సన్మానం
తెలుగు చలనచిత్ర దర్శక దిగ్గజం, కళా తపస్వి కె.విశ్వనాథ్కు పూర్వ ఖమ్మం జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఖమ్మం నగరానికి ఆయన మూడుసార్లు వచ్చారు.
బీ తొలిసారి 2002, మార్చిలో ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో చిల్ట్రన్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నాటి సొసైటీ అధ్యక్షుడు బెల్లంకొండ బాబాజీ, సలహాదారు వనం కృష్ణవేణి, ప్రస్తుత ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, సినీ, టెలివిజన్ రంగ కళాకారుడు జేఎల్.శ్రీనివాస్, సినీ నటుడు శ్రీనివాస్రెడ్డి, నాటి ఎస్పీ శ్రీనివాస్ శాలువా జ్ఞాపికలందజేసి సత్కారం చేశారు.
* 2016లో ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన విశ్వనాథ్ రెండు రోజులపాటు బస చేశారు. బ్రహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయణ్ని సన్మానించారు.
* దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన తర్వాత 2018, మార్చిలో మరోసారి నగరానికి వచ్చారు. భక్తరామదాసు కళాక్షేత్రంలో ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో స్వర్ణ కంకణాన్ని బహూకరించారు.
ఖమ్మం బుర్హాన్పురం, సాంస్కృతికం, న్యూస్టుడే: కళాతపస్వి కె.విశ్వనాథ్ మృతిపై మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.
* విశ్వనాథ్ మృతికి ఖమ్మం కళాపరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు వీవీ.అప్పారావు, నాగబత్తిని రవి, రచయిత అట్లూరి వెంకటరమణ, శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవాలయం అధ్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, పర్యావరణవేత్త కడవెండి వేణుగోపాల్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఎందరికో స్ఫూర్తి
* కూచిపూడి నృత్య కళాకారిణి ఏలూరి మీనా చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మొదటి బహుమతి సాధించి విశ్వనాథ్ చేతుల మీదుగా బహుమతి అందుకున్నారు. విజయవాడ లయోలా కళాశాలలోనూ ఆయన చేతుల మీదుగా బహుమతి అందుకోవటం విశేషం.
* నగరానికి చెందిన విశ్రాంత అర్థశాస్త్ర ఆచార్యురాలు కాల్వల పద్మజ 2022, డిసెంబరులో తాను రాసిన పుస్తకంతోపాటు జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
‘‘తెలుగు సినీ చరిత్రను సంగీత ప్రధాన చిత్రాల వైపు మళ్లించిన వ్యక్తి విశ్వనాథ్. దేశం ఉన్నంతవరకు భారతం రాసిన వ్యాసుణ్ని ఎలా తలుచుకుంటామో.. తెలుగు సినిమా ఉన్నంతకాలం కళామతల్లి కంఠాభరణమైన శంకరాభరణం చిత్రకర్త గుర్తుండిపోతారు. సంగీత సాహిత్యానికి పెద్దపీట వేసిన ఆయన చిత్రాలు, పాటలు, మాటలు కొత్తతరం దర్శకులకు మార్గదర్శకాలు.’’
కమల్, వర్ధమాన రచయిత.
మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు
విశ్వనాథ్తో వర్ధమాన దర్శకుడు మాదల వేణు
మధిర పట్టణం, న్యూస్టుడే: మాటూరుపేట రామాలయ కల్యాణ వేడుక కోసం నాలుగేళ్ల క్రితం గ్రామవాసి, వర్ధమాన సినీ దర్శకుడు మాదల వేణు పదిగ్రాముల బంగారు మంగళసూత్రాన్ని బహూకరించారు. తొలుత ఆ సూత్రానికి దర్శక దిగ్గజం డా.కె.విశ్వనాథ్ చేతుల మీదుగా హైదరాబాద్లోని ఆయన నివాసంలో ప్రత్యేకంగా పూజ చేయించారు. సీతావలోకనం సినిమా హీరోయిన్ మధుశాలినీతో పాటు మాదల వేణు, సినీ నిర్మాత నెక్కంటి ప్రియాంక ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు.
భద్రాచలంతో బంధం
భద్రాచలంలో దర్శక దిగ్గజంతో అల్లం
భద్రాచలం, న్యూస్టుడే: కె.విశ్వనాథ్ దాదాపు రెండు దశాబ్దాల క్రితం సతీ సమేతంగా భద్రాచలం వచ్చారు. భద్రాద్రి కళాభారతి నిర్వాహకులు అల్లం నాగేశ్వరరావు ఆయనకు సన్మానం చేశారు. ఆ రోజున కె.విశ్వనాథ్ చేసిన ప్రసంగం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
* 2005లో సాయికుమార్ హీరోగా నటించిన శ్లోకం చిత్రంలో విశ్వనాథ్ కీలక పాత్ర పోషించారు. భద్రాచలం- బూర్గంపాడు మండలాల్లో దీన్ని చిత్రీకరించారు. గోదావరి వద్ద ప్రత్యేక కుటీరాన్ని సెట్గా ఏర్పాటు చేసి ముఖ్య ఘట్టాలను తెరకెక్కించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాటి చెట్టు పైనుంచి పడి కల్లుగీత కార్మికుడి మృతి
[ 19-04-2024]
ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి కల్లుగీత కార్మికుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
జగాలను ఏలిన రామయ్యకు పట్టాభిషేకం
[ 19-04-2024]
ధర్మమే ఆకారం దాల్చిన రామావతారుడు భద్రగిరిలో కొలువై ఉండగా తక్కువేమి మనకు అంటూ కోలాటాలు ఆడారు. -
తొలిరోజు ఖమ్మంలో ఒకటే నామినేషన్
[ 19-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో తొలిరోజు గురువారం ఒక నామపత్రం దాఖలైంది. అలయెన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఆదార్) పార్టీ తరఫున ముదిగొండ మండలం గంధసిరికి చెందిన కుక్కల నాగయ్య ఒక సెట్ నామపత్రాలను ఆర్ఓ గౌతమ్కు అందజేశారు -
ఏ పత్రం.. ఏం చెబుతుందంటే..?
[ 19-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రకటన గురువారం వెలువడింది. ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఫాం-1 ద్వారా ఆయా స్థానాల్లో నోటీసు జారీ చేశారు. అభ్యర్థుల నుంచి నామినేషన్లను గురువారం నుంచే స్వీకరిస్తున్నారు. -
అడుగంటిన జలం.. అపర భగీరథ ప్రయత్నం
[ 19-04-2024]
అడుగంటిన భూగర్భజలాలు అన్నదాతలను అతలాకుతలం చేస్తున్నాయి. తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో కొందరు రైతులు పామాయిల్ సాగు చేశారు. -
18లో మేలుకొలుపు ప్రజాస్వామ్య గెలుపు
[ 19-04-2024]
ప్రజాస్వామ్య ఎన్నికల్లో యువ ఓటర్ల చైతన్యమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం వినూత్న ప్రయోగాలు చేస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో కొత్తగా చేపట్టే కార్యక్రమం.. ‘టర్నింగ్-18’. అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నిక ప్రక్రియలో ఏ ఒక్కఓటరూ వెనకబడకుండా చూడటమే అంతిమ లక్ష్యం. -
బేతుపల్లి అంకమ్మతల్లి తిరునాళ్లకు ఏర్పాట్లు పూర్తి
[ 19-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బేతుపల్లి అంకమ్మ తల్లి తిరునాళ్ల ఏర్పాట్లు పూర్తయ్యాయి. అమ్మవారిని ఊరేగించే రథాలను సిద్ధం చేశారు. -
ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 19-04-2024]
జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో క్రోధి నామ సంవత్సర వసంత నవరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం ముగిశాయి. స్వామి వారికి ప్రాతఃకాల అర్చనల అనంతరం యజ్ఞశాలలో మహా పూర్ణాహుతి నిర్వహించారు -
సోనియా రుణం తీర్చుకోవాలి: మంత్రి తుమ్మల
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీ అగ్రనేత సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు -
గుళికల మందు మింగి బలవన్మరణం
[ 19-04-2024]
గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్కానిస్టేబుల్ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి దుర్మరణం
[ 19-04-2024]
రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన జూలూరుపాడు మండలం సాయిరాంతండా వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది
తాజా వార్తలు (Latest News)
-
హిందూపురంలో నామినేషన్ వేసిన నందమూరి బాలకృష్ణ
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి