కలిసిమెరిసి..
ఉద్యోగం, కుటుంబ బాధ్యతలతో నిత్యం తలమునకలయ్యే మహిళలకు విహారయాత్రలు ఊరట కలిగిస్తున్నాయి. ఖమ్మం నగరంలోని కొంతమంది అతివలు బృందాలుగా ఏర్పడి ఎంచక్కా పర్యాటక ప్రదేశాలను చుట్టేసి వస్తున్నారు.
ఖమ్మం బల్లేపల్లి, న్యూస్టుడే
దుబాయ్ విహారయాత్రలో అతివల ఉల్లాసం
ఉద్యోగం, కుటుంబ బాధ్యతలతో నిత్యం తలమునకలయ్యే మహిళలకు విహారయాత్రలు ఊరట కలిగిస్తున్నాయి. ఖమ్మం నగరంలోని కొంతమంది అతివలు బృందాలుగా ఏర్పడి ఎంచక్కా పర్యాటక ప్రదేశాలను చుట్టేసి వస్తున్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా స్వీయవిశ్వాసంతో భారతదేశంలోని ప్రసిద్ధ ప్రదేశాలు, పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. నేపాల్, సింగపూర్, దుబాయ్ ప్రాంతాలకు సైతం వెళుతున్నారు. కలిసికట్టుగా ప్రయాణిస్తూ ఆనందాన్ని పొందుతున్నారు.
బాధ్యతలతో సాగిపోయే జీవితంలో పిల్లలు పెద్దయ్యాక అతివలు తమ కోసం సమయం కేటాయిస్తున్నారు. అందుకు కుటుంబ సభ్యులు సైతం ప్రోత్సాహం అందిస్తున్నారు. మహిళలు బృందాలుగా ఏర్పడి ప్రయాణ తేదీలను నెలరోజుల ముందే ఖరారు చేసుకుంటున్నారు. విమాన, రైలు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవటానికి ఆర్థిక గణాంకాలతో యాత్ర ఖర్చుల జాబితాను రూపొందించుకుంటున్నారు.
బుద్ధగయను సందర్శించిన మహిళలు
ప్రకృతిని ఆస్వాదిస్తూ.. చరిత్రను తెలుసుకుంటూ..
ఎవరూ నొచ్చుకోకుండా ఖర్చులను బేరీజు వేసుకొని ఈ బృందాల్లోని ఒకరు యాత్ర కాలంలో నాయకత్వం వహిస్తున్నారు. ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తున్నారు. పురాతన కట్టడాలు, ప్రసిద్ధ స్థలాలను సందర్శిస్తూ చరిత్రను తెలుసుకుంటున్నారు. కొన్ని కోలాటబృందాల సభ్యులు భక్తిభావంతో ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించి తరిస్తున్నారు. భిన్న సంస్కృతులను తిలకిస్తూ ఉత్తేజాన్ని పొందుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఆరోగ్యకర ఆహారం రుచి చూసి స్వస్థలానికి చేరుకున్న తర్వాత ప్రయోగాలు చేస్తున్నారు. రోజువారీ విధులకు ఆటంకం కలగకుండా పండగ, వేసవి సెలవుల్లో వనితా విహారం సాగుతోంది.
విహార యాత్రలో క్రేజీ కిట్టీ పార్టీ బృందం
దేశ, విదేశాల్లో విహారం
-గోళ్ల సౌభాగ్య, ఉపాధ్యాయురాలు, ఖమ్మం
22 ఏళ్లుగా దేశంలోని వివిధ ప్రాంతాలను మా స్నేహితులతో కలిసి సందర్శిస్తున్నాను. మా బృందంలో ఎనిమిది మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయినులు, మరో ఇద్దరు గృహిణులు ఉన్నారు. కశ్మీర్, గోవా, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో విహరించాం. మహిళలు కలిసికట్టుగా ప్రయాణించటం వల్ల రక్షణ ఉంటుంది.
ఉల్లాసం నింపే ప్రయాణం
-పోటు రజిత, గృహిణి, ఖమ్మం
ఆరేళ్ల నుంచి మా కోలాటబృందం వివిధ పుణ్యక్షేత్రాలను సందర్శించింది. తితిదే దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా దేశంలోని వివిధ ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్తున్నాం. శ్రీశైలం, తిరుపతి, అయోధ్య, బుద్ధగయ, వారణాసి, నైమి శారణ్యం, ఛార్దామ్ ప్రాంతాలను దర్శించుకున్నాం. కొత్త ప్రదేశాలు, నది ప్రయాణం ఉల్లాసాన్ని కలిగించాయి.
కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం..
-రావూరి రుక్మిణి
విహారయాత్రల ద్వారా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. యోగా డే, మహిళా దినోత్సవం వంటి వేడుకలను మా బృందం తరఫున పర్యాటక ప్రదేశాల్లో జరుపుకొంటాం. ఆరోగ్యం, ఆనందం, పిల్లల చదువులు, కష్టసుఖాలను పంచుకుంటాం. వంటసామగ్రితో ప్రత్యేకంగా వాహనంలో ప్రయాణం సాగిస్తాం. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు, కంచి, అరుణాచల్ప్రదేశ్లోని పుణ్యక్షేత్రాలకు వెళ్లొచ్చాం.
ఆటపాటలతో సరదాగా..
-అనుముల హైమావతి, ఖమ్మం
ఖమ్మం పరిసర ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలు, పార్కులకు వెళ్తుంటాం. ఐదేళ్లుగా క్రేజీ కిట్టీ పార్టీ పేరిట వివిధ ప్రదేశాలను సందర్శిస్తున్నాం. పచ్చని వనాల్లో ఆటపాటలతో ఉల్లాసంగా వేడుకలు జరుపుకొంటున్నాం. సరదాగా ఆటల పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అందుకుంటాం. విజయవాడకు ఒకసారి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం
[ 24-04-2024]
బర్లగూడెం గ్రామంలో రాష్ట్రస్థాయిలో ఆర్ఆర్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్, బర్లగూడెం ఎక్సలెంట్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను శాసనసభ్యుడు కోరం కనకయ్య ప్రారంభించారు. -
నామినేషన్ దాఖలు చేసిన భారాస ఎంపీ అభ్యర్థి నామా
[ 24-04-2024]
పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. -
ఓటుకు పోటెత్తేలా
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2019లో జరిగిన సార్వత్రిక సమరంలో పోలింగ్ శాతం తక్కువ నమోదవటంపై కారణాలు అన్వేషించింది. -
అయిదో రోజూ నామినేషన్ల సందడి
[ 24-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో అయిదో రోజు మంగళవారం ఎనిమిది మంది అభ్యర్థులు పదకొండు సెట్ల నామపత్రాలను మంగళవారం సమర్పించారు. -
ప్రచార తీరు.. మారింది గురూ..!
[ 24-04-2024]
ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే ఊరూరా ర్యాలీలు, మైకుల హోరుతో ప్రచారం జోరుగా సాగేది. శాసనసభ, లోక్సభ స్థానాల బరిలో నిలిచిన అభ్యర్థులు కనీసం ఒక్కసారైనా ప్రతి గ్రామాన్ని చుట్టేసి వచ్చేవారు. -
అడుగడుగునా అడ్డంకులే..
[ 24-04-2024]
సీతారామ ప్రధాన కాలువ నీటిని వైరా జలాశయానికి అనుసంధానం చేసే కాలువ పనులకు అడగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. -
భద్రాచలం నుంచి తొలి మంత్రి కమలకుమారి
[ 24-04-2024]
ఉద్యోగం వదిలి ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన కర్రెద్దుల కమలకుమారి భద్రాచలం ఎంపీగా నెగ్గి కేంద్రంలో సహాయ మంత్రిగా ఉండి మన్యానికి సేవలు అందించారు. -
పడిపోతున్న ఎండు మిరప ధరలు
[ 24-04-2024]
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో ఎండు మిరప ధరలు పడిపోతున్నాయి. రోజురోజుకు ధరలు తగ్గటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
దేశ యవనికపై అశ్వారావుపేట పూర్వ విద్యార్థులు సత్తా
[ 24-04-2024]
దేశ యవనికపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపికలో ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. -
కోల్ ప్లాంట్ కింగ్
[ 24-04-2024]
కేటీపీఎస్ ఐదు, ఆరు దశల కర్మాగారాల కోల్ ప్లాంట్లో పనిచేసే ఓ అధికారిపై కార్మికులు, ఉద్యోగులు వివిధ ఆరోపణలు చేస్తున్నారు. -
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల పనులపై కలెక్టర్ సమీక్ష
[ 24-04-2024]
‘అమ్మ’ ఆదర్శ పాఠశాలల్లో చేపట్టిన పనుల పూర్తి బాధ్యత హెచ్ఎంలదే అని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్ నుంచి హెచ్ఎంలతో వీడియోకాన్ఫరెన్స్లో మంగళవారం మాట్లాడారు. -
అన్నీ బాగుంటేనే అనుమతులు
[ 24-04-2024]
ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈనెల 19 నుంచి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం