దొంగ హల్సెల్..
ఖరీదైన సెల్ఫోన్ తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరవుతున్నారా..? లేదా సభలకు వెళ్తున్నారా..? కాస్త ఆలోచించుకోండి.. మీ సెల్ఫోన్ ఎప్పుడైనా మాయం కావొచ్చు.
ఖరీదైన సెల్ఫోన్ తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలకు హాజరవుతున్నారా..? లేదా సభలకు వెళ్తున్నారా..? కాస్త ఆలోచించుకోండి.. మీ సెల్ఫోన్ ఎప్పుడైనా మాయం కావొచ్చు.
సభలో అభిమాన నాయకుడు ప్రసంగిస్తున్నాడనో.. శుభకార్యాల్లో అలంకరణలు బాగున్నాయని తదేకంగా చూస్తూ ఉండిపోయారో.. జేబులోని సెల్ఫోన్ అపహరణకు గురికావొచ్చు.
రూ.50వేలు అంతకుమించి విలువ చేసే సెల్ఫోన్ అయినా రూ.5వేలు, రూ.3వేలకు ఇతరులకు అమ్మేస్తాడు. కుదిరితే రూ.2వేలకే ఇచ్చేస్తాడు. ఈ ఘరానాదొంగ తస్కరించిన సెల్ఫోన్లనే అతడి స్వగ్రామంలో 60 శాతం మంది వినియోగిస్తుండటం గమనార్హం.
చూడటానికి అమాయకుడిలా కనిపిస్తాడు.. ఆలయాలు, శుభకార్యాలు, సభలకు హాజరయ్యేవారిని లక్ష్యంగా చేసుకుంటాడు.
మాటల్లో మునిగిన వ్యక్తుల జేబుల్లోంచి సెల్ఫోన్లను చాకచక్యంగా తస్కరిస్తూ సెకన్ల వ్యవధిలో జారుకుంటాడు.. వెంటనే వాటిలోంచి సిమ్లను మాయం చేస్తాడు.. కొన్ని గంటల వ్యవధిలోనే ఫోన్లను విక్రయించి మద్యం తాగి తిరుగుతుంటాడు.. ఎవరైనా అనుమానం వచ్చి ప్రశ్నిస్తే నోటికొచ్చినట్లు దుర్భాషలాడతాడు.. పది రోజుల వ్యవధిలో మధిర నియోజకవర్గంలో ఖరీదైన పది సెల్ఫోన్లు కాజేశాడు వైరా మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి. ఇదే గ్రామంలో పేరుగాంచిన ఓ గుట్కా వ్యాపారి అతడికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
జనవరి 27న మధిరలోని చెరుకుమల్లి వారి వీధిలో రాధాకృష్ణుల విగ్రహాల ప్రతిష్ఠాపనోత్సవాలు జరిగాయి. ఇద్దరి భక్తుల సెల్ఫోన్లను చోరీ చేసి అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడు. పోగొట్టుకున్న ఫోన్ ఎక్కడ ఉందో సాంకేతికత సహాయంతో ఓ యువకుడు ట్రాక్ చేస్తూ వెంబడించారు. తీరా ఘరానాదొంగ ఇంటికి చేరుకున్నారు. తస్కరించిన సెల్ఫోన్ను ఇవ్వాలని వేడుకున్నారు. మద్యం మత్తులో ఉన్న దొంగ నానా దుర్భాషలాడాడు. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అక్కడికి వచ్చి రూ.5వేలు ఇస్తానని, ఫోన్ విక్రయించాలని అడగ్గా వెంటనే ఇంట్లోంచి తెచ్చి చేతిలో పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న మరో భక్తుడు ఆ గ్రామానికి వెళ్లి అదే పెద్దమనిషితో మాట్లాడి సెల్ఫోన్ తెచ్చుకున్నారు. ఈ ఫోన్లలోని సిమ్లు మాయం చేసి రెండు గంటల వ్యవధిలోనే వాటిలో సాఫ్ట్వేర్ మొత్తాన్ని తొలగించటం విశేషం. బోనకల్లులో ఇటీవల జరిగిన ఓ సభలోనూ ఇదే మాదిరిగా పది సెల్ఫోన్లను దొంగ తస్కరించాడు. కొంతమంది జేబులను ఖాళీ చేశాడు. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి సెల్ఫోన్ను సైతం ఇటీవల చోరీ చేశాడు. సదరు అధికారి తమ సిబ్బందిని పంపించి అతడికి రూ.5వేలు చెల్లించి సెల్ఫోన్ను స్వాధీనపరచుకోవటం గమనార్హం. దొంగ ఆగడాలపై ‘న్యూస్టుడే’ ఫోన్లో సంప్రదించినా స్థానిక పోలీసులు స్పందించలేదు.
మధిర, న్యూస్టుడే
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివిధ అనుమతులకు సువిధ
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దపీట వేస్తోంది. ఇప్పటికే అనేక యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
భాజపాను ఆశీర్వదించండి
[ 20-04-2024]
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన భాజపాను ఖమ్మం ప్రజలు లోక్సభ ఎన్నికల్లో ఆశీర్వదించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కోరారు. -
వర్షాకాలం రాకముందే పనులు ప్రారంభించాలి: మంత్రి తుమ్మల
[ 20-04-2024]
వర్షాకాలం సమీపించకముందే మున్నేరు కేబుల్ వంతెన సీసీ పనులు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
ఖమ్మం మార్కెట్కు మరింత ఆదాయం
[ 20-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు రూ.2,761 కోట్ల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిగాయి. -
భారాసకు మాజీ ఎమ్మెల్యే రాములునాయక్ రాజీనామా
[ 20-04-2024]
భారాసకు రాజీనామా చేస్తున్నట్లు వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ శుక్రవారం ప్రకటించారు. 2018 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన తాను కేవలం అభివృద్ధి కోసం షరతులు లేకుండా భారాసలో చేరానన్నారు. -
రైతుల ఆదాయం రెట్టింపునకు కృషి
[ 20-04-2024]
రైతుల ఆదాయం రెట్టింపయినప్పుడే వారి శ్రమకు ప్రతిఫలం దక్కినట్లని తెలంగాణ ఆయిల్ఫెడ్ ఎండీ కె.అశోక్రెడ్డి అన్నారు. -
ప్రచారం హద్దు మీరితే.. శ్రీముఖం తధ్యం!
[ 20-04-2024]
ప్రస్తుతం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల పరిధిలో ప్రచారం జోరందుకుంది. నాలుగో దశలో జరగనున్న పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 18వ తేదీనే నామినేషన్ ప్రక్రియ మొదలైంది. -
వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్
[ 20-04-2024]
సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. -
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం