చదువులమ్మ చెట్టు నీడలో.. జ్ఞాపకాల దొంతరలు
ఆరు దశాబ్దాల నుంచి విద్యనభ్యసించిన వారంతా చదువులమ్మ చెట్టు నీడలో చేరాయి. జ్ఞాపకాల దొంతరలు వారిని కమ్మివేశాయి. తరగతి గదుల్లో నేర్చుకున్న విజ్ఞాన సౌరభాలు మరోమారు సుగంధాలు వెదజల్లాయి.
ప్రిన్సిపల్ రాజశేఖర్రెడ్డికి రూ.లక్ష అందజేస్తున్న ‘1989’ బ్యాచ్ విద్యార్థులు
కొత్తగూడెం విద్యావిభాగం, న్యూస్టుడే: ఆరు దశాబ్దాల నుంచి విద్యనభ్యసించిన వారంతా చదువులమ్మ చెట్టు నీడలో చేరాయి. జ్ఞాపకాల దొంతరలు వారిని కమ్మివేశాయి. తరగతి గదుల్లో నేర్చుకున్న విజ్ఞాన సౌరభాలు మరోమారు సుగంధాలు వెదజల్లాయి. కలిసి ఆడుకున్న దృశ్యాలు కళ్లెదుటే పరుగెత్తాయి. గురువులతో పెనవేసుకున్న ఆనాటి అనుబంధాలు హత్తుకుపోయాయి. మొత్తానికి.. వొడవని ముచ్చట్లతో ఆ విద్యాలయం రోజంతా పులకించిపోయింది. కొత్తగూడెం రుద్రంపూర్లోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో వజ్రోత్సవాలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రెండ్రోజుల వేడుకలో భాగంగా తొలిరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. దేశ విదేశాల్లో స్థిరపడిన వారితోపాటు తెలుగు రాష్ట్రాల నుంచి ‘1963-2022’ బ్యాచ్ల పూర్వ విద్యార్థులు వెయ్యి మందికి పైగా తరలిరావడం విశేషం. అందరూ కుటుంబ సమేతంగా రావడంతో సందడి నెలకొంది. బ్యాచ్ల వారీగా పూర్వ విద్యార్థులంతా ఒకచోట చేరి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు. వేడుక జ్ఞాపకాలను సెల్ఫీల్లో బంధించుకున్నారు. అలనాటి గురువులకు జ్ఞాపికలు అందజేసి ఘన సత్కారాలు చేశారు. ఉన్నత స్థానాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి వితరణలు ప్రకటించారు. ప్రిన్సిపల్ రాజశేఖర్రెడ్డికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. నేడు వార్షికోత్సవానికి కలెక్టర్ అనుదీప్తో పాటు సింగరేణి ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.
వేడుకకు హాజరైన పూర్వ విద్యార్థులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
‘ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్దే గెలుపు’
[ 26-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు తథ్యమని.. ఆధిక్యం ఎంతన్నదే తేలాల్సి ఉందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. -
హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం: తాండ్ర
[ 26-04-2024]
శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఖమ్మం లోక్సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
తప్పుడు కేసులతో వేధిస్తే వదిలిపెట్టం: నామా
[ 26-04-2024]
భారాస నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధిస్తే ఊరుకోబోమని ఖమ్మం లోక్సభ స్థానం భారాస అభ్యర్థి, ఎంపీ నామా నాగేశ్వరరావు హెచ్చరించారు. -
చట్టాలు, నిబంధనలపై అవగాహన తప్పనిసరి: సీపీ
[ 26-04-2024]
చట్టాలు, నిబంధనలపై పోలీసు సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని సీపీ సునీల్దత్ అన్నారు. ఖమ్మం సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో తర్ఫీదు పొందుతున్న సివిల్ స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల .... -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మోగిన నగారా
[ 26-04-2024]
-
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం జిల్లాలోని ప్రైవేటు కళాశాలలు సత్తాచాటాయి. బుధవారం రాత్రి విడుదల చేసిన ఫలితాల్లో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించినట్టు ఆయా కళాశాలల యాజమాన్యాలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపాయి. -
అనుబంధాలు తెగిపాయె.. ఆనందాలు ఆవిరాయె
[ 26-04-2024]
తల్లిదండ్రులతో పాటు నానమ్మ, తాత.. నలుగురు ఒకేసారి మరణిస్తే ఆ కుటుంబానికి ఉండే బాధ మాటల్లో చెప్పలేం. చిన్నారులు కౌశిక్, కార్తీక్ ఇద్దరి వయస్సు ఆరేళ్లలోపే. -
బాలింత మృతి..
[ 26-04-2024]
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్)లో బాలింత మృతిచెందిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
[ 26-04-2024]
పెద్దమ్మతల్లికి గురువారం 108 రకాల పుష్పాలతో అర్చకులు వైభవంగా అర్చన నిర్వహించారు. తొలుత అమ్మవారికి హారతి, మంత్రపుష్పం, నివేదన తదితర ప్రత్యేక పూజలు జరిపించారు. -
జూనియర్ సివిల్ జడ్జిల బదిలీ
[ 26-04-2024]
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు బదిలీ అయ్యారు. ఖమ్మం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.గోపికా నాగశ్రావ్య ఎల్.బి.నగర్ కోర్టుకు బదిలీ అయ్యారు. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక సమరంలో తొలి అంకమైన నామినేషన్ల ఘట్టం గురువారం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు అధిక సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు. -
పంచాయతీ కార్యాలయాలు ఖాళీ చేయాలని కలెక్టర్ ఆదేశం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో పంచాయతీ కార్యాలయాలు కొనసాగు తున్నాయని, వాటిని ఖాళీచేయాలని కలెక్టర్ గౌతమ్ అధికారులను గురువారం ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని