దరఖాస్తుల విచారణ ప్రక్రియ వేగవంతం: కలెక్టర్
జీవో నంబర్ 58, 59 కింద ప్రజల నుంచి అందిన దరఖాస్తులు విచారించి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు.
ఖమ్మం నగరం: జీవో నంబర్ 58, 59 కింద ప్రజల నుంచి అందిన దరఖాస్తులు విచారించి పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐడీఓసీ భవనంలో తహసీల్దార్లు, ఆర్ఐలతో కలెక్టర్ సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణ దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా అతి తక్కువ ధర నిర్ణయించి, రుసుం చెల్లించిన వారికి పట్టాలు అందిస్తారనే విషయాన్ని దరఖాస్తుదారులకు వివరించాలని సూచించారు. అదనపు కలెక్టర్ మధుసూదన్, శిక్షణ కలెక్టర్ రాధిక గుప్త, డీఆర్వో శిరీష, ఆర్డీవోలు రవీంద్రనాథ్, సూర్యనారాయణ పాల్గొన్నారు.
ఖమ్మం నగరం: ఖమ్మంలోని ఐడీవోసీ భవనంలో కలెక్టర్తో జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్రాజు భేటీ అయ్యారు. మధిర నియోజకవర్గంలో నెలకొన్న పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. అర్హులకు పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేయాలని కోరారు. కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఖమ్మం నగరం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన దోరేపల్లి శ్వేత కలెక్టర్ గౌతమ్ను శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చూచువారలకు చూడ ముచ్చట..
[ 18-04-2024]
కల్యాణ బొట్టు పెట్టి.. మణిబాసికం నుదుట కట్టి.. పారాణిని పాదాలకు పెట్టిన సీతమ్మను చూసిన భక్తజనం తరించింది. కురులను దువ్వి సొంపుగా నామం తీర్చి చెంపపై చుక్కతో రాముడు ప్రత్యక్షమవటంతో భక్తులు సాష్టాంగపడ్డారు. -
నేటి నుంచి నామినేషన్ల ఘట్టం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల క్రతువులో అత్యంత కీలకమైన నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారం మొదలుకానుంది. మే 13న జరిగే పోలింగ్ నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. -
శోకసంద్రంలో ముంచొద్దు..!
[ 18-04-2024]
వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు యువత, చిన్నారులు ఈతకెళ్తుంటారు. వీరిలో ఎక్కువమంది వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు చెరువులు, వాగులు, కుంటల్లో సైతం జలకాలాడుతున్నారు. -
నేడు సీతారాముల పట్టాభిషేకం
[ 18-04-2024]
శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం మహాపట్టాభిషేకం జరగనుంది. తెల్లవారుజామున 4 గంటలకు ఆలయం తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. -
దర్గాలో దశరథ తనయుని కల్యాణం
[ 18-04-2024]
భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణ సత్యనారాయణపురం సమీపంలోని హజరత్ నాగుల్మీరా మౌలాచాన్ దర్గా షరీఫ్లో అర్చకుల వేదమంత్రాల నడుమ బుధవారం శ్రీరామ నవమి వేడుక కనుల పండువగా సాగింది. -
అందుబాటులో ‘అయోధ్య’ తపాలా బిళ్లలు
[ 18-04-2024]
అయోధ్య రామ జన్మభూమికి సంబంధించిన తపాలా బిళ్లలు ఖమ్మం స్టేషన్ రోడ్డులోని ప్రధాన తపాలా కార్యాలయంలో అందుబాటులోకి వచ్చాయి. రామ మందిరానికి చెందిన ఆరు ప్రముఖ చిత్రాలతో ఆరు తపాలా బిళ్లలు ఉన్నాయి. -
తొట్టెలపాడు..
[ 18-04-2024]
మండే ఎండలకు చెరువులు, బావులు, ఇతర జలాశయాలు ఎండిపోతున్నాయి. వేసవిలో పక్షులు, ఇతర మూగజీవాలు నీరు దొరక్క దాహార్తితో అల్లాడుతున్నాయి. -
వయసు మూడు.. ఈత చూడు!
[ 18-04-2024]
ఖమ్మం నగరంలోని పటేల్ స్టేడియం ఈత కొలనుల్లో 5 ఏళ్ల లోపు వారికోసం ప్రత్యేకమైన మినీపాండ్ ఉంది. కేవలం వేసవిలో మాత్రమే ఈ మినీపాండ్ అందుబాటులో ఉంటుంది. అడుగు లోతు ఉంటుంది. -
ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి వ్యక్తి మృతి
[ 18-04-2024]
పండుగ పూట విషాదం నెలకొంది. ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో జారి పడి మృతి చెందిన ఘటన బుధవారం సత్తుపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... -
అత్తమామలు వేధిస్తున్నారని ఆందోళన
[ 18-04-2024]
భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనను అత్తింటివారు వేధిస్తూ, చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ రచన అనే మహిళ బోనకల్లులోని తన మామ ఇంటి ఎదుట బుధవారం ఆందోళనకు దిగింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,268