ఆశలు గాలికి..
దేశవ్యాప్తంగా నూతనంగా 152 విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు తాజా కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు సాంకేతిక చిక్కులు
పాల్వంచ పట్టణం, న్యూస్టుడే: దేశవ్యాప్తంగా నూతనంగా 152 విమానాశ్రయాలను నిర్మించనున్నట్లు తాజా కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. తెలంగాణలో ఎన్నింటిని నిర్మిస్తున్నారో చెప్పాలని భారాస మహబూబాబాద్, చేవెళ్ల, పెద్దపల్లి ఎంపీలు మాలోత్ కవిత, బొర్లకుంట వెంకటేశ్ నేత, రంజిత్రెడ్డిలు అడిన ప్రశ్నకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి జనరల్ వీకే సింగ్ బదులిచ్చారు. వరంగల్, ఆదిలాబాద్లలో బ్రౌన్ ఫీల్డ్, నిజామాబాద్ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలు త్వరలో అభివృద్ధి చేయనున్నట్లు సమాధానమిచ్చారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలో గతంలో ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం సాంకేతికంగా అసాధ్యమని తేల్చిచెప్పారు. దీంతో ‘కొత్తగూడెం విమానాశ్రయం’ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెం, మహబూబ్నగర్, పెద్దపల్లి, నిజామాబాద్లో నూతన విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు గతంలో ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రతిపాదిత ప్రాంతాల్లో ‘గరిష్ఠ వరదల స్థాయి’ నివేదిక కోరుతూ ఏఏఐ అధికారులు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ సీఈకి 2020లో లేఖ రాశారు. సీఈ ఆదేశాలతో ఆయా జిల్లాల ఆర్అండ్బీ ఎస్ఈలు నివేదికలు అందజేశారు. అన్నిచోట్ల సానుకూల పరిస్థితులున్నట్లు పేర్కొన్నారు. నివేదికల ఆధారంగా కొన్నాళ్లకు ఏఏఐ బృందం వచ్చి క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. బృందం నివేదిక ఆధారంగా తాజాగా పార్లమెంటు సమావేశాల్లో సివిల్ ఏవియేషన్ మంత్రి మరింత స్పష్టత ఇచ్చారు. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్లలో సాంకేతికంగా ఇబ్బందుల్లేవన్నారు. అక్కడ ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు నిర్ణీత గడువులోగా స్థల సేకరణ చేపట్టాలన్నారు. కొత్తగూడెం ఎయిర్పోర్ట్కు మాత్రం సాంకేతిక గుర్తింపు లేదన్నారు.
1,600 ఎకరాలు చూపినా...
కేంద్రం 2016లో ‘ఉడాన్’ (ఉడో దేశ్కీ ఆమ్ నాగరిక్) పథకాన్ని ప్రారంభించింది. హిందీ భాషలో ‘విమానం’ అని అర్థం. విమాన ప్రయాణాన్ని సరసమైన ధరలకే అన్ని ప్రాంతాల ప్రజలకు అందుబాటులోకి తేవడం, ఇప్పటికే ఉన్న ప్రాంతీయ విమానాశ్రయాలను మరింత విస్తరించడం ఈ పథకం ఉద్దేశం. కొత్తగూడెంలో విమానాశ్రయ ఏర్పాటుకు లక్ష్మీదేవిపల్లి మండలంలోని పునుకుడుచెలక పరిధిలోనున్న 1,600 ఎకరాలను రెవెన్యూ అధికారులు చూపారు. ఏఏఐ అధికారులు రెండేళ్ల క్రితం క్షేత్రస్థాయి సర్వే చేశారు. ఆ స్థలమంతా ‘వైల్డ్లైఫ్’ పరిధిలో ఉండటంతో ప్రత్యామ్నాయంగా పాల్వంచ పట్టణం పరిధిలోని పిల్లవాగు, గుడిపాడు సమీపంలోని సర్వే నంబరు 999లో వెయ్యి ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని అప్పటి జిల్లా కలెక్టర్ డా.ఎంవీ రెడ్డి పరిశీలించి ఎయిర్పోర్ట్ అథారిటీ వారికి సమాచారమిచ్చారు. ఆ సంస్థ అధికారులు కూడా పరిశీలించి వెళ్లారు. తీరా చూస్తే.. సాంకేతిక గుర్తింపు లేదని కేంద్ర విమానయాన శాఖ మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసి సాంకేతిక ఆటంకాలకు పరిష్కారం చూపితే విమానాశ్రయం కల నెరవేరే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస హయాంలోనే ఉభయ జిల్లాల అభివృద్ధి: హరీశ్రావు
[ 25-04-2024]
ఖమ్మం జిల్లా అభివృద్ధికి గత భారాస ప్రభుత్వం పనిచేస్తే.. కాంగ్రెస్ సర్కారులో మంత్రి పదవులు పొందిన నేతలు మాత్రం తమ కుటుంబీకులకు ఎంపీ టికెట్ ఇప్పించుకునేందుకు అధిష్ఠానం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. -
కూలీ బిడ్డకు 993 మార్కులు
[ 25-04-2024]
మారుమూల గిరిజన బిడ్డ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయిలో అధిక మార్కులు సాధించింది. బుధవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో భద్రాద్రి జిల్లా -
కేసీఆర్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలి: తెదేపా
[ 25-04-2024]
మాజీ సీఎం కేసీఆర్ అబద్దపు జోస్యాలు, తప్పుడు ప్రచారాలు మానుకోవాలని తెదేపా ఖమ్మం పార్లమెంటరీ కమిటీ అధ్యక్షుడు కేతినేని హరీశ్ చంద్ర హితవు పలికారు. -
భాజపాతోనే సమగ్రాభివృద్ధి: తాండ్ర
[ 25-04-2024]
భాజపా గెలుపుతోనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ ఖమ్మం లోక్సభ అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. -
గంజాయి పేరెత్తకుండా
[ 25-04-2024]
ఏపీ సరిహద్దునున్న మన్యం జిల్లా భద్రాద్రి కొత్తగూడెంలో కొంతకాలంగా గంజాయి ఎక్కువగా పట్టుబడుతోంది. రవాణా, విక్రయ ఘటనల్లో చిక్కే నిందితుల్లో ఎక్కువ మంది యువతే కావడం ఆందోళనకరం. -
మలేరియా కట్టడికి పరిశుభ్రత మంత్రం
[ 25-04-2024]
మైదాన ప్రాంతాలతో పోల్చిచూస్తే భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లోనే మలేరియా జ్వరాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. -
ఓటరు తుది జాబితాలో తప్పులు ఉండొద్దు: కలెక్టర్
[ 25-04-2024]
ఓటు నమోదు దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ ప్రియాంక అల అధికారులను ఆదేశించారు. ఓటరు తుది జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలన్నారు. -
తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడతా: ఎంపీ నామా
[ 25-04-2024]
తెలంగాణ ప్రయోజనాల కోసం, అభివృద్ధి కోసం పార్లమెంటు పోరాడేందుకు మరోసారి తనకు అవకాశం కల్పించాలని భారాస లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. -
ఆరో రోజు 21 సెట్ల నామినేషన్లు దాఖలు
[ 25-04-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో ఆరోరోజు బుధవారం 14 మంది అభ్యర్థులు 21 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు -
ఓటర్ల తుది జాబితా అభ్యర్థులకు అందించాలి
[ 25-04-2024]
లోక్సభ నియోజకవర్గాల వారీగా ఓటర్ల తుది జాబితా సిద్ధం చేసి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!