logo

సిలిండర్‌ పేలి కార్మికుడి దుర్మరణం

పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆర్జీ-3 ఓసీపీ-2 సీహెచ్‌పీ (కోల్‌ హాండ్లింగ్‌ పాయింట్‌) వద్ద శనివారం ఉదయం ఫైర్‌ సిలిండర్‌ పేలిన ప్రమాదంలో వెల్డర్‌ ట్రైనీ బట్టి జైనథ్‌కుమార్‌ (28) దుర్మరణం చెందాడు.

Published : 05 Feb 2023 01:59 IST

యైటింక్లైన్‌కాలనీ, న్యూస్‌టుడే: పెద్దపల్లి జిల్లా సింగరేణి ఆర్జీ-3 ఓసీపీ-2 సీహెచ్‌పీ (కోల్‌ హాండ్లింగ్‌ పాయింట్‌) వద్ద శనివారం ఉదయం ఫైర్‌ సిలిండర్‌ పేలిన ప్రమాదంలో వెల్డర్‌ ట్రైనీ బట్టి జైనథ్‌కుమార్‌ (28) దుర్మరణం చెందాడు. ఓసీపీ-1 సీహెచ్‌పీ వద్ద వెల్డింగ్‌ విధులు నిర్వహించే జైనథ్‌కుమార్‌ పని ముగించుకుని వెళ్తున్న సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న ఫైర్‌ సిలిండర్‌ పేలి ఆయన మెడ భాగంలో తగలడంతో అక్కడే పడిపోయాడు. తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్‌కు చెందిన జైనథ్‌కుమార్‌కు భార్య, కుమారుడున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని