బ్యాంకు ఖాతాలోంచి డబ్బులు మాయం
బ్యాంకు ఖాతాలోంచి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు మాయం చేసిన ఘటనపై ఖమ్మం గ్రామీణ ఠాణాలో శనివారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఖమ్మం గ్రామీణం, న్యూస్టుడే: బ్యాంకు ఖాతాలోంచి గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు మాయం చేసిన ఘటనపై ఖమ్మం గ్రామీణ ఠాణాలో శనివారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొన్నెకల్లుకు చెందిన సింధు ఫోన్కి ఈనెల 2న బ్యాంకు ఖాతా హోల్డ్లో ఉందని మెసేజ్ వచ్చింది. దాంతో పాటు బ్యాంకుకు సంబంధించిన ఓ వెబ్సైట్ లింకు మెసేజ్ రూపంలో వచ్చింది. ఆ లింకు ఓపెన్చేసి అందులో ఉన్న వివరాలను పూర్తి చేస్తుండగా మెసేజ్ వచ్చిన ఓటీపీ నంబర్ను నమోదు చేయగానే బ్యాంకు ఖాతా నుంచి రూ.2,03,103 మాయమయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్ఐ వెంకటకృష్ణ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.